Keir Starmer India Visit 2025: రేపటి నుంచి భారత్లో బ్రిటన్ ప్రధాని పర్యటన.. ఎందుకో తెలుసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Keir Starmer India Visit 2025: బ్రిటిన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి భారతదేశ పర్యటనకు రానున్నారు. ఇంతకీ ఆయన దేశంలో ఎప్పుడు పర్యటించనున్నారో తెలుసా.. రేపటి నుంచే. ఆయన అక్టోబర్ 8 నుంచి 9 వరకు దేశంలో . ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కీర్ స్టార్మర్ భారత్ పర్యటనకు వస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతిక సహకారంతో సహా రెండు దేశాల మధ్య కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. భారతదేశం-యుకె ఉచిత వాణిజ్య ఒప్పందం (FTA) అని కూడా పిలువబడే.. భారతదేశం-యుకె సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA) గురించి కూడా ఇరుదేశాధినేత సమావేశంలో చర్చించనున్నారు.
READ ALSO: Rashmika – Rukmini : రష్మికకు చెక్ పెడుతున్న సెన్సేషనల్ హీరోయిన్..
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
ఆమోదం వస్తే.. సుంకాలు తొలిగిపోనున్నాయి
ఈ ఒప్పందం బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదం పొందితే రెండు దేశాల మధ్య 90% కంటే ఎక్కువ వస్తువులపై సుంకాలను తొలగిస్తుంది. స్టార్మర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం ముంబైలో జరిగే గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ (GFF)కి హాజరుకానున్నారు. అక్కడ వారు భారతదేశం-UK టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ (TSI) గురించి చర్చిస్తారు. ఈ చొరవ టెలికాంలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్నాలజీ వంటి కీలకమైన ఖనిజాల రంగాలలో సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ పర్యటనలో బ్రిటిష్ ప్రధానమంత్రితో పాటు 100 మందికి పైగా వ్యాపార నాయకులు, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లు, సాంస్కృతిక ప్రముఖులు రానున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 23 – 24 తేదీలలో అధికారిక పర్యటన కోసం UKని సందర్శించారు.
భారతదేశం – UK మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం విజన్ 2025 రోడ్మ్యాప్ను ముందుకు తీసుకెళ్లడంపై ఇరుదేశాలు దృష్టి పెడుతున్నాయి. ఈ దార్శనికత ప్రకారం.. రెండు దేశాలు రాబోయే 10 ఏళ్లలో అన్ని రంగాలలో సహకారాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. UK-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (UKIBC) ఛైర్మన్ రిచర్డ్ హీల్డ్ మాట్లాడుతూ.. ఈ పర్యటన రెండు దేశాల మధ్య భాగస్వామ్య శ్రేయస్సుపై ఆధారపడి ఉందని అన్నారు. UK ప్రభుత్వ డేటా ప్రకారం.. భారతదేశం – UK మధ్య మొత్తం వాణిజ్యం ఇప్పుడు దాదాపు 44.1 బిలియన్ యూరోలు (సుమారు ₹4.5 లక్షల కోట్లు) ఉంది. తాజా బ్రిటన్ ప్రధాని పర్యాటన ఉద్దేశం ఏమిటంటే 2030 నాటికి ఈ వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బ్రిటిష్ ఎయిర్వేస్ సీఈఓ సీన్ డోయల్ కూడా భారతదేశానికి విమానాలను విస్తరించే ప్రణాళికలను ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఎయిర్లైన్ ఐదు ప్రధాన భారతీయ నగరాల (ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై) నుంచి వారానికి 56 విమానాలను నడుపుతోంది.
READ ALSO: Papua New Guinea Earthquake: ద్వీప దేశంలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?