Delhi Car Horror: ఢిల్లీ యువతి కేసులో ట్విస్ట్లే ట్విస్టులు.. మరో ఇద్దరి ప్రమేయం ఉందట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Car Horror: ఢిల్లీ యువతి అంజలీ సింగ్ను కారు 12కి.మీ పాటు ఈడ్చుకెళ్లిన కేసు కీలక మలువులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరు అనుమానితులు బయటపడ్డారు. వ్యక్తులు కారు యజమాని అశుతోష్, నిందితులలో ఒకరి సోదరుడు అంకుష్ అని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు ఈ రోజు తెలిపారు. “కస్టడీలో ఉన్న ఐదుగురితో పాటు మరో ఇద్దరు పాల్గొన్నారు. మా వద్ద శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. వారు ఘోరమైన నేరానికి పాల్పడిన వ్యక్తుల కోసం కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు” అని సీనియర్ పోలీసు అధికారి సాగర్ప్రీత్ హుడా చెప్పారు.
ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత అరెస్టయిన వారిలో దీపక్ ఖన్నా, మనోజ్ మిట్టల్, అమిత్ ఖన్నా, క్రిషన్, మిథున్ ఉన్నారు. గతంలో అనుకున్నట్లుగా దీపక్ ఖన్నా కారు నడుపడం లేదని, అమిత్ ఖన్నా కారు నడుపుతున్నాడని దర్యాప్తులో తేలింది. అమిత్కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని హుడా చెప్పారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఈ కేసుతో సంబంధం ఉన్న అశుతోష్, అంకుష్లను త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. నేరాన్ని కప్పిపుచ్చేందుకు నిందితులు కుట్ర పన్నారు. అంజలి మృతదేహాన్ని ఈడ్చుకెళ్లారని వారికి తెలుసని. ఇది దారుణమైన సంఘటన అని, అంజలికి న్యాయం జరిగేలా సాక్ష్యాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Also Read
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
- PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
Delhi: ఏంట్రా ఈ చెండాళం.. బస్సులో అమ్మాయి ముందే ప్యాంట్లో చేయి పెట్టుకుని..
అంజలి సింగ్ తన స్నేహితురాలు నిధితో కలిసి స్కూటర్పై వెళుతుండగా, తెల్లవారుజామున 2 గంటల తర్వాత కారు ఆమెను ఢీకొట్టింది. అంజలి కాలు ఒక చక్రానికి తగిలి ఆమెను కారు ఈడ్చుకెళ్లింది. ఆమె అరిచింది కానీ కారు ఆగలేదు, చక్రాల కింద ఆమె చేయి ఉందని వారు చూసినప్పటికీ కారును అలాగే పోనిచ్చారు. మృతదేహం పడిపోయే ముందు కారులోని వారు గంటకు పైగా డ్రైవ్ చేశారు. సంఘటన జరిగిన రెండు గంటల తర్వాత, ఆ వ్యక్తులు కారును తిరిగి దాని యజమాని అశుతోష్ వద్దకు తీసుకువచ్చి, ఆటోరిక్షాలో పారిపోయినట్లు సెక్యూరిటీ ఫుటేజీ ద్వారా తెలిసింది. రోహిణిలోని సీసీటీవి ఫుటేజీలో పురుషులు తెల్లవారుజామున 4.33 గంటలకు కారును ఒక పాయింట్ వద్ద ఆపి, వేచి ఉన్న ఆటోరిక్షాలో బయలుదేరినట్లు చూపిస్తుంది.
అంజలి తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఆమె కనీసం 40 బాహ్య గాయాలతో బాధపడింది. ఆమె వెనుక భాగంలో పక్కటెముకలు బయటపడ్డాయి. ఆమె పుర్రె భాగం పగిలి మెదడులోని కొంచెం భాగం చెల్లాచెదురైంది. ఆమె తల, వెన్నెముక, దిగువ అవయవాలకు గాయాలయ్యాయి. విచారణ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకోబడతాయని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసం.. ఒక్క ఇన్నింగ్స్తో ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన బుడ్డోడు..
-
AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
-
Rishabh Pant: మేం తోపులం, కానీ కలిసిరాలేదు.. రిషభ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
God of War Confirmed: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్..నాగవంశీ సాలిడ్ హింట్!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
ట్రెండింగ్
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!