TV Price Hike: కొత్త ఏడాదిలో భారీగా పెరగనున్న టీవీల ధరలు..
- కొత్త ఏడాదిలో భారీగా పెరగనున్న టీవీల ధరలు..
- మెమరీ చిప్ల కొరత, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ పతనంతోనే రేట్లు పెంపు..
- టీవీల తయారీలో ఉపయోగించే చిప్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TV Price Hike: కొత్త ఏడాదిలో టీవీల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. మెమరీ చిప్ల కొరత, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ పతనంతో టీవీల తయారీపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. దీంతో 2026 జనవరి నుంచి టీవీల ధరలు 3 నుంచి 10 శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నాయి. ఇటీవల డాలర్ మారకంలో రూపాయి విలువ తొలిసారిగా 89.88కి చేరింది. అలాగే, టీవీల తయారీలో ఉపయోగించే ఓపెన్సెల్, సెమీ కండక్టర్ చిప్లు, మదర్బోర్డు లాంటివి విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.. ఏఐ సర్వర్లకు హై బ్యాండ్విడ్త్ మెమరీ (హెచ్బీఎం) చిప్ల డిమాండ్ భారీగా ఉండటంతో పాటు అన్ని రకాల మెమరీ చిప్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇక, చిప్ తయారీదారులు అధిక లాభాలు అందించే ఏఐ చిప్ల తయారీ వైపు మొగ్గు చూపిస్తుండటం వల్ల టీవీల లాంటి లెగసీ డివైస్ ల సరఫరా తగ్గిపోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఎల్ఈడీ టీవీల ధర 3 శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు.
Read Also: BJP: ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు బీజేపీ ఇన్ఛార్జ్లు నియామకం.. తమిళనాడుకు ఎవరంటే..!
Also Read
- Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
- Lingamneni Ramesh Son: ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్పై కేసు.. నేడు పోలీసుల విచారణకు హాజరు!
- Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
- Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
అయితే, కొన్ని టీవీ తయారీ కంపెనీలు ఇప్పటికే టీవీల ధర పెరిగే ఛాన్స్ ఉన్నట్లు ఇప్పటికే డీలర్లకు సమాచారం ఇచ్చారు. గత మూడేళ్లలో మెమరీ చిప్ల ధర 500 మేరకు పెరిగిందని శామ్సన్, కోడక్ వంటి టీవీల తయారీ లైసెన్సు గల సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది. రాబోయే రెండు త్రైమాసికాల్లోనూ కూడా చిప్ల ధర పెరుగుతూనే ఉండొచ్చని, అదే జరిగితే ధరలు భారీగా పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఇక, సోర్సింగ్ స్థాయిలో ఫ్లాష్ మెమరీ, డీడీఆర్4 ధరలు 1000 శాతం మేరకు పెరిగాయని, వాటిని ఏఐ డేటా సెంటర్లకు సరఫరా చేయడమే దీనికి ప్రధాన కారణమని వీడియోటెక్స్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ తెలిపారు.
కాగా, వచ్చే ఏడాది రెండో త్రైమాసికం వరకు పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చిప్ల తయారీ పరిస్థితి కొంత మెరుగుపడే ఛాన్స్ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రూపాయి విలువలో క్షీణించడంతో పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసిందని, దీని వల్ల దిగుమతి వ్యయాలు భారీగా పెరిగిపోయాయని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో మార్కెట్లో పాత ఇన్వెంటరీ పూర్తైన తర్వాత నుంచి వీటి ప్రభావం క్రమంగా వినియోగదారుపై కనిపిస్తుందని బజాజ్ వెల్లడించింది.
తాజావార్తలు
-
Vivo V80 Lite: వివో వి80 లైట్ లాంచ్ డేట్ ఫిక్స్.. 10,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్తో అదరగొట్టనున్న వివో ఫోన్
-
Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
-
Lingamneni Ramesh Son: ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్పై కేసు.. నేడు పోలీసుల విచారణకు హాజరు!
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
-
Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!