Site icon NTV Telugu

Release Postpone : ఏప్రిల్ వాయిదా పడ్డ మరో ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు

Mollywood

Mollywood

మోహన్ లాల్- జీతూ జోసెఫ్ ఫిల్మ్స్ అంటే మాలీవుడ్‌లో ఓ క్రేజ్. వీళ్లిద్దరి కొలబరేషన్స్‌లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్. అందులోనూ ఫ్యామిలీ థ్రిల్లర్ దృశ్యం‌కు సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఈ ఇద్దరి కాంబోలో నెక్ట్స్ దృశ్యం3 రాబోతోంది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేశారు.. రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. కట్ చేస్తే గల్ఫ్ దేశాల ఉద్రిక్తతను సాకుగా బొమ్మ మే23కి పోస్ట్ పోన్ చేసుకుంది.

Also Read : Rajamouli : ధురంధర్ దారిలో వారణాసి.. వర్కౌట్ అవుతుందా?

మాలీవుడ్ అతిపెద్ద మల్టీస్టారర్ మూవీ పేట్రియాట్. అందులోనూ బెస్ట్ ఫ్రెండ్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ నటిస్తున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత నటిస్తున్నారని హైప్ క్రియేట్ అయ్యింది. రెండేళ్ల నుండి షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ విషు ఫెస్టివల్ సందర్భంగా ఏప్రిల్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.. కానీ సడెన్లీ వారం రోజులు వెనక్కు వెళ్లింది. క్వాలిటీ మ్యాటర్ అంటూ మే1న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. మమ్ముట్టి, మోహన్ లాల్ మూవీస్ వస్తున్నాంటే.. అంచనాలు వేరే లెవల్లో ఉంటాయి. హీరోల ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. కానీ ఈ సినిమాలకు అనుకున్నంత బజ్ అంతగా లేదు. ప్రమోషన్స్ కూడా షురూ చేయలేదు. కేరళలో జరిగే ఎన్నికలు, ఐపీఎల్ కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉందని కాస్త వెనకడుగు వేశారట. అందులోనూ పేట్రియాట్ భారీ బడ్జెట్ చిత్రం కావడంతో దానికి సపోర్ట్ చేసేందుకు దృశ్యం3ని లాలట్టన్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇక పెద్ది రిలీజ్ డేట్ మారడం కూడా తెలుగులో పేట్రియాట్‌కు కాస్త కలిసొచ్చే అంశమైనా.. ఈ హీరోలు ప్రమోషన్స్ ఎంత వరకు చేస్తారో చూడాలి.

Exit mobile version