బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ మహబూబ్నగర్, నాగర్కర్నూల్ నేతలతో సమావేశం కానున్నారు. అలాగే నేడు మరో రెండు సీట్లకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి నామ నాగేశ్వర్రావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి బోయినపల్లి వినోద్కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి నుంచి బరిలో దిగనున్నారు.
Multi-Starrer Movie: టాలీవుడ్లో మరో మల్టీస్టారర్.. అడివి శేషుతో దుల్కర్ సల్మాన్!
లోక్సభ ఎన్నికల సన్నాహక భేటీలో భాగంగా కేసీఆర్ మంగళవారం మహబూబ్నగర్, నాగర్కర్నూలు లోక్సభ నియోజవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. నాగర్కర్నూలు సిట్టింగ్ ఎంపీ పి.రాములు ఇప్పటికే బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. ఆయన కుమారుడు పి.భరత్ను బీజేపీ నాగర్కర్నూలు అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు మహబూబ్నగర్ సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ దక్కదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాల నుంచి బీఆర్ఎస్ తరఫున ఎవరు బరిలోకి దిగుతారనే ఆసక్తి నెలకొంది. అయితే మంగళవారం నాటి భేటీ తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది.
Jayaho BC Meeting: నేడు మంగళగిరిలో టీడీపీ-జనసేన ‘జయహో బీసీ’ సభ
