BCCI Trolls: కోట్లలో సంపద.. మైదానాలు మాత్రం అధ్వానం! బీసీసీఐపై విమర్శల వర్షం
- 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం
- 2-3 రోజుల ఆట రద్దు
- బీసీసీఐపై విమర్శల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన క్రికెట్ బోర్డు ఏదంటే.. అందరూ టక్కున బీసీసీఐ అనే చెప్తారు. ఐపీఎల్, దేశవాళీ, అంతర్జాతీయ టోర్నీలతో ఏటా భారీగా ఆదాయం సంపాదిస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ ద్వారా కోట్లు గడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరున్న బీసీసీఐ.. మైదానాల విషయంలో మాత్రం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఇందుకు కారణం అహ్మదాబాద్, నోయిడా, కాన్పూర్ మైదానాల్లో జరిగిన ఘటనలే. వర్షం ఆగిన గంటల వ్యవధుల్లోనే స్టేడియాలు సిద్ధమయ్యేలా మౌలిక వసతులు లేకపోవడంతో.. అత్యంత సంపన్నమైన బోర్డు బీసీసీఐపై విమర్శల వర్షం కురుస్తోంది.
ఐపీఎల్ 2023 ఫైనల్లో వర్షం కారణంగా అంతరాయం కలిగింది. వరుణుడు కరుణించినా.. మైదానం సిద్ధం చేసేందుకు చాలా సమయం పట్టింది. పిచ్పై ఉన్న నీటిని సిబ్బంది స్పాంజ్లతో తొలగిస్తున్నట్లు, హెయిర్ డ్రయర్లను వినియోగిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల నోయిడా వేదికగా అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా మొదటి రోజు ఆట రద్దైంది. తర్వాత వర్షం లేకపోయినా మైదానం మాత్రం ఆట నిర్వహణకు సాధ్యం కాలేదు. దాంతో ఏకంగా మ్యాచునే రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
Also Read: iphone Prices Drop: భారీగా తగ్గిన ‘యాపిల్’ ధరలు.. ఈ సేల్ను అస్సలు మిస్ కావొద్దు!
ప్రస్తుతం కాన్పూర్ వేదికగా జరుగుతున్న భారత్, బంగ్లాదేశ్తో రెండో టెస్టులో తొలిరోజు 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా.. రెండు, మూడు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయింది. మూడో రోజు వర్షం లేకపోయినా.. మైదానం చిత్తడిగా ఉండటంతో ఒక్క బంతి కూడా పడలేదు. స్టేడియాన్ని మ్యాచ్ నిర్వహణకు అనుగుణంగా సిద్ధం చేసే సరైన యంత్రాంగం అక్కడ లేకపోవడమే ఇందుకు కారణం. మ్యాచ్ రెండు రోజులు రద్దవడంతో అభిమానులను తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదేం నిర్వహణ అంటూ బీసీసీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ‘కోట్లలో సంపద.. మైదానాలు మాత్రం అధ్వానం’, ‘బీసీసీఐకి కాస్త సిగ్గుండాలి’ అంటూ నెట్టింట ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!