Trump: థర్డ్ వరల్డ్ వార్పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
మూడో ప్రపంచ యుద్ధంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మూడో ప్రపంచ యుద్ధం అంచున ఉన్నామని ట్రంప్ హెచ్చరించారు. ఇటీవల పశ్చిమాసియాలోని బోర్డాన్లో మిలిటెంట్ గ్రూపులు జరిపిన దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను అమెరికా చాలా సీరియస్గా తీసుకుంది. దీటుగా సమాధానం ఇస్తామని అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే హెచ్చరించారు. తాజాగా ఈ పరిణామాలపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ అగ్రరాజ్యానికి ఇదొక భయంకరమైన రోజుగా అభివర్ణించారు. ఈ సందర్భంగా బైడెన్ విదేశీ విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం అమెరికా బలహీనంగా ఉందని.. మూడో ప్రపంచ యుద్ధం అంచున ఉన్నామని హెచ్చరించారు.
Read Also: Arvind Kejriwal: నితీష్.. బీజేపీతో కలవడంపై కేజ్రీవాల్ ఏమన్నారంటే..!
Also Read
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
- Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
అంతే కాదు తాను అధ్యక్షుడిగా ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదేకాదని.. అలాగే ఉక్రెయిన్ యుద్ధం కూడా జరిగి ఉండేది కాదని చెప్పుకొచ్చారు. బైడెన్ అసమర్థ వల్లే బోర్డాన్లో విషాదం చోటుచేసుకుందన్నారు. తాను అధ్యక్ష పదవి నుంచి దిగేపోయే సమయానికి ఇరాన్ చాలా బలహీనంగా ఉండేదని.. కానీ ఇప్పుడు బైడెన్ వచ్చాక ఆ దేశానికి వేల కోట్ల డాలర్లు వెళ్తున్నాయని ఆరోపించారు. ఈ కారణంగానే రక్తపాతానికి కారణమైందని ట్రంప్ విమర్శించారు.
తిప్పికొట్టిన బైడెన్ ప్రభుత్వం
ట్రంప్ చేసిన వ్యా్ఖ్యలను బైడెన్ ప్రభుత్వం ఖండించింది. జాతీయ భద్రతను ట్రంప్ రాజకీయం చేయాలని చూస్తున్నారని తిప్పికొట్టింది. ఇలాంటి వ్యాఖ్యలు దేశ భద్రతకు హానికరమని బైడెన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. బోర్డాన్లో అమెరికా సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 34 మంది గాయాపడ్డారు. ఈ ఘటన వెనుక తమ ప్రమేయం లేదని ఇరాన్ వెల్లడించింది.
Read Also: Supreeth Reddy: డైరెక్టర్ గా మారబోతున్న ఛత్రపతి విలన్.. ఏకంగా ప్రభాస్.. ?
ఇదిలా ఉంటే రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా తాజాగా వ్యాఖ్యాంచారు. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ట్రంప్ కూడా ఇదే విషయంపై హెచ్చరించారు.
తాజావార్తలు
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
-
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
-
Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!