Palestine Recognition: ఇజ్రాయెల్కు గర్వభంగం.. పాలస్తీనా విషయంలో గట్టి దెబ్బ కొట్టిన నాలుగు దేశాలు..
- ఐఫెల్ టవర్పై పాలస్తీనా జెండా
- పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించిన బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్
Palestine Recognition: ఐక్యరాజ్యసమితి సమావేశం ప్రారంభానికి ముందు ఇజ్రాయెల్కు నాలుగు దేశాలు గట్టి దెబ్బ కొట్టాయి. ఇంతకీ ఆ దెబ్బ ఏంటని ఆలోచిస్తున్నారా.. ఈ నాలుగు దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి. ఇందులో ఒక దేశం అయిన బ్రిటన్ తాజాగా సవరించిన మ్యాప్ను విడుదల చేసింది. ఈ మ్యాప్లో ఇజ్రాయెల్కు ఆనుకుని ఉన్న పాలస్తీనా ప్రత్యేక దేశంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని ప్రసిద్ధ ఐఫిల్ టవర్పై పాలస్తీనా జెండాను ఎగురవేశారు. ఫ్రాన్స్లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక వైపు పాలస్తీనా జెండా, మరోవైపు ఇజ్రాయెల్ జెండా కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఐక్యరాజ్యసమితి సమావేశం ప్రారంభానికి ముందు యూరప్లో ఇజ్రాయెల్ – పాలస్తీనా సమస్య హైలైట్ కావడం ఇదే మొదటిసారి అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: CM Chandrababu: మహారాష్ట్ర, యూపీని అధిగమించి.. ఏపీ నెంబర్వన్ కావాలి!
Also Read
- 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
- Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
24 గంటల్లో 4 దేశాలు..
గడిచిన 24 గంటల్లో బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్ దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయి. పాలస్తీనా విషయంలో ఈ నాలుగు దేశాల మద్దతు ఇజ్రాయెల్కు పెద్ద దెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన తర్వాత చాలా యూరోపియన్ దేశాలు పాలస్తీనాకు మద్దతు ఇస్తున్నాయి. అంతేకాకుండా ఐక్యరాజ్యసమితిలోని ఐదు శాశ్వత సభ్యులలో నాలుగు ఇప్పటికే పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయి. కేవలం అమెరికా మాత్రమే పాలస్తీనాను ప్రత్యేక దేశంగా వ్యతిరేకిస్తోంది. ఈ నాలుగు శాశ్వత సభ్యులతో పాటు 150 కి పైగా దేశాలు పాలస్తీనాను మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లోనే పాలస్తీనాకు సంబంధించిన బిల్లును ఐక్యరాజ్యసమితి ముందుకు తీసుకురావడానికి సౌదీ అరేబియా, ఫ్రాన్స్ ప్రయత్నిస్తున్నాయి.
ప్రత్యేక దేశంగా పాలస్తీనా..
ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య యుద్ధం 1948 నుంచి కొనసాగుతోంది. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ పాలస్తీనాలో తన పట్టును క్రమంగా పెంచుకుంటుంది. ఇజ్రాయెల్ను ఎదుర్కోవడానికి సౌదీ అరేబియా రెండు దేశాల సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చింది. దీంతో రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం పరిష్కరించడంతో పాటు, పాలస్తీనా ఒక ప్రత్యేక దేశంగా అవరిస్తుందని పేర్కొంది. ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంటే ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన ముగుస్తుందని సౌదీ అరేబియా చెబుతోంది. ప్రస్తుతం పాలస్తీనాకు ప్రభుత్వం లేదు. హమాస్ పాలస్తీనా పరిపాలనను నియంత్రిస్తోంది.
READ ALSO: PM Modi: జీఎస్టీ తగ్గింపుపై దేశ ప్రజలందరికీ ప్రధాని బహిరంగ లేఖ..
తాజావార్తలు
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
-
Anil Ravipudi: ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?
-
Mega 158 Update: ‘మెగా 158’ నుంచి ఊరమాస్ అప్డేట్! బాబీ మార్క్ ‘స్వాగ్’తో బాస్ లుక్.. చూశారా?
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!