HYD Wife Death: భార్యాభర్తలిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.. కానీ ఏం లాభం!
- మాధవితో కుర్వ శివకు మూడేళ్ల క్రితం వివాహం
- ఇద్దరు హైదరాబాద్లోనే నివాసం
- వీరికి ప్రస్తుతం 11నెలల కుమారుడు
- భార్య మాధవిపై అనుమానంతో పలుసార్లు గొడవలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్యోన్యంగా సాగుతున్న కాపురంలో అనుమానం పెనుభూతమైంది. అనుమానంతో నిత్యం వేధిస్తున్న భర్త నుంచి ఆ ఇల్లాలు దూరంగా వెళ్లిపోయింది. కాని అలా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్య.. తమిళనాడులో శవమై కనిపించింది. అసలు ఆ భార్యభర్త మధ్య ఏం జరిగింది? జోగులాంబ గద్వాల్ జిల్లా కొండపల్లికి చెందిన మాధవితో వనపర్తి జిల్లా నాగల్ కడ్మూర్కి చెందిన కుర్వ శివకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య, భర్తలు ఇద్దరు హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నారు. పెళ్లైన కొత్తలో ఇరువురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసేవారు. వీరికి ప్రస్తుతం సుమారు 11నెలల కుమారుడు ఉన్నాడు. దంపతులిద్దరూ ఉద్యోగులు కావడంతో అన్యోన్యంగా సాగుతున్న వీరి సంసారానికి.. భర్త శివ అనుమానం చీడ పురుగుగా మారింది. భార్య మాధవిపై అనుమానంతో పలుసార్లు ఇరువురి మధ్య గొడవలు జరిగాయి.
Also Read:Perni Nani: మహిళా జెడ్పీ చైర్పర్సన్పై హత్యాయత్నానికి ప్రయత్నించిన వారే సైకోలు..
Also Read
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- Riyan Parag: ఆ ఒక్కటే మా ఓటమిని శాసించింది.. రాజస్థాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.!
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- Astrology: మే 30 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
చిన్నగా మొదలైన ఈ గొడవలు కాస్తా.. పెద్దల పంచాయితీ వరకు వెళ్లాయి. అనేక మార్లు పంచాయితీలు పెట్టిన భర్త శివ బుద్ధిలో ఎలాంటి మార్పు రాకపోగా అనుమానం మరింత ఎక్కువైంది. దీంతో భార్య మాధవికి అనేక ఆంక్షలు విధించాడు. ఈ క్రమంలో 2 నెలల క్రితం మాధవిని ఉద్యోగం కూడా మాన్పించాడు. ఆమె ఫోన్ నెంబర్ను బ్లాక్ చేయించాడు. దీంతో ఇరువురి మధ్య గొడవలు మరింత ముదిరాయి. భర్త అనుమానంతో మాధవి తీవ్ర మనస్థాపానికి గురైంది. భర్త ఇంట్లో లేని సమయం చూసి ఇంట్లొ నుంచి వెళ్లిపోయింది. సాయంత్రం వరకు అక్కడ ఇక్కడ ఆరా తీసిన భర్త శివ.. చివరకు హైదరాబాద్ లోని పహడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Also Read:JioPC: ఇది కదా కావాల్సింది.. జియోపీసీని ప్రారంభించిన జియో.. ఇకపై టీవీనే కంప్యూటర్గా..
హైదరాబాద్లో అదృశ్యమైన మాధవి తమిళనాడులోని కోయంబత్తూర్ రైల్వే ట్రాక్ పై విగతజీవిగా కనిపించింది. రైల్వే ట్రాక్పై మాధవి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆమె ఆధార్ కార్డులోని వివరాల ద్వారా ఆమె తండ్రికి సమాచారం ఇచ్చారు. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి మాధవి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అంచనా వేశారు. ఇక పోలీసుల సమాచారంతో ఘటనాస్థలికి వెళ్లిన మాధవి తల్లిదండ్రులు, భర్త శివ అక్కడే పోస్టుమార్టం నిర్వహించి డెడ్ బాడీని అత్తగారింటికి తరలించారు. విషయం తెలుసుకున్న మాధవి కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహించారు. భర్త శివ కుటుంబ సభ్యులపై దాడికి దిగడంతో నాగల్ కడ్మూర్ లో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. భర్త శివ వేధింపులు, చిత్రహింసలు తట్టుకోలేక మాధవి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు.
తాజావార్తలు
-
Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
-
Riyan Parag: ఆ ఒక్కటే మా ఓటమిని శాసించింది.. రాజస్థాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.!
-
Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
-
Vaibhav Sooryavanshi: ఆరెంజ్ క్యాప్తో కన్నీళ్లు దాచుకుంటూ.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
-
Astrology: మే 30 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..