TIrumala: రేపటి నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ వైకుంఠం భక్తులతో కిటకిటలాడుతోంది. రేపటి నుంచి పదిరోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం వుంటుంది. ఇవాళ అర్దరాత్రి 12 గంటల తరువాత ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరచుకోనున్నాయి. పూజా కార్యక్రమాల నిర్వహణ అనంతరం రేపు ఉదయం 1.45 నిముషాలకు ప్రారంభం కానున్నాయి వీఐపీల దర్శనాలు. ఉదయం 5 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు కలిగిన భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 6 గంటల నుంచి టోకెన్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించనుంది టీటీడీ.
రేపు ఉదయం 9 గంటలకు స్వర్ణరథంపై భక్తులకు దర్శనం ఇవనున్నారు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి. ఎల్లుండి ఉదయం 4 గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలకు భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. తిరుపతిలోనూ వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీప్రకియ కొనసాగుతోంది. వేకువజామున 3 గంటల నుంచే టోకెన్లు జారీచేస్తోంది టీటీడీ. దీంతో భక్తుల సందడి నెలకొంది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Read Also: Ukraine War: విజయం సాధించే వరకు పోరాడుతూనే ఉంటాం.. జెలన్ స్కీ న్యూఇయర్ సందేశం
నూతన సంవత్సరం సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు. జమ్ము కాశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర బాబు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాధ్ తిలహరి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల కార్తీక్, ఏపీ డిప్యూటీ సీఎంలు ముత్యాల నాయుడు, నారాయణ స్వామి, వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. వీరితో పాటు తమిళనాడు మంత్రి గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ వున్నారు.
మరో వైపు తిరుమలలో భక్తులు పోటెత్తుతున్నారు. 15 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,460 మంది భక్తులు…తలనీలాలు సమర్పించిన 29,182 మంది భక్తులు…హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు అని టీటీడీ వెల్లడించింది.
Read Also: Rishabh Pant: అవన్నీ తప్పుడు వార్తలు.. అదే నిజమైతే పంత్ బతికేవాడు కాదు
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!