Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Tummala Nageswara Rao About Termaric Board

Tummala Nageswara Rao : పసుపు బోర్డును నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలి

Published Date :February 18, 2024 , 3:27 pm
By Gogikar Sai Krishna
Tummala Nageswara Rao : పసుపు బోర్డును నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలి
  • Follow Us :
  • google news
  • dailyhunt

తుమ్మల నాగేశ్వర రావు ఇటీవల ప్రధాన మంత్రి ప్రకటించిన జాతీయ పసుపు బోర్డును తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని తేదీ 17 ఫిబ్రవరి 2024 నాడు లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు పసుపు రైతుల చిరకాల ఆకాంక్ష. గత పార్లమెంట్ ఎన్నికలలో పసుపు రైతులు పెద్ద ఎత్తున నిజామాబాద్ ఎం.పీ స్థానానికి నామినేషన్లు వేసి నిరసన తెలిపిన విషయము అందరికి విదితమే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం స్పందించి పసుపు బోర్డు ఏర్పాటుకు స్పష్టమైన వాగ్దానం ఇచ్చి, తర్వాత 4 అక్టోబర్ 2023 నాడు పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. అందులో ఎక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రదేశంకాని, దానికి అవసరమగు బడ్జెట్ ప్రతిపాదన కానీ లేకుండా కేవలం కమిటీ సభ్యుల నియామకమునకు సంబందించి మాత్రమే వివరాలను గెజిట్లో పేర్కొన్నారు.

ఈ క్రమంలో కొత్తగా ఏర్పాటు అయిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ట్ర పసుపు రైతుల ప్రయోజనాలపై సంబదిత కేంద్ర ప్రభుత్వ శాఖలతో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రాష్టంలో పసుపు పండించే జిల్లాలలో నిజామాబాద్ జిల్లా ప్రధానమైనది. నిజామాబాద్ పసుపు రైతులు గత పది సంవత్సరాల నుండి పసుపు మద్దతు ధర కోసం మరియు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి క్రమం తప్పకుండా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 2019-20 సంవత్సరంలో 1,39,698 ఎకరాల విస్తిరణలో పసుపు సాగుకాబడి, 3,35,425 మెట్రిక్ టన్నుల పసుపు ఉత్పత్తి కాగా 2022-23 సంవత్సరానికి వచ్చే సరికి 56,174 ఎకరాల విస్తరణంలో పసుపు సాగుచేయబడి 173,610 మెట్రిక్ టన్నుల పసుపు ఉత్పత్తి జరిగినది. 2023-24 సంవత్సరంలో పసుపు సాగువిస్తీర్ణం 34,978 ఎకరాలు మాత్రమే.
ఈ నేపధ్యంలో పసుపు రైతులను బలోపేతం చేయడం కొరకు, పసుపు ధరల స్థరీకరణకు, పసుపుసాగు విస్తీర్ణం పెంచడానికి మరియు పసుపు అనుబంధ విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి ఎగుమతి అవకాశాలు పెంచడానికి పసుపు రైతులు కోరుకుంటున్నట్లుగా జాతీయ పసుపు బోర్డును తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసినట్లయితే పసుపు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి వర్యులు పేర్కొన్నారు.

జాతీయ పసుపు బోర్డు దేశంలో పసుపు మరియు ఉత్పత్తులు అభివృద్ధి పెరుగుదల పై దృష్టి సారిస్తుంది. సుగంధ ద్రవ్యాల బోర్డు మరియు ఇతర ప్రభుత్వ సంస్థలను సమన్వయం చేసుకొని పసుపు రంగం అభివృద్ధిని జాతీయ పసుపు బోర్డు సులభతరం చేస్తుంది. పసుపు యొక్క ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలపై ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ఆసక్తి ఉంది. ఈ నేపథ్యంలో పసుపువినియోగంపై అవగాహన మరింత పెంచడానికి ఎగుమతి అవకాశాలను వృద్ధి చేయడానికి అంతర్జాతీయంగా కొత్త మార్కెట్ అవకాశాలను అభివృద్ధి చేయడానికి, పసుపు విలువ ఆధారిత ఉత్పత్తులలో పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించడానికి మరియు సాంప్రదాయిక పద్ధతులద్వారా పసుపు ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ఈ జాతీయ పసుపు బోర్డు ఉపయోగపడుతుందని మంత్రి వర్యులు పేర్కొన్నారు. విలువ ఆధారిత పసుపు ఉత్పత్తుల పై పరిజ్ఞానం పెంచడం తద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందటం కోసం పసుపు రైతుల సామర్ధ్యాన్ని పెంచుటకు మరియు నైపుణ్యాల అభివృద్ధిపై పసుపు బోర్డు ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని కావున రైతుల సంక్షేమంకోసం జాతీయ పసుపు బోర్డును తెలంగాణా రాష్ట్రంలో వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి వర్యులు ప్రతిపాదనలు పంపటం జరిగింది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • latest news
  • telugu news
  • tummala nageswara rao

తాజావార్తలు

  • Donald Trump: 48 గంటల తర్వాత విధ్వంసమే.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..

  • Telangana : గుడ్ న్యూస్.. సహజ మరణానికీ రూ.10 లక్షలు..!

  • SCR Railway: రైల్వే ప్రయాణికుల బిగ్ అలర్ట్.. ఆ ట్రైన్ డెస్టినేషన్ స్టేషన్ మార్పు..

  • Price Hike : సామాన్యుడికి షాక్.. భారీగా పెరగనున్న మందులు, పెయింట్ల ధరలు

  • Mrunal Thakur: లవ్‌ లైఫ్‌పై ఓపెన్‌ అయిన మృణాల్‌ ఠాకూర్‌.. అన్ని హద్దులు దాటే సమయం వచ్చేసింది..!

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions