Aaditya Thackeray: బీజేపీకి 40 సీట్లు కూడా వచ్చేవి కావు.. ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు
- ఉద్ధవ్ సేన నేత ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు
- ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించకుంటే..
- బీజేపీ 40 సీట్లు కూడా గెలుచుకునే అవకాశం ఉండేది కాదు- ఆదిత్య ఠాక్రే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్ధవ్ సేన నేత ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించకుంటే బీజేపీ 40 సీట్లు కూడా గెలుచుకునే అవకాశం ఉండేది కాదని తెలిపారు. ముంబై నార్త్వెస్ట్ సీటులో తాము గెలుస్తున్నామని, ఫౌల్ ప్లే చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికల ఫలితాన్ని కోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. దీనితో పాటు.. ఎన్నికల కమిషన్పై ప్రశ్నలు లేవనెత్తారు. ఇది ఎన్నికల కమిషన్ కాదు, ‘ఈజీగా రాజీ’ అని ఆరోపించారు. మరోవైపు.. ఇంతకు ముందు ఉద్ధవ్ సేన శనివారం ఎన్నికల కమిషన్పై తీవ్ర విమర్శలు గుప్పించింది.
Home Minister Anitha: గంజాయి వ్యాపారులు, వినియోగదారులకు హోంమంత్రి మాస్ వార్నింగ్..
Also Read
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
ముంబై నార్త్వెస్ట్లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కేవలం 48 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో.. శివసేన అభ్యర్థి రవీంద్ర వైకర్ గెలుపుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకు సంబంధించి ఇటీవల ఒక వీడియో బయటపడింది. వైకర్ బంధువు కౌంటింగ్ రోజున కౌంటింగ్ వేదిక లోపల తన మొబైల్ను ఉపయోగిస్తున్నట్లు కనిపించింది. తన మొబైల్ నుంచి ఈవీఎంను హ్యాక్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపైనే ఉద్ధవ్ సేన తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ విషయమై ఉద్ధవ్ సేన అభ్యర్థి అమోల్ కీర్తికర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ వేదిక వద్ద మొబైల్ ఫోన్లు వాడడం నిషేధమని, అలాంటప్పుడు అక్కడ ఫోను ఎందుకు ఉందని ఆయన ప్రశ్నించారు.
Pavitra Gowda : హీరో దర్శన్ ప్రియురాలు పవిత్ర మొదటి భర్త ఎవరో తెలుసా?
ఈ క్రమంలో.. ఉద్ధవ్ సేన నేత ఆదిత్య ఠాక్రే మరో అడుగు ముందుకేసి కోర్టుకు వెళ్తానంటున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు రవీంద్ర వయ్కర్ బంధువు మంగేష్ వసంత్ పాండిల్కర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో మొబైల్ ఫోన్ వాడినందుకుగానూ అతడిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో దినేష్ గౌరవ్ అనే వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పండిల్కర్కు మొబైల్ ఫోన్ ఇచ్చినట్లు దినేష్పై ఆరోపణలు ఉన్నాయి. దినేష్ గౌరవ్ ఎన్నికల పోల్ పోర్టల్కు ఆపరేటర్గా పనిచేస్తున్నారు. మరోవైపు.. కౌంటింగ్ రోజు ఓట్లను తిరిగి లెక్కించాలని తాను డిమాండ్ చేశానని, అయితే తన డిమాండ్ను పట్టించుకోలేదని అమోల్ కీర్తికర్ ఆరోపించారు. ప్రతి రౌండ్ కౌంటింగ్ తర్వాత అంకెలు చెబుతున్నామని, అయితే 19వ రౌండ్ తర్వాత ఇది జరగలేదని కీర్తికర్ చెప్పారు. బదులుగా.. 26వ రౌండ్ తర్వాత ఫలితం నేరుగా ప్రకటించారని, అందులో వైకర్ విజేతగా ప్రకటించారని తెలిపారు.
తాజావార్తలు
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్కు కౌంట్డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్తో వస్తోన్న అల్లు అర్జున్
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!