Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Ttp Terror Attack Pakistan Soldiers Killed 2025

TTP Terror Attack: పాలుపోసి పెంచిన పాము పాకిస్థాన్‌ను కాటేసింది.. ఉగ్రదాడిలో 12 మంది మృతి

Published Date :September 13, 2025 , 3:25 pm
By Shiva Ganesh
TTP Terror Attack: పాలుపోసి పెంచిన పాము పాకిస్థాన్‌ను కాటేసింది.. ఉగ్రదాడిలో 12 మంది మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

TTP Terror Attack: ఉగ్రవాదం అనే పాముకు పాలు పోసి పెంచింది పాకిస్థాన్. పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు.. నువ్వు ఏం చేస్తే అది నీకు తిరిగి వస్తుందని. ఇది పాకిస్థాన్ విషయంలో వందకు వంద శాతం నిజం అని రుజువు అయ్యింది. ఏ పామును అయితే పాక్ పెంచి పోషించిందో ఇప్పుడు ఆ ఉగ్రవాదం అనే పాము వాళ్లనే కాటువేస్తుంది. శనివారం తెల్లవారుజామున వాయువ్య పాకిస్థాన్‌లో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) జరిపిన మెరుపుదాడిలో కనీసం 12 మంది పాక్‌స్థాన్ సైనికులు మరణించినట్లు సమాచారం. ఈ సంఘటనను స్థానిక పరిపాలన, భద్రతా అధికారులు ధృవీకరించారు.

READ ALSO: Nalgonda: పదో తరగతి విద్యార్థినిపై ప్రభుత్వ ఉపాధ్యాయుడి వేధింపులు.. మూడు నెలలుగా…

Also Read

  • Thalaivar 173: తలైవర్ 173 నుంచి షాకింగ్ న్యూస్.. శంకర్ వర్సెస్ రజనీకాంత్!
  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
  • Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
  • Barrier Free Tolling: భారత్‌లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...

ఇంతకీ ఏం జరిగింది..
శనివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో దక్షిణ వజీరిస్థాన్ జిల్లా గుండా వెళుతున్న సైనిక కాన్వాయ్‌పై టీటీపీ ఉగ్రవాదులు రెండు వైపుల నుంచి భారీ ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో 12 మంది సైనికులు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం ఉగ్రవాదులు కాన్వాయ్ నుంచి ఆయుధాలను దోచుకున్నారు. ఈ దాడికి తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) బాధ్యత వహిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ దాడి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద దాడులలో ఒకటి.

ఇటీవల కాలంలో ఖైబర్ పఖ్తుంఖ్వాలోని అనేక ప్రాంతాలలో TTP పేరుతో గోడలపై నినాదాలు కనిపిస్తున్నాయి. దీని కారణంగా ఈ ప్రాంతాన్ని ఉగ్రవాదులు మళ్లీ స్వాధీనం చేసుకుంటారనే భయం స్థానిక ప్రజల్లో పెరుగుతోందని అక్కడి వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో టీటీపీ ఉగ్రవాదుల ఉనికి, దాడుల సంఖ్య పెరిగాయని ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. జనవరి 1 నుంచి ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్లలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో సుమారు 460 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది భద్రతా దళాల సిబ్బందే ఉన్నారు.

2014లో జరిగిన ఒక పెద్ద సైనిక చర్య తర్వాత TTP ఉగ్రవాదులు వెనక్కి తగ్గినప్పటికి, 2021లో ఆఫ్ఘన్ తాలిబన్లు కాబూల్‌కు తిరిగి వచ్చిన నాటి నుంచి పాకిస్థాన్-ఆఫ్ఘన్ సరిహద్దులో తిరిగి టీటీపీ ఉగ్రవాద కార్యకలాపాలు తీవ్రమయ్యాయి. ఆఫ్ఘనిస్థాన్ తన నేల నుంచి ఉగ్రవాదులను ఆపడంలో విఫలమైందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. అయితే కాబూల్‌లోని తాలిబన్ సర్కార్ పాక్ ఆరోపణలను ఖండిస్తోంది. గత ఏడాది కాలంలో పాకిస్థాన్ దాదాపు పదేళ్లలో అత్యంత ఎక్కువ రక్తపాతాన్ని చూసింది. గత ఏడాది సమయంలో 1,600 మందికి పైగా మరణిస్తే, వారిలో సగానికిపైగా సైన్యం, పోలీసులు ఉన్నారు.

READ ALSO: Dammannapet : దమ్మన్నపేటలో అడవి హక్కులపై ఘర్షణ, ఫారెస్ట్ అధికారులపై ఆదివాసీల ఆగ్రహం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Khyber Pakhtunkhwa terrorism
  • Pakistan Afghanistan border violence
  • Pakistan Taliban news
  • Pakistan terror attack 2025
  • Pakistani Soldiers Killed

తాజావార్తలు

  • Thalaivar 173: తలైవర్ 173 నుంచి షాకింగ్ న్యూస్.. శంకర్ వర్సెస్ రజనీకాంత్!

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

  • Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions