West Bengal: పశ్చిమ బెంగాల్ రాయకీయాల్లో ట్విస్ట్.. బీజేపీ ఎంపీని కలిసిన సీఎం మమతా బెనర్జీ
- సీఎంకు ఘన స్వాగతం పలికిన ఎంపీ అనంత్ రాయ్
- ఉత్తర బెంగాల్ రాజకీయాల్లో కీలకంగా మారిన ఎంపీ
- ఏడాది క్రితమే పశ్చిమ బెంగాల్ నుంచి రాయ్ ని రాజ్యసభకు పంపిన బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మంగళవారం ట్విస్ట్ నెలకొంది. ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ నివాసానికి రాష్ట్ర అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేరుకున్నారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ అనంత్ రాయ్ మహరాజ్ సీఎం మమతకు ఘనస్వాగతం పలికారు. మమతా బెనర్జీ, బీజేపీ ఎంపీల భేటీకి సంబంధించిన వార్త పెద్దగా బయటకు రాలేదు. అనంత్ రాయ్ మహారాజ్ ఉత్తర బెంగాల్ రాజకీయాలలో ఒక పెద్ద పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ వేగం పెంచేందుకు ఆయన కృషి చేశారు. అనంత్ గ్రేటర్ కూచ్ బెహార్ పీపుల్స్ అసోసియేషన్ (GCPA) అధ్యక్షుడు, ఉత్తర బెంగాల్లో కూచ్ బెహార్ను ప్రత్యేక గ్రేటర్ కూచ్ బెహార్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తనను తాను గ్రేటర్ కూచ్ బెహార్ మహారాజాగా పిలుచుకునే అనంత్ను ఏడాది క్రితమే పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ రాజ్యసభకు పంపింది.
READ MORE: AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఖరారు.. మూడు రోజుల ముందుగానే..!
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ టికెట్పై రాజ్యసభకు చేరిన తొలి నాయకుడు అనంత్ కావడం విశేషం. ఇప్పుడు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన నివాసానికి చేరుకుని ఆయనను కలిసిన తర్వాత ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. గతేడాది హోంమంత్రి అమిత్ షా అనంత్ నివాసానికి చేరుకుని ఆయనను కలిశారు. ఆ తర్వతే బీజేపీ ఆయనను రాజ్యసభకు పంపిందని వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయనను కలిసేందుకు సీఎం మమత ఆయన నివాసానికి చేరుకోవడంతో ఇక ఏం జరగనుందన్న ప్రశ్న ఉత్పన్నమైంది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని గత ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేసిన నిషిత్ ప్రమాణిక్ కూడా అనంత్కు సన్నిహితుడిగా చెబుతుంటారు. నిషిత్ ప్రమాణిక్ కూడా అనంత్ వలె అదే రాజ్బన్షి సంఘం నుంచి వచ్చారు.
READ MORE: Minister Satya Kumar Yadav: ఏపీకి దీపావళి ముందే వచ్చింది.. రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచుతాం
పశ్చిమ బెంగాల్లోని మొత్తం షెడ్యూల్డ్ కులాల జనాభాలో రాజ్బన్షి కమ్యూనిటీ 18 శాతానికి పైగా ఉన్నారు. రాజ్బన్షి కమ్యూనిటీ అనేది షెడ్యూల్డ్ కులాల వర్గంలో అతిపెద్ద, ప్రభావవంతమైన సంఘం. రాజకీయ దృక్కోణంలో, ఉత్తర బెంగాల్లోని ఐదు జిల్లాల్లోని 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజ్బన్షి కమ్యూనిటీ ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మంచి పనితీరు కనబరిచిన ఈ ఐదు జిల్లాల్లో కూచ్ బెహార్తో పాటు, అలీపుర్దూర్ కూడా చేర్చబడింది. అయితే 2024 ఎన్నికల్లో కూచ్ బెహార్ లోక్సభ స్థానాన్ని ఆ పార్టీ కోల్పోయింది. ప్రస్తుతం ఈ భేటీపై రాష్ట్రంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!