Delhi Car Horror: ఢిల్లీ యువతి కేసులో ట్విస్ట్లే ట్విస్టులు.. మరో ఇద్దరి ప్రమేయం ఉందట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Car Horror: ఢిల్లీ యువతి అంజలీ సింగ్ను కారు 12కి.మీ పాటు ఈడ్చుకెళ్లిన కేసు కీలక మలువులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరు అనుమానితులు బయటపడ్డారు. వ్యక్తులు కారు యజమాని అశుతోష్, నిందితులలో ఒకరి సోదరుడు అంకుష్ అని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు ఈ రోజు తెలిపారు. “కస్టడీలో ఉన్న ఐదుగురితో పాటు మరో ఇద్దరు పాల్గొన్నారు. మా వద్ద శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. వారు ఘోరమైన నేరానికి పాల్పడిన వ్యక్తుల కోసం కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు” అని సీనియర్ పోలీసు అధికారి సాగర్ప్రీత్ హుడా చెప్పారు.
ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత అరెస్టయిన వారిలో దీపక్ ఖన్నా, మనోజ్ మిట్టల్, అమిత్ ఖన్నా, క్రిషన్, మిథున్ ఉన్నారు. గతంలో అనుకున్నట్లుగా దీపక్ ఖన్నా కారు నడుపడం లేదని, అమిత్ ఖన్నా కారు నడుపుతున్నాడని దర్యాప్తులో తేలింది. అమిత్కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని హుడా చెప్పారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఈ కేసుతో సంబంధం ఉన్న అశుతోష్, అంకుష్లను త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. నేరాన్ని కప్పిపుచ్చేందుకు నిందితులు కుట్ర పన్నారు. అంజలి మృతదేహాన్ని ఈడ్చుకెళ్లారని వారికి తెలుసని. ఇది దారుణమైన సంఘటన అని, అంజలికి న్యాయం జరిగేలా సాక్ష్యాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
Delhi: ఏంట్రా ఈ చెండాళం.. బస్సులో అమ్మాయి ముందే ప్యాంట్లో చేయి పెట్టుకుని..
అంజలి సింగ్ తన స్నేహితురాలు నిధితో కలిసి స్కూటర్పై వెళుతుండగా, తెల్లవారుజామున 2 గంటల తర్వాత కారు ఆమెను ఢీకొట్టింది. అంజలి కాలు ఒక చక్రానికి తగిలి ఆమెను కారు ఈడ్చుకెళ్లింది. ఆమె అరిచింది కానీ కారు ఆగలేదు, చక్రాల కింద ఆమె చేయి ఉందని వారు చూసినప్పటికీ కారును అలాగే పోనిచ్చారు. మృతదేహం పడిపోయే ముందు కారులోని వారు గంటకు పైగా డ్రైవ్ చేశారు. సంఘటన జరిగిన రెండు గంటల తర్వాత, ఆ వ్యక్తులు కారును తిరిగి దాని యజమాని అశుతోష్ వద్దకు తీసుకువచ్చి, ఆటోరిక్షాలో పారిపోయినట్లు సెక్యూరిటీ ఫుటేజీ ద్వారా తెలిసింది. రోహిణిలోని సీసీటీవి ఫుటేజీలో పురుషులు తెల్లవారుజామున 4.33 గంటలకు కారును ఒక పాయింట్ వద్ద ఆపి, వేచి ఉన్న ఆటోరిక్షాలో బయలుదేరినట్లు చూపిస్తుంది.
అంజలి తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఆమె కనీసం 40 బాహ్య గాయాలతో బాధపడింది. ఆమె వెనుక భాగంలో పక్కటెముకలు బయటపడ్డాయి. ఆమె పుర్రె భాగం పగిలి మెదడులోని కొంచెం భాగం చెల్లాచెదురైంది. ఆమె తల, వెన్నెముక, దిగువ అవయవాలకు గాయాలయ్యాయి. విచారణ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకోబడతాయని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!