medchal sucide: మేడ్చల్ జిల్లాలో ఇద్దరి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
medchal sucide: మేడ్చల్ జిల్లాలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకరు కుటుంబ కలహాలతో ఉరివేసుకున్నారు. మరొకరు రైల్వే ట్రాక్ పై పడి సూసైడ్ చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కు చెందిన పందుల కమిటీ కాలనీలో శ్రీను(35) జీవిస్తుండేవాడు. శ్రీను క్యాబ్ డ్రైవర్ గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల కుటుంబ కలహాల కారణంగా శ్రీను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీను దంపతులకు ఇద్దరు సంతానం. ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. శ్రీను ఆత్మహత్య సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీను మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.
Read also: Kerala: పీఎఫ్ఐ నుంచి ప్రమాదం..ఆర్ఎస్ఎస్ నేతలకు వై కేటగిరి భద్రత.
Also Read
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
- KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
- RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
- Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
షేర్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టి నష్టాల పాలుకావడంతో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… జీడిమెట్ల టీఎస్ఐఐసీ కాలనీకి చెందిన సురేశ్(38) షేర్ మార్కెట్లో దాదాపు 40లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాడు. ఉన్నట్టుండి నష్టాలు రావడంతో భార్యభర్తల మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో మనస్తాపం చెందిన సురేశ్ భార్యతో గొడవ అనంతరం రాత్రి 12గంటల సమయంలో బైక్ పై బయలుదేరాడు. సురేశ్ భార్య డయల్ 100కి కాల్ చేసి తన భర్త సూసైడ్ చేసుకునేందుక వెళ్లాడని పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సురేశ్ బాలానగర్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. కానీ అప్పటికే సనత్ నగర్ రైల్వే ట్రాక్ పై సురేశ్ సూసైడ్ చేసుకున్నాడు. ఆ విషయాన్ని రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు సురేశ్ మృత దేహాన్ని గుర్తించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఏది ఏమైనప్పటికీ షేర్ మార్కెట్లో అనుభవం, అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టి నష్టపోయి జీవితాలను పాడుచేసుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
-
TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!