Pakistan: బాలికలు కిడ్నాప్.. కేసు పెట్టమంటే పోలీసులు ఏం చేశారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్లో వరుసగా హిందూ బాలికలు కిడ్నాప్ కు గురవుతున్నారు. ఇటీవల సింధ్ ప్రావిన్స్లో ఇద్దరు మైనర్ హిందూ బాలికలు అపహరణకు గురయ్యారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని బాలికల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వారు నిరాకరించడంతో బాధితులు నిరసనకు దిగారు. సుక్కూర్ సమీపంలో గత వారం తన కూతుళ్లతో వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని బాలికల తల్లి పేర్కొంది. తన ఇద్దరు కుమార్తెలను ముగ్గురు వ్యక్తులు బలవంతంగా అపహరించారని, వారిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు తనపై దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నాప్ విషయంపై ఫిర్యాదు చేశానని, అయినా పోలీసులు ఏమీ చేయడం లేదన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని తమ కుమార్తెలను తిరిగి తీసుకురావాలని కోర్టును ఆశ్రయిస్తున్నాను.
Read Also: United Nations: భారత్ ప్రతిపాదనను నిలిపేసిన చైనా.. పాకిస్తాన్ ఉగ్రవాదికి మద్దతు
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
హిందూ యువతుల అపహరణ, బలవంతంగా మతమార్పిడి చేయడం సింధ్ ప్రావిన్స్లోని అంతర్భాగంలో పెద్ద సమస్యగా మారింది. సింధ్ ప్రావిన్స్లోని థార్,ఉమర్కోట్, మిర్పుర్ఖాస్,ఘోట్కీ, ఖైర్పూర్ ప్రాంతాలలో ఎక్కువ మంది హిందూ జనాభా ఉన్నారు. హిందూ సమాజంలోని చాలా మంది సభ్యులు కార్మికులు. ఈ నెలలో సింధ్ ప్రావిన్స్లోని హైదరాబాద్ నగరానికి చెందిన 14 ఏళ్ల హిందూ బాలిక అపహరణకు గురైనట్లు వచ్చిన నివేదికలపై పాకిస్తాన్ సింధ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. గత నెలలో హిందూ వర్గానికి చెందిన మహిళ,ఇద్దరు మైనర్ బాలికలను అపహరించి, వారిలో ఇద్దరిని బలవంతంగా మతమార్పిడి చేసి ముస్లిం పురుషులతో వివాహం జరిపించారు. జులై 16, 2019న సింధ్ ప్రావిన్స్లోని వివిధ జిల్లాల్లో హిందూ బాలికల అపహరణ, బలవంతంగా మతమార్పిడికి సంబంధించిన అంశం సింధ్ అసెంబ్లీలో లేవనెత్తబడింది. ఇక్కడ ఒక తీర్మానం చర్చకు వచ్చింది. కొంతమంది ఎంపీల అభ్యంతరాలపై సవరించిన తర్వాత ఏకగ్రీవంగా ఆమోదించబడింది. హిందూ బాలికలకు మాత్రమే. కానీ బలవంతంగా మతమార్పిడి చేయడాన్ని నేరంగా ప్రకటించే బిల్లు ఆ తర్వాత అసెంబ్లీలో తిరస్కరించబడింది. మళ్లీ ఇదే బిల్లును ప్రతిపాదించినా గతేడాది తిరస్కరించారు.
తాజావార్తలు
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
-
Damodara Raja Narasimha : మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోళ్లకు కొత్త విధానం..
-
Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
-
Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!