Aaditya Thackeray: బీజేపీకి 40 సీట్లు కూడా వచ్చేవి కావు.. ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు
- ఉద్ధవ్ సేన నేత ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు
- ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించకుంటే..
- బీజేపీ 40 సీట్లు కూడా గెలుచుకునే అవకాశం ఉండేది కాదు- ఆదిత్య ఠాక్రే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్ధవ్ సేన నేత ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించకుంటే బీజేపీ 40 సీట్లు కూడా గెలుచుకునే అవకాశం ఉండేది కాదని తెలిపారు. ముంబై నార్త్వెస్ట్ సీటులో తాము గెలుస్తున్నామని, ఫౌల్ ప్లే చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికల ఫలితాన్ని కోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. దీనితో పాటు.. ఎన్నికల కమిషన్పై ప్రశ్నలు లేవనెత్తారు. ఇది ఎన్నికల కమిషన్ కాదు, ‘ఈజీగా రాజీ’ అని ఆరోపించారు. మరోవైపు.. ఇంతకు ముందు ఉద్ధవ్ సేన శనివారం ఎన్నికల కమిషన్పై తీవ్ర విమర్శలు గుప్పించింది.
Home Minister Anitha: గంజాయి వ్యాపారులు, వినియోగదారులకు హోంమంత్రి మాస్ వార్నింగ్..
Also Read
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
ముంబై నార్త్వెస్ట్లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కేవలం 48 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో.. శివసేన అభ్యర్థి రవీంద్ర వైకర్ గెలుపుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకు సంబంధించి ఇటీవల ఒక వీడియో బయటపడింది. వైకర్ బంధువు కౌంటింగ్ రోజున కౌంటింగ్ వేదిక లోపల తన మొబైల్ను ఉపయోగిస్తున్నట్లు కనిపించింది. తన మొబైల్ నుంచి ఈవీఎంను హ్యాక్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపైనే ఉద్ధవ్ సేన తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ విషయమై ఉద్ధవ్ సేన అభ్యర్థి అమోల్ కీర్తికర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ వేదిక వద్ద మొబైల్ ఫోన్లు వాడడం నిషేధమని, అలాంటప్పుడు అక్కడ ఫోను ఎందుకు ఉందని ఆయన ప్రశ్నించారు.
Pavitra Gowda : హీరో దర్శన్ ప్రియురాలు పవిత్ర మొదటి భర్త ఎవరో తెలుసా?
ఈ క్రమంలో.. ఉద్ధవ్ సేన నేత ఆదిత్య ఠాక్రే మరో అడుగు ముందుకేసి కోర్టుకు వెళ్తానంటున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు రవీంద్ర వయ్కర్ బంధువు మంగేష్ వసంత్ పాండిల్కర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో మొబైల్ ఫోన్ వాడినందుకుగానూ అతడిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో దినేష్ గౌరవ్ అనే వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పండిల్కర్కు మొబైల్ ఫోన్ ఇచ్చినట్లు దినేష్పై ఆరోపణలు ఉన్నాయి. దినేష్ గౌరవ్ ఎన్నికల పోల్ పోర్టల్కు ఆపరేటర్గా పనిచేస్తున్నారు. మరోవైపు.. కౌంటింగ్ రోజు ఓట్లను తిరిగి లెక్కించాలని తాను డిమాండ్ చేశానని, అయితే తన డిమాండ్ను పట్టించుకోలేదని అమోల్ కీర్తికర్ ఆరోపించారు. ప్రతి రౌండ్ కౌంటింగ్ తర్వాత అంకెలు చెబుతున్నామని, అయితే 19వ రౌండ్ తర్వాత ఇది జరగలేదని కీర్తికర్ చెప్పారు. బదులుగా.. 26వ రౌండ్ తర్వాత ఫలితం నేరుగా ప్రకటించారని, అందులో వైకర్ విజేతగా ప్రకటించారని తెలిపారు.
తాజావార్తలు
-
Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
-
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్రైజర్స్ సరికొత్త ప్లాన్!
-
Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
-
Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!