Gold Cheating: తక్కువ రెట్టుకు బంగారం ఇప్పిస్తామంటూ కొందరు ఈ మధ్య మోసాలకు తెరలేపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బంగారం తక్కువ ధరకు ఇప్పిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు అమాయకులను మోసం చేయబోయారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఈ విషయంలో మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసారు. సిద్దిపేటకు చెందిన పలువురి వద్ద బంగారం తక్కువ రేటుకు ప్రముఖ గోల్డ్ షాపులో ఇప్పిస్తామంటూ వారు నమ్మబలుకుతూ అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు.
Helicopters Collided: టేకాఫ్ సమయంలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. ఆస్ట్రేలియాలో ఘటన
అమాయకులను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు.. బంగారం కోసం డబ్బు ఇచ్చి నెలలు గడుస్తున్నాకానీ.. ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయామని గ్రహించిన కొందరు పోలీసులను ఆశ్రయించారు భాదితులు. పంజాగుట్టకు చెందిన విశాల్, వినయ్ లను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చూపిస్తున్నారు. గతంలోనూ బంగారం తక్కువ రెట్టుకు ఇప్పిస్తాంటూ.. రామంతపూర్ చెందిన వారిని బురిడీ కొట్టించింది ఈ ముఠా. ఇక పోలీసులు ఈ కేసును పంజాగుట్ట నుంచి సి.సి.యస్ కు బదిలీ చేసారు.
Amritpal Singh: ఖలిస్తానీ అమృత్పాల్ సింగ్కి కాంగ్రెస్ ఎంపీ మద్దతు.. బీజేపీ ఆగ్రహం