Ashwini Choubey : కనిపిస్తే కాల్చేయాలి.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashwini Choubey : కేంద్ర మంత్రి అశ్విని చౌబే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో హత్యకు గురైన గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ను కీర్తిస్తూ నినాదాలు చేస్తున్న వారు కనిపిస్తే కాల్చేయాలన్నారు. శుక్రవారం బిహార్ రాష్ట్ర రాజధాని పాట్నా జిల్లాలో శుక్రవారం ప్రార్థనా సంఘం వద్ద ఒక వ్యక్తి అతీక్కు మద్దతుగా, ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన సంఘటనపై చౌబే మండిపడ్డారు. ‘‘జుమ్మా నమాజ్ చేసిన తర్వాత వారిలో ఒకరు ‘అతిక్ అహ్మద్ అమర్ రహే’ అని అరిచాడు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేసాడు’’ అని పాట్నా సిటీ ఎస్పీ వైభవ్ శర్మ తెలిపారు. ఈ విషయంపై మంత్రి అశ్విని చౌబే ఆగ్రహం వ్యక్తం చేసి మాట్లాడారు. ఈ సంఘటన చాలా విచారకరం. బీహార్లో ఇటువంటి ప్రకటనలు, నినాదాలు చేయడం దురదృష్టకరం. అలాంటి వారిని వెంటనే కాల్చివేయాలన్నారు.
Read Also: Telangana congress : టీపీసీసీ ఆధ్వర్యంలో విద్యార్థి నిరుద్యోగ నిరసన ప్రదర్శన
Also Read
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- Astrology: జూలై 3 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని మోదీలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంపై ‘‘దేశ ప్రధానికి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పేర్లు పెట్టుకుని నినాదాలు చేసిన తీరు కూడా చాలా దురదృష్టకరం’’ అని అన్నారు. అదే సమయంలో బిహార్ ప్రభుత్వంపై అశ్విని చౌబే విమర్శలు గుప్పించారు. టెర్రరిజం, మాఫియా వంటి నేరస్థులను విడిచిపెట్టని ‘యోగి’ మోడల్ బీహార్లో మనకు అవసరమన్నారు. బీహార్లో కేవలం మామ-మేనల్లుడి వంశం, కులవివక్ష ప్రభుత్వం నడుస్తోందని అశ్విని చౌబే ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీని టార్గెట్ చేస్తూ సీఎం నితీశ్ కుమార్ ప్రకటనలు చేస్తున్నారని.. 2025లో రాష్ట్రంలో యోగి మోడల్ను ఎంచుకుని ప్రజలే వారికి సమాధానం చెబుతారంటూ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో బీహార్ ప్రజలు యోగి మోడల్ను అధికారంలోకి తీసుకువస్తారని.. బీహార్లో కూడా బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్త పరిచారు.
Read Also: Weather Updates : తెలంగాణలో పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడా వడగళ్ల వాన
తాజావార్తలు
-
CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
Telegram, Signal: వాట్సాప్ యూజర్నేమ్ వివాదం.. టెలిగ్రామ్, సిగ్నల్కు కేంద్రం నోటీసులు.. కారణమేంటి?
-
T20 World Cup 2026: సెమీస్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఢీ!
-
Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!