Aaditya Thackeray: బీజేపీకి 40 సీట్లు కూడా వచ్చేవి కావు.. ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు
- ఉద్ధవ్ సేన నేత ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు
- ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించకుంటే..
- బీజేపీ 40 సీట్లు కూడా గెలుచుకునే అవకాశం ఉండేది కాదు- ఆదిత్య ఠాక్రే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్ధవ్ సేన నేత ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించకుంటే బీజేపీ 40 సీట్లు కూడా గెలుచుకునే అవకాశం ఉండేది కాదని తెలిపారు. ముంబై నార్త్వెస్ట్ సీటులో తాము గెలుస్తున్నామని, ఫౌల్ ప్లే చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికల ఫలితాన్ని కోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. దీనితో పాటు.. ఎన్నికల కమిషన్పై ప్రశ్నలు లేవనెత్తారు. ఇది ఎన్నికల కమిషన్ కాదు, ‘ఈజీగా రాజీ’ అని ఆరోపించారు. మరోవైపు.. ఇంతకు ముందు ఉద్ధవ్ సేన శనివారం ఎన్నికల కమిషన్పై తీవ్ర విమర్శలు గుప్పించింది.
Home Minister Anitha: గంజాయి వ్యాపారులు, వినియోగదారులకు హోంమంత్రి మాస్ వార్నింగ్..
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
ముంబై నార్త్వెస్ట్లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కేవలం 48 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో.. శివసేన అభ్యర్థి రవీంద్ర వైకర్ గెలుపుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకు సంబంధించి ఇటీవల ఒక వీడియో బయటపడింది. వైకర్ బంధువు కౌంటింగ్ రోజున కౌంటింగ్ వేదిక లోపల తన మొబైల్ను ఉపయోగిస్తున్నట్లు కనిపించింది. తన మొబైల్ నుంచి ఈవీఎంను హ్యాక్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపైనే ఉద్ధవ్ సేన తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ విషయమై ఉద్ధవ్ సేన అభ్యర్థి అమోల్ కీర్తికర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ వేదిక వద్ద మొబైల్ ఫోన్లు వాడడం నిషేధమని, అలాంటప్పుడు అక్కడ ఫోను ఎందుకు ఉందని ఆయన ప్రశ్నించారు.
Pavitra Gowda : హీరో దర్శన్ ప్రియురాలు పవిత్ర మొదటి భర్త ఎవరో తెలుసా?
ఈ క్రమంలో.. ఉద్ధవ్ సేన నేత ఆదిత్య ఠాక్రే మరో అడుగు ముందుకేసి కోర్టుకు వెళ్తానంటున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు రవీంద్ర వయ్కర్ బంధువు మంగేష్ వసంత్ పాండిల్కర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో మొబైల్ ఫోన్ వాడినందుకుగానూ అతడిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో దినేష్ గౌరవ్ అనే వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పండిల్కర్కు మొబైల్ ఫోన్ ఇచ్చినట్లు దినేష్పై ఆరోపణలు ఉన్నాయి. దినేష్ గౌరవ్ ఎన్నికల పోల్ పోర్టల్కు ఆపరేటర్గా పనిచేస్తున్నారు. మరోవైపు.. కౌంటింగ్ రోజు ఓట్లను తిరిగి లెక్కించాలని తాను డిమాండ్ చేశానని, అయితే తన డిమాండ్ను పట్టించుకోలేదని అమోల్ కీర్తికర్ ఆరోపించారు. ప్రతి రౌండ్ కౌంటింగ్ తర్వాత అంకెలు చెబుతున్నామని, అయితే 19వ రౌండ్ తర్వాత ఇది జరగలేదని కీర్తికర్ చెప్పారు. బదులుగా.. 26వ రౌండ్ తర్వాత ఫలితం నేరుగా ప్రకటించారని, అందులో వైకర్ విజేతగా ప్రకటించారని తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!