Delhi Car Horror: ఢిల్లీ యువతి కేసులో ట్విస్ట్లే ట్విస్టులు.. మరో ఇద్దరి ప్రమేయం ఉందట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Car Horror: ఢిల్లీ యువతి అంజలీ సింగ్ను కారు 12కి.మీ పాటు ఈడ్చుకెళ్లిన కేసు కీలక మలువులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరు అనుమానితులు బయటపడ్డారు. వ్యక్తులు కారు యజమాని అశుతోష్, నిందితులలో ఒకరి సోదరుడు అంకుష్ అని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు ఈ రోజు తెలిపారు. “కస్టడీలో ఉన్న ఐదుగురితో పాటు మరో ఇద్దరు పాల్గొన్నారు. మా వద్ద శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. వారు ఘోరమైన నేరానికి పాల్పడిన వ్యక్తుల కోసం కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు” అని సీనియర్ పోలీసు అధికారి సాగర్ప్రీత్ హుడా చెప్పారు.
ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత అరెస్టయిన వారిలో దీపక్ ఖన్నా, మనోజ్ మిట్టల్, అమిత్ ఖన్నా, క్రిషన్, మిథున్ ఉన్నారు. గతంలో అనుకున్నట్లుగా దీపక్ ఖన్నా కారు నడుపడం లేదని, అమిత్ ఖన్నా కారు నడుపుతున్నాడని దర్యాప్తులో తేలింది. అమిత్కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని హుడా చెప్పారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఈ కేసుతో సంబంధం ఉన్న అశుతోష్, అంకుష్లను త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. నేరాన్ని కప్పిపుచ్చేందుకు నిందితులు కుట్ర పన్నారు. అంజలి మృతదేహాన్ని ఈడ్చుకెళ్లారని వారికి తెలుసని. ఇది దారుణమైన సంఘటన అని, అంజలికి న్యాయం జరిగేలా సాక్ష్యాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Also Read
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
Delhi: ఏంట్రా ఈ చెండాళం.. బస్సులో అమ్మాయి ముందే ప్యాంట్లో చేయి పెట్టుకుని..
అంజలి సింగ్ తన స్నేహితురాలు నిధితో కలిసి స్కూటర్పై వెళుతుండగా, తెల్లవారుజామున 2 గంటల తర్వాత కారు ఆమెను ఢీకొట్టింది. అంజలి కాలు ఒక చక్రానికి తగిలి ఆమెను కారు ఈడ్చుకెళ్లింది. ఆమె అరిచింది కానీ కారు ఆగలేదు, చక్రాల కింద ఆమె చేయి ఉందని వారు చూసినప్పటికీ కారును అలాగే పోనిచ్చారు. మృతదేహం పడిపోయే ముందు కారులోని వారు గంటకు పైగా డ్రైవ్ చేశారు. సంఘటన జరిగిన రెండు గంటల తర్వాత, ఆ వ్యక్తులు కారును తిరిగి దాని యజమాని అశుతోష్ వద్దకు తీసుకువచ్చి, ఆటోరిక్షాలో పారిపోయినట్లు సెక్యూరిటీ ఫుటేజీ ద్వారా తెలిసింది. రోహిణిలోని సీసీటీవి ఫుటేజీలో పురుషులు తెల్లవారుజామున 4.33 గంటలకు కారును ఒక పాయింట్ వద్ద ఆపి, వేచి ఉన్న ఆటోరిక్షాలో బయలుదేరినట్లు చూపిస్తుంది.
అంజలి తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఆమె కనీసం 40 బాహ్య గాయాలతో బాధపడింది. ఆమె వెనుక భాగంలో పక్కటెముకలు బయటపడ్డాయి. ఆమె పుర్రె భాగం పగిలి మెదడులోని కొంచెం భాగం చెల్లాచెదురైంది. ఆమె తల, వెన్నెముక, దిగువ అవయవాలకు గాయాలయ్యాయి. విచారణ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకోబడతాయని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!