Pakistan: బాలికలు కిడ్నాప్.. కేసు పెట్టమంటే పోలీసులు ఏం చేశారంటే..
Pakistan: పాకిస్థాన్లో వరుసగా హిందూ బాలికలు కిడ్నాప్ కు గురవుతున్నారు. ఇటీవల సింధ్ ప్రావిన్స్లో ఇద్దరు మైనర్ హిందూ బాలికలు అపహరణకు గురయ్యారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని బాలికల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వారు నిరాకరించడంతో బాధితులు నిరసనకు దిగారు. సుక్కూర్ సమీపంలో గత వారం తన కూతుళ్లతో వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని బాలికల తల్లి పేర్కొంది. తన ఇద్దరు కుమార్తెలను ముగ్గురు వ్యక్తులు బలవంతంగా అపహరించారని, వారిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు తనపై దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నాప్ విషయంపై ఫిర్యాదు చేశానని, అయినా పోలీసులు ఏమీ చేయడం లేదన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని తమ కుమార్తెలను తిరిగి తీసుకురావాలని కోర్టును ఆశ్రయిస్తున్నాను.
Read Also: United Nations: భారత్ ప్రతిపాదనను నిలిపేసిన చైనా.. పాకిస్తాన్ ఉగ్రవాదికి మద్దతు
Also Read
- Vijay TVK Government: టీవీకే విజయ్కి కాంగ్రెస్ షరతులు.. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో కీలక మలుపు!
- Kolkata: కోల్కతాలో బుల్డోజర్ల గర్జన.. అర్ధరాత్రి టీఎంసీ ఆఫీసు నేలమట్టం!
- Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే...
- MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
హిందూ యువతుల అపహరణ, బలవంతంగా మతమార్పిడి చేయడం సింధ్ ప్రావిన్స్లోని అంతర్భాగంలో పెద్ద సమస్యగా మారింది. సింధ్ ప్రావిన్స్లోని థార్,ఉమర్కోట్, మిర్పుర్ఖాస్,ఘోట్కీ, ఖైర్పూర్ ప్రాంతాలలో ఎక్కువ మంది హిందూ జనాభా ఉన్నారు. హిందూ సమాజంలోని చాలా మంది సభ్యులు కార్మికులు. ఈ నెలలో సింధ్ ప్రావిన్స్లోని హైదరాబాద్ నగరానికి చెందిన 14 ఏళ్ల హిందూ బాలిక అపహరణకు గురైనట్లు వచ్చిన నివేదికలపై పాకిస్తాన్ సింధ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. గత నెలలో హిందూ వర్గానికి చెందిన మహిళ,ఇద్దరు మైనర్ బాలికలను అపహరించి, వారిలో ఇద్దరిని బలవంతంగా మతమార్పిడి చేసి ముస్లిం పురుషులతో వివాహం జరిపించారు. జులై 16, 2019న సింధ్ ప్రావిన్స్లోని వివిధ జిల్లాల్లో హిందూ బాలికల అపహరణ, బలవంతంగా మతమార్పిడికి సంబంధించిన అంశం సింధ్ అసెంబ్లీలో లేవనెత్తబడింది. ఇక్కడ ఒక తీర్మానం చర్చకు వచ్చింది. కొంతమంది ఎంపీల అభ్యంతరాలపై సవరించిన తర్వాత ఏకగ్రీవంగా ఆమోదించబడింది. హిందూ బాలికలకు మాత్రమే. కానీ బలవంతంగా మతమార్పిడి చేయడాన్ని నేరంగా ప్రకటించే బిల్లు ఆ తర్వాత అసెంబ్లీలో తిరస్కరించబడింది. మళ్లీ ఇదే బిల్లును ప్రతిపాదించినా గతేడాది తిరస్కరించారు.
తాజావార్తలు
-
IPL Ticket Scam Hyderabad: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల స్కామ్ బట్టబయలు.. అభిమానులకు పోలీసులు హెచ్చరికలు!
-
Motorola Razr Fold: మోటరోలా రేజర్ ఫోల్డ్ త్వరలో భారత్ లో విడుదల.. 80W ఛార్జింగ్, 6000mAh బ్యాటరీ
-
Rajnikanth : జైలర్ హిట్టయినా..జైలర్2ను తెలుగులో ఎందుకు కొనడం లేదు?
-
Pooja Hegde: విజయ్ గురించి పూజా హెగ్డే ఇంత కరెక్ట్ గా ఎలా గెస్ చేసిందబ్బా?
-
Sanjay Manjrekar: “టీ20తో డబ్బు సంపాదించు.. గౌరవం కావాలంటే టెక్నిక్ మార్చు”.. వైభవ్కు మంజ్రేకర్ సలహా
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!