UP: ఒకే మైనర్ బాలుడిని ప్రేమించిన ఇద్దరు బాలికలు.. ముగ్గురూ కలిసి ఏం ప్లాన్ చేశారో చూడండి
- ముగ్గురు మైనర్ల మధ్య ప్రేమాయణం
- ముగ్గురూ కలిసి ఇంట్లో నుంచి పారిపోయిన వైనం
- ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఈ ఉదంతం
ముగ్గురు మైనర్ల మధ్య ప్రేమాయణం సాగించిన విచిత్రమైన ఉదంతం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో వెలుగు చూసింది. వాస్తవానికి షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు మైనర్ బాలికలు ఓ మైనర్ బాలుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయారు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వెలుగులోకి వచ్చిన విషయం విస్మయానికి గురిచేసింది. ఇద్దరు అమ్మాయిలు స్నేహితులు, వారు ఒకే అబ్బాయితో జీవించడానికి అంగీకరించారు.
ఒకే అబ్బాయిని ప్రేమించిన14 -15 ఏళ్ల ఇద్దరు బాలికలు..
14 -15 ఏళ్ల ఇద్దరు బాలికలు ఒకే అబ్బాయిని ప్రేమించి, అతనితో కలిసి ఇల్లు వదిలి వెళ్లేందుకు అంగీకరించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. పాలు తీసుకొచ్చేందుకు ఇంటి నుంచి వెళ్లిన బాలిక సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. విస్తృతంగా వెతికినా దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే ప్రాంతానికి చెందిన మరో బాలిక అదృశ్యమైనట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు నిఘా, సీడీఆర్ ద్వారా దర్యాప్తు ప్రారంభించారు. బాలికలిద్దరూ 15 ఏళ్ల బాలుడితో పరారీలో ఉన్నారని తెలుసుకున్నారు.
Also Read
- 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
- Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
లక్నో హోటల్లో గదిలో ..
బాలికలిద్దరూ మైనర్ అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నారనే చర్చ సాగుతోంది. ముగ్గురూ కలిసి జీవించాలనుకున్నారు. దీంతో ముగ్గురూ తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. గత ఆదివారం, బీహార్లోని హతువాలోని ఓ హోటల్లో పోలీసులు ముగ్గురిని స్వాధీనం చేసుకుని సోమవారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముగ్గురూ మొదట పారిపోయి లక్నో వెళ్లారు. ఎక్కడ చూసినా ఆధార్కార్డు అడగడంతో అక్కడ ఏ హోటల్లోనూ చోటు దొరకలేదు. విసుగు చెందిన ముగ్గురూ బీహార్ వెళ్లే రైలు ఎక్కి హతువా చేరుకున్నారు. అక్కడ ఓ హోటల్లో రూమ్ తీసుకున్నారు.
పోలీసులు ఏమంటున్నారు?
ఈ విషయమై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించగా.. ముగ్గురి ఆచూకీ బీహార్లోని హతువా జిల్లాలోని ఓ హోటల్గా తేలిందని పోలీసులు చెబుతున్నారు. గోరఖ్పూర్ పోలీసులు బీహార్ పోలీసుల సహాయంతో ముగ్గురిని పట్టుకుని గోరఖ్పూర్కు తీసుకొచ్చారు. బాలికలిద్దరినీ వారి కుటుంబాలకు అప్పగించారు. మైనర్ నిందితుడైన బాలుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
-
Anil Ravipudi: ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?
-
Mega 158 Update: ‘మెగా 158’ నుంచి ఊరమాస్ అప్డేట్! బాబీ మార్క్ ‘స్వాగ్’తో బాస్ లుక్.. చూశారా?
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!