Gandhi Hospital : గాంధీ హాస్పిటల్ మృతదేహం కేసులో పురోగతి.. హత్యగా నిర్ధారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gandhi Hospital : గాంధీ దవాఖానలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని వదిలివెళ్లిన కేసులో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ నెల 9న అర్ధరాత్రి 1:40 గంటలకు ముగ్గురు వ్యక్తులు విగత జీవిగా ఉన్న ఓ వ్యక్తిని స్ట్రెచర్పై తీసుకువచ్చారు. ఓపీ చిట్టీ తీసుకొని వస్తామని చెప్పి అక్కడి నుంచి పరారయ్యారు. కొద్దిసేపటికి విధి నిర్వహణలో ఉన్న క్యాజువాలిటీ వైద్యులు పరిశీలించగా స్ట్రేచర్పై ఉన్న వ్యక్తి అప్పటికే మృతి చెంది ఉన్నాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.
Read Also:MS Dhoni: సీఎస్కే, కేకేఆర్ మ్యాచ్లో అద్భుత దృశ్యం.. సునీల్ గవాస్కర్ చొక్కాపై ధోనీ ఆటోగ్రాఫ్
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
మృతుడి ముఖం, చేతులు, తలపై గాయాలున్నాయి. మృతుడికి 30 నుంచి 35 ఏండ్ల వయస్సు ఉంటుందని, కుడి చేతిపై హిందీలో ‘జితేందర్-ఖుషి’ అని పచ్చబొట్టు ఉండటంతో అతడు బెంగాల్ లేదా ఒడిశాకు చెందిన వ్యక్తి అయి ఉంటాడని పోలీసులు అనుమానించారు. పోలీసులు గాంధీ దవాఖాన నుంచి గచ్చిబౌలి వరకు 200 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. మృతుడు అదే పరిసరాలలో ఏదైన నిర్మాణంలో ఉన్న భవనంలో కార్మికుడిగా పనిచేస్తూ ఉండవచ్చని, తోటి కూలీలతో ఏదైన గొడవ జరిగి ఉంటుందని అనుమానించారు. ఆదివారం చిలకలగూడ పోలీసులు సీసీటీవీలో రికార్డు అయిన మృతదేహాన్ని వెంట తీసుకువచ్చిన సమయంలో అతడి వెంట ఉన్న వ్యక్తి ఫొటోను విడుదల చేశారు.
Read Also:Langar House : భార్యను 20 ఏళ్లుగా ఇంట్లోనే బంధించాడు.. పక్కింటి వాళ్లతో మాట్లాడిందని చంపేశాడు
ఈ కేసును పరిశీలించిన పోలీసులు హత్య కేసుగా నిర్ధారించారు. గచ్చిబౌలిలో జితేందర్పై ఐదుగురు వ్యక్తులు దాడి చేసి చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. అయితే అతడు చనిపోయాడని తెలుసుకున్న నిందితుడు గాంధీ ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. ఆటోడ్రైవర్కు ఇచ్చిన గూగుల్ పే నంబర్ ఆధారంగా.. డబ్బు విషయంలో జితేందర్తో గొడవపడి తపస్ అనే వ్యక్తి అతన్ని కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. చిలకలగూడ పోలీసులు ఈ హత్య కేసును గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల కోసం వెతకడం ప్రారంభించారు.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!