Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump: భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ (సీజ్ఫైర్) వెనుక అంతర్జాతీయంగా ఏం జరిగిందనే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల అభ్యర్థన మేరకే తాము ఈ కాల్పుల విరమణ ప్రక్రియలో జోక్యం చేసుకున్నామని స్పష్టం చేశారు. అయితే, ఈ నిర్ణయాన్ని తాను అంతగా ఇష్టపడలేదని, కానీ పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్, ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చాలా రిక్వెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. వాళ్లకు ఒక ‘ఫేవర్’లా (సహాయంలా) సీజ్ఫైర్పై చర్చించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవల అమెరికాలోని యాంకరేజ్ నగరానికి ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. పాక్ ప్రధానిని, ఆర్మీ చీఫ్ను ‘టెర్రిఫిక్ పీపుల్’ (అద్భుతమైన వ్యక్తులు) అని అభివర్ణిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది. భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాకిస్థాన్ వెళ్లినట్లు ఈ వ్యాఖ్యలతో మరోసారి స్పష్టమైంది.
అయితే, ఈ కాల్పుల విరమణకు సంబంధించి పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ గతంలో గమ్మత్తు ప్రకటన చేశారు. భారతే స్వయంగా అమెరికాను ఆశ్రయించి, మధ్యవర్తిత్వం వహించాలని కోరిందని తప్పుడు వ్యాఖ్యలు చేశారు. రావల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మునీర్ మాట్లాడుతూ… భారత్ అమెరికా నాయకత్వం ద్వారా మధ్యవర్తిత్వం కోసం ఆసక్తి చూపించిందని, ప్రాంతీయ శాంతిని కాంక్షించి పాకిస్థాన్ దానికి అంగీకరించిందని డాన్ న్యూస్ వేదికగా వ్యాఖ్యానించారు. కానీ, ఈ వ్యవహారంలో అసలు నిజాలు అమెరికాలోని ‘ఫారెన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్’ (FARA) ద్వారా బయటపడ్డాయి. భారత్ అడిగిందని పాక్ ఆర్మీ చీఫ్ చెప్తున్న మాటలు అబద్ధమని అమెరికా అధికారిక లాబీయింగ్ పత్రాలు నిరూపిస్తున్నాయి. మే 6 నుంచి మే 9, 2025 మధ్య కాలంలో పాకిస్థానే స్వయంగా అమెరికాలో పెద్ద ఎత్తున దౌత్యపరమైన లాబీయింగ్ జరిపినట్లు ఈ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ సహాయకులు, రక్షణ రంగానికి చెందిన అధికారులు, ట్రెజరీ అధికారులు, జాతీయ భద్రతా సలహాదారులు, జర్నలిస్టులతో పాకిస్థాన్ దాదాపు 60 సార్లు సంప్రదింపులు జరిపిందని ఏఎన్ఐ సమీక్షించిన ఈ పత్రాలు వెల్లడించాయి.
Also Read
- Hormuz Strait Crisis: పాక్ విఫలం.. 'హార్మూజ్' కోసం రంగంలోకి ఖతార్..!
- Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
- Virat Kohli World Record: SRH మ్యాచ్లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
- Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. ఈ 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
పాకిస్థాన్ అమెరికా చుట్టూ ఇంతలా ప్రదక్షిణలు చేయడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్పై విరుచుకుపడింది. పాకిస్థాన్, అలాగే పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ ఈ ఆపరేషన్ చేపట్టింది. మే 6, మే 7 రాత్రి వేళల్లో భారత సాయుధ దళాలు ముప్పేట దాడి (ట్రై-సర్వీసెస్ ఆపరేషన్) చేస్తూ… ఉగ్రవాదులకు చెందిన 9 కీలక స్థావరాలు ధ్వంసం చేశాయి. అత్యంత ఖచ్చితత్వంతో కూడిన దాడుల్లో ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశామని భారత రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. భారత్ దెబ్బకు భయపడిపోయిన పాకిస్థాన్, ఆ దాడులను ఆపించడం కోసమే అమెరికా కాళ్లబేరానికి వెళ్లి లాబీయింగ్ చేసింది. చివరకు ట్రంప్ జోక్యంతో కాల్పుల విరమణ సాధ్యమైందని ఈ తాజాగా స్పష్టమైంది.
తాజావార్తలు
-
Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన ప్రకటన..
-
Kohli vs Head: సైగలతో రెచ్చగొట్టిన విరాట్.. కోహ్లీ-ట్రావిస్ హెడ్ మధ్య అసలేం జరిగింది?.. క్లారిటీ ఇదిగో!
-
Swayambhu: ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత భారీ గ్రాఫిక్స్తో వస్తున్న నిఖిల్ మూవీ
-
Google AI Studio: డెవలపర్లకు గుడ్ న్యూస్.. మొబైల్ నుంచే AI డెవలప్మెంట్.. గూగుల్ AI స్టూడియో ఇప్పుడు ఆండ్రాయిడ్లో
-
Hormuz Strait Crisis: పాక్ విఫలం.. ‘హార్మూజ్’ కోసం రంగంలోకి ఖతార్..!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!