Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Tummala Nageswara Rao Says Telanganas Development Plans

Tummala Nageswara Rao : పంట నష్ట పోయిన ప్రతి రైతును ఆదుకుంటాం

Published Date :April 11, 2025 , 3:41 pm
By Gogikar Sai Krishna
  • సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతన్న నేతన్నలకే ప్రాధాన్యతలు
  • యువత మంచి భవిషత్ కలించాలి
  • 33 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశాం : మంత్రి తుమ్మల
Tummala Nageswara Rao : పంట నష్ట పోయిన ప్రతి రైతును ఆదుకుంటాం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tummala Nageswara Rao : రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతన్న, నేతన్నలే అగ్ర ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం సంకల్పంతో పని చేస్తోందని, రైతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. గత పదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం తాకినప్పటికీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం ఇప్పటికే 33 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీని అమలు చేసినట్లు తెలిపారు. రైతుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా, ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన విత్తనాల పంపిణీ ప్రభుత్వమే చేపట్టనుందని వెల్లడించారు. రైతులు అనుమతి లేని కంపెనీల విత్తనాలు, లూజ్ విత్తనాలు తీసుకోకుండా, ప్రభుత్వం అందించే నాణ్యమైన విత్తనాలే వాడాలని సూచించారు. కల్తీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

చేనేత రంగం గుండె చప్పుడు ఆగకూడదని, నేతన్నల కన్నీరు తుడిచేలా ప్రభుత్వం అన్ని శాఖలకూ టెస్కో ద్వారా కొనుగోళ్లను తప్పనిసరి చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన వస్త్రాలను చేనేత కార్మికుల వద్ద నుంచే కొనుగోలు చేస్తామని, ఈ విధంగా నేతన్నల ఆర్థిక స్థితిని మెరుగుపరచే ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని కొనసాగించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.

ఇక ఉపాధి అవకాశాల విషయానికి వస్తే, జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు తిరిగి తమ సొంత రాష్ట్రమైన తెలంగాణకు రావాలన్న ఉద్దేశంతో ఉద్యోగావకాశాలను మెరుగుపరిచే చర్యలు చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. రానున్న నాలుగేళ్లలో తెలంగాణను దేశంలో ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చుపెట్టే సొమ్ముతో కేంద్ర పథకాలు నడుస్తున్నాయన్నారు. అయినా కేంద్రమంతటా తమ ఫోటోలు పెట్టించుకుంటున్నారని, ప్రజల సొమ్ముతో ప్రజలకే మేలు చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ పథకాలు ఎవరి వ్యక్తిగత సంపత్తి కాదని, ఇవి ప్రజల హక్కు అన్నారు.

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయదని స్పష్టం చేశారు. ఇప్పటికే పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఒక్కొక్క రైతు గుండెల్లో భరోసా నింపేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM Revanth Reddy
  • farmers welfare
  • Handloom Sector
  • Rajanna Sircilla
  • Rythu Loan Waiver

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions