BCCI Trolls: కోట్లలో సంపద.. మైదానాలు మాత్రం అధ్వానం! బీసీసీఐపై విమర్శల వర్షం
- 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం
- 2-3 రోజుల ఆట రద్దు
- బీసీసీఐపై విమర్శల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన క్రికెట్ బోర్డు ఏదంటే.. అందరూ టక్కున బీసీసీఐ అనే చెప్తారు. ఐపీఎల్, దేశవాళీ, అంతర్జాతీయ టోర్నీలతో ఏటా భారీగా ఆదాయం సంపాదిస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ ద్వారా కోట్లు గడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరున్న బీసీసీఐ.. మైదానాల విషయంలో మాత్రం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఇందుకు కారణం అహ్మదాబాద్, నోయిడా, కాన్పూర్ మైదానాల్లో జరిగిన ఘటనలే. వర్షం ఆగిన గంటల వ్యవధుల్లోనే స్టేడియాలు సిద్ధమయ్యేలా మౌలిక వసతులు లేకపోవడంతో.. అత్యంత సంపన్నమైన బోర్డు బీసీసీఐపై విమర్శల వర్షం కురుస్తోంది.
ఐపీఎల్ 2023 ఫైనల్లో వర్షం కారణంగా అంతరాయం కలిగింది. వరుణుడు కరుణించినా.. మైదానం సిద్ధం చేసేందుకు చాలా సమయం పట్టింది. పిచ్పై ఉన్న నీటిని సిబ్బంది స్పాంజ్లతో తొలగిస్తున్నట్లు, హెయిర్ డ్రయర్లను వినియోగిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల నోయిడా వేదికగా అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా మొదటి రోజు ఆట రద్దైంది. తర్వాత వర్షం లేకపోయినా మైదానం మాత్రం ఆట నిర్వహణకు సాధ్యం కాలేదు. దాంతో ఏకంగా మ్యాచునే రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
Also Read: iphone Prices Drop: భారీగా తగ్గిన ‘యాపిల్’ ధరలు.. ఈ సేల్ను అస్సలు మిస్ కావొద్దు!
ప్రస్తుతం కాన్పూర్ వేదికగా జరుగుతున్న భారత్, బంగ్లాదేశ్తో రెండో టెస్టులో తొలిరోజు 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా.. రెండు, మూడు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయింది. మూడో రోజు వర్షం లేకపోయినా.. మైదానం చిత్తడిగా ఉండటంతో ఒక్క బంతి కూడా పడలేదు. స్టేడియాన్ని మ్యాచ్ నిర్వహణకు అనుగుణంగా సిద్ధం చేసే సరైన యంత్రాంగం అక్కడ లేకపోవడమే ఇందుకు కారణం. మ్యాచ్ రెండు రోజులు రద్దవడంతో అభిమానులను తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదేం నిర్వహణ అంటూ బీసీసీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ‘కోట్లలో సంపద.. మైదానాలు మాత్రం అధ్వానం’, ‘బీసీసీఐకి కాస్త సిగ్గుండాలి’ అంటూ నెట్టింట ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!