US Iran War: ఇరాన్పై దాడి చేయాల వద్దా అనేది.. ఆ ఇద్దరి చేతుల్లోనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Iran War: అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి. అమెరికా ఎప్పుడైనా ఇరాన్పై దాడి చేయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఇరాన్పై వైమానిక దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇద్దరు కీలక వ్యక్తులు అధ్యక్షుడి నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తారని అంటున్నారు. వారే ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్. ఈ ఇద్దరూ జెనీవాలో జరిగే కీలకమైన చర్చలకు నాయకత్వం వహిస్తున్నారు.
READ ALSO: IPL 2026: కొత్త లోగోతో కొత్త ప్రారంభం.. Lucknow Super Giants కొత్త లోగో ఆవిష్కరణ!
Also Read
- Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
- NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్లైన్ ఇదే..
- Axar Patel: విజయం సాధించిన లేని ఆనందం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్కు భారీ జరిమానా..!
ఈ వారం ఇరాన్ తన కొత్త ప్రతిపాదనను సమర్పించే అవకాశం ఉంది. గురువారం జెనీవాలో జరిగే చర్చలు చివరి రౌండ్ చర్చలు కావచ్చని అంటున్నారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరకపోతే, ట్రంప్ మొదట పరిమిత వైమానిక దాడులను చేయించవచ్చని, అవి పని చేయకపోతే, పెద్ద దాడిని లేదా ఇరాన్లో అధికార మార్పుకు అడుగులు వేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైట్ హౌస్ సిట్యుయేషన్ రూమ్లో సైనిక ఎంపికలపై ట్రంప్కు అనేక బ్రీఫింగ్లు అందాయని సమాచారం. అధ్యక్షుడి కీలక సలహాదారులలో ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, సిఐఎ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ డాన్ కైన్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఉన్నారు.
ఒకవేళ అమెరికా దాడి చేస్తే.. ఈసారి మరింత తీవ్రంగా స్పందిస్తామని ఇరాన్ బెదిరించింది. ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ, అమెరికా యుద్ధనౌకను ముంచివేసే సామర్థ్యం తమకు ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో ట్రంప్ ఇరాన్ అణు సుసంపన్నతను పూర్తిగా నిలిపివేయాలని కోరుకుంటున్నారు, అయితే, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి, తమ దేశం సుసంపన్నతను పూర్తిగా వదిలివేయడానికి సిద్ధంగా లేదని స్పష్టంగా పేర్కొన్నారు. ఈక్రమంలో అమెరికా 2003 ఇరాక్ యుద్ధం తర్వాత మధ్యప్రాచ్యంలో తన అతిపెద్ద వైమానిక మోహరింపును ప్రారంభించింది. యుఎస్ విమాన వాహక నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ త్వరలో ఈ ప్రాంతానికి చేరుకుంటుంది. అదనంగా, ఎఫ్-35, ఎఫ్-22 యుద్ధ విమానాలు, బాంబర్లు, ఇంధనం నింపే విమానాలు ఇప్పటికే ఇరాన్ వైపు మోహరించారు.
READ ALSO: US-Iran Tension: ఇరాన్ వార్కు ముందు, యూఎస్ సైన్యానికి ‘‘టాయిలెట్’’ సమస్య..
తాజావార్తలు
-
Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
-
LPG Subsidy Cut: సామాన్యుడికి గ్యాస్ షాక్.. ఇకపై సబ్సిడీ కట్!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
-
NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్లైన్ ఇదే..
-
Hiro Vishal: 717 వైన్ షాపుల మూసివేత.. హీరో విశాల్ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!