Elephants : రైలు ఢీకొని ఆరు ఏనుగులు మృతి… ప్రతి ఏడాది ఇలా ఎన్ని చనిపోతున్నాయంటే ?
Elephants : శ్రీలంకలోని హబరానా ప్రాంతంలో గురువారం ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఒక ప్యాసింజర్ రైలు ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరు ఏనుగులు చనిపోయాయి. గాయపడిన రెండు ఏనుగుల చికిత్స కొనసాగుతోంది. శ్రీలంకలో ఇప్పటివరకు జరిగిన అత్యంత దారుణమైన రైలు-ఏనుగు ఢీకొన్న సంఘటనలలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది. శ్రీలంకలో రైళ్లు, ఏనుగుల మధ్య ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. వన్యప్రాణుల సంరక్షణ సంస్థల ప్రకారం.. ప్రతి సంవత్సరం దాదాపు 20 ఏనుగులు రైలు ప్రమాదాల్లో చనిపోతున్నాయి. ఇది కాకుండా, గతేడాది మానవ-ఏనుగుల సంఘర్షణలో 170 మందికి పైగా, సుమారు 500 ఏనుగులు మరణించాయి.
మానవ నివాసాల్లోకి ఏనుగుల ప్రవేశం
అటవీ నిర్మూలన, సహజ వనరుల కొరత కారణంగా ఏనుగులు ఇప్పుడు మానవ ప్రాంతాలలోకి ప్రవేశించాల్సి వస్తోందని నిపుణులు అంటున్నారు. దీని కారణంగా అవి రైల్వే ట్రాక్లు, పొలాలు, గ్రామాలపైకి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నాయి. రైలు ప్రమాదాలతో పాటు, అనేక ఏనుగులు విద్యుదాఘాతం, విషపూరిత ఆహారం తినడం, వేటాడటం వంటి వాటికి కూడా గురవుతున్నాయి.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
Read Also:Andhra Pradesh: లోకాయుక్త ఆదేశాలు.. 55 మంది ప్రభుత్వ వైద్యుల తొలగింపు..
రైలు పైలట్లకు కూడా సూచనలు
వన్యప్రాణి నిపుణులు, స్థానిక పరిపాలన అధికారులు అడవులు, ఏనుగుల కారిడార్ల గుండా వెళుతున్నప్పుడు రైలు వేగాన్ని తగ్గించాలని.. హారన్ మోగించి తద్వారా ఏనుగులను హెచ్చరించాలని రైలు ఫైలట్లకు నిరంతరం విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
గతంలోనూ పెద్ద ప్రమాదాలు
హబరానాలో ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. 2018లో అదే ప్రాంతంలో ఒక గర్భిణీ ఏనుగు, దాని రెండు పిల్లలు రైలు ఢీకొని చనిపోయాయి. అదేవిధంగా, గత ఏడాది అక్టోబర్లో మిన్నేరియా ప్రాంతంలో ఒక రైలు ఏనుగుల గుంపును ఢీకొట్టింది. దీనిలో రెండు ఏనుగులు చనిపోగా ఒకటి గాయపడింది.
Read Also:TG EAPCET 2025: అలర్ట్.. టీజీ ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదల..
శ్రీలంకలో ఏనుగులకు చట్టపరమైన రక్షణ
శ్రీలంకలో ఏనుగులకు ప్రత్యేక చట్టపరమైన రక్షణ ఉంది. దేశంలో దాదాపు 7,000 అడవి ఏనుగులు ఉన్నాయి. వీటిని అక్కడి బౌద్ధ సమాజం పవిత్రంగా భావిస్తుంది. శ్రీలంకలో ఏనుగును చంపడం చట్టపరమైన నేరం, దీనికి జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించే నిబంధన ఉంది. అయినప్పటికీ, మానవ-ఏనుగుల సంఘర్షణ కేసులు పెరగడం ప్రభుత్వానికి.. వన్యప్రాణి నిపుణులకు పెద్ద సవాలుగా మిగిలిపోయింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!