Elephants : రైలు ఢీకొని ఆరు ఏనుగులు మృతి… ప్రతి ఏడాది ఇలా ఎన్ని చనిపోతున్నాయంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elephants : శ్రీలంకలోని హబరానా ప్రాంతంలో గురువారం ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఒక ప్యాసింజర్ రైలు ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరు ఏనుగులు చనిపోయాయి. గాయపడిన రెండు ఏనుగుల చికిత్స కొనసాగుతోంది. శ్రీలంకలో ఇప్పటివరకు జరిగిన అత్యంత దారుణమైన రైలు-ఏనుగు ఢీకొన్న సంఘటనలలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది. శ్రీలంకలో రైళ్లు, ఏనుగుల మధ్య ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. వన్యప్రాణుల సంరక్షణ సంస్థల ప్రకారం.. ప్రతి సంవత్సరం దాదాపు 20 ఏనుగులు రైలు ప్రమాదాల్లో చనిపోతున్నాయి. ఇది కాకుండా, గతేడాది మానవ-ఏనుగుల సంఘర్షణలో 170 మందికి పైగా, సుమారు 500 ఏనుగులు మరణించాయి.
మానవ నివాసాల్లోకి ఏనుగుల ప్రవేశం
అటవీ నిర్మూలన, సహజ వనరుల కొరత కారణంగా ఏనుగులు ఇప్పుడు మానవ ప్రాంతాలలోకి ప్రవేశించాల్సి వస్తోందని నిపుణులు అంటున్నారు. దీని కారణంగా అవి రైల్వే ట్రాక్లు, పొలాలు, గ్రామాలపైకి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నాయి. రైలు ప్రమాదాలతో పాటు, అనేక ఏనుగులు విద్యుదాఘాతం, విషపూరిత ఆహారం తినడం, వేటాడటం వంటి వాటికి కూడా గురవుతున్నాయి.
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
Read Also:Andhra Pradesh: లోకాయుక్త ఆదేశాలు.. 55 మంది ప్రభుత్వ వైద్యుల తొలగింపు..
రైలు పైలట్లకు కూడా సూచనలు
వన్యప్రాణి నిపుణులు, స్థానిక పరిపాలన అధికారులు అడవులు, ఏనుగుల కారిడార్ల గుండా వెళుతున్నప్పుడు రైలు వేగాన్ని తగ్గించాలని.. హారన్ మోగించి తద్వారా ఏనుగులను హెచ్చరించాలని రైలు ఫైలట్లకు నిరంతరం విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
గతంలోనూ పెద్ద ప్రమాదాలు
హబరానాలో ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. 2018లో అదే ప్రాంతంలో ఒక గర్భిణీ ఏనుగు, దాని రెండు పిల్లలు రైలు ఢీకొని చనిపోయాయి. అదేవిధంగా, గత ఏడాది అక్టోబర్లో మిన్నేరియా ప్రాంతంలో ఒక రైలు ఏనుగుల గుంపును ఢీకొట్టింది. దీనిలో రెండు ఏనుగులు చనిపోగా ఒకటి గాయపడింది.
Read Also:TG EAPCET 2025: అలర్ట్.. టీజీ ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదల..
శ్రీలంకలో ఏనుగులకు చట్టపరమైన రక్షణ
శ్రీలంకలో ఏనుగులకు ప్రత్యేక చట్టపరమైన రక్షణ ఉంది. దేశంలో దాదాపు 7,000 అడవి ఏనుగులు ఉన్నాయి. వీటిని అక్కడి బౌద్ధ సమాజం పవిత్రంగా భావిస్తుంది. శ్రీలంకలో ఏనుగును చంపడం చట్టపరమైన నేరం, దీనికి జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించే నిబంధన ఉంది. అయినప్పటికీ, మానవ-ఏనుగుల సంఘర్షణ కేసులు పెరగడం ప్రభుత్వానికి.. వన్యప్రాణి నిపుణులకు పెద్ద సవాలుగా మిగిలిపోయింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!