UP: ఒకే మైనర్ బాలుడిని ప్రేమించిన ఇద్దరు బాలికలు.. ముగ్గురూ కలిసి ఏం ప్లాన్ చేశారో చూడండి
- ముగ్గురు మైనర్ల మధ్య ప్రేమాయణం
- ముగ్గురూ కలిసి ఇంట్లో నుంచి పారిపోయిన వైనం
- ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఈ ఉదంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముగ్గురు మైనర్ల మధ్య ప్రేమాయణం సాగించిన విచిత్రమైన ఉదంతం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో వెలుగు చూసింది. వాస్తవానికి షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు మైనర్ బాలికలు ఓ మైనర్ బాలుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయారు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వెలుగులోకి వచ్చిన విషయం విస్మయానికి గురిచేసింది. ఇద్దరు అమ్మాయిలు స్నేహితులు, వారు ఒకే అబ్బాయితో జీవించడానికి అంగీకరించారు.
ఒకే అబ్బాయిని ప్రేమించిన14 -15 ఏళ్ల ఇద్దరు బాలికలు..
14 -15 ఏళ్ల ఇద్దరు బాలికలు ఒకే అబ్బాయిని ప్రేమించి, అతనితో కలిసి ఇల్లు వదిలి వెళ్లేందుకు అంగీకరించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. పాలు తీసుకొచ్చేందుకు ఇంటి నుంచి వెళ్లిన బాలిక సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. విస్తృతంగా వెతికినా దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే ప్రాంతానికి చెందిన మరో బాలిక అదృశ్యమైనట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు నిఘా, సీడీఆర్ ద్వారా దర్యాప్తు ప్రారంభించారు. బాలికలిద్దరూ 15 ఏళ్ల బాలుడితో పరారీలో ఉన్నారని తెలుసుకున్నారు.
Also Read
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
- Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్కు భారీ ఎదురుదెబ్బ..
లక్నో హోటల్లో గదిలో ..
బాలికలిద్దరూ మైనర్ అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నారనే చర్చ సాగుతోంది. ముగ్గురూ కలిసి జీవించాలనుకున్నారు. దీంతో ముగ్గురూ తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. గత ఆదివారం, బీహార్లోని హతువాలోని ఓ హోటల్లో పోలీసులు ముగ్గురిని స్వాధీనం చేసుకుని సోమవారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముగ్గురూ మొదట పారిపోయి లక్నో వెళ్లారు. ఎక్కడ చూసినా ఆధార్కార్డు అడగడంతో అక్కడ ఏ హోటల్లోనూ చోటు దొరకలేదు. విసుగు చెందిన ముగ్గురూ బీహార్ వెళ్లే రైలు ఎక్కి హతువా చేరుకున్నారు. అక్కడ ఓ హోటల్లో రూమ్ తీసుకున్నారు.
పోలీసులు ఏమంటున్నారు?
ఈ విషయమై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించగా.. ముగ్గురి ఆచూకీ బీహార్లోని హతువా జిల్లాలోని ఓ హోటల్గా తేలిందని పోలీసులు చెబుతున్నారు. గోరఖ్పూర్ పోలీసులు బీహార్ పోలీసుల సహాయంతో ముగ్గురిని పట్టుకుని గోరఖ్పూర్కు తీసుకొచ్చారు. బాలికలిద్దరినీ వారి కుటుంబాలకు అప్పగించారు. మైనర్ నిందితుడైన బాలుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
-
Telangana Congress : కాంగ్రెస్లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!