Elephants : రైలు ఢీకొని ఆరు ఏనుగులు మృతి… ప్రతి ఏడాది ఇలా ఎన్ని చనిపోతున్నాయంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elephants : శ్రీలంకలోని హబరానా ప్రాంతంలో గురువారం ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఒక ప్యాసింజర్ రైలు ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరు ఏనుగులు చనిపోయాయి. గాయపడిన రెండు ఏనుగుల చికిత్స కొనసాగుతోంది. శ్రీలంకలో ఇప్పటివరకు జరిగిన అత్యంత దారుణమైన రైలు-ఏనుగు ఢీకొన్న సంఘటనలలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది. శ్రీలంకలో రైళ్లు, ఏనుగుల మధ్య ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. వన్యప్రాణుల సంరక్షణ సంస్థల ప్రకారం.. ప్రతి సంవత్సరం దాదాపు 20 ఏనుగులు రైలు ప్రమాదాల్లో చనిపోతున్నాయి. ఇది కాకుండా, గతేడాది మానవ-ఏనుగుల సంఘర్షణలో 170 మందికి పైగా, సుమారు 500 ఏనుగులు మరణించాయి.
మానవ నివాసాల్లోకి ఏనుగుల ప్రవేశం
అటవీ నిర్మూలన, సహజ వనరుల కొరత కారణంగా ఏనుగులు ఇప్పుడు మానవ ప్రాంతాలలోకి ప్రవేశించాల్సి వస్తోందని నిపుణులు అంటున్నారు. దీని కారణంగా అవి రైల్వే ట్రాక్లు, పొలాలు, గ్రామాలపైకి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నాయి. రైలు ప్రమాదాలతో పాటు, అనేక ఏనుగులు విద్యుదాఘాతం, విషపూరిత ఆహారం తినడం, వేటాడటం వంటి వాటికి కూడా గురవుతున్నాయి.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
Read Also:Andhra Pradesh: లోకాయుక్త ఆదేశాలు.. 55 మంది ప్రభుత్వ వైద్యుల తొలగింపు..
రైలు పైలట్లకు కూడా సూచనలు
వన్యప్రాణి నిపుణులు, స్థానిక పరిపాలన అధికారులు అడవులు, ఏనుగుల కారిడార్ల గుండా వెళుతున్నప్పుడు రైలు వేగాన్ని తగ్గించాలని.. హారన్ మోగించి తద్వారా ఏనుగులను హెచ్చరించాలని రైలు ఫైలట్లకు నిరంతరం విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
గతంలోనూ పెద్ద ప్రమాదాలు
హబరానాలో ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. 2018లో అదే ప్రాంతంలో ఒక గర్భిణీ ఏనుగు, దాని రెండు పిల్లలు రైలు ఢీకొని చనిపోయాయి. అదేవిధంగా, గత ఏడాది అక్టోబర్లో మిన్నేరియా ప్రాంతంలో ఒక రైలు ఏనుగుల గుంపును ఢీకొట్టింది. దీనిలో రెండు ఏనుగులు చనిపోగా ఒకటి గాయపడింది.
Read Also:TG EAPCET 2025: అలర్ట్.. టీజీ ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదల..
శ్రీలంకలో ఏనుగులకు చట్టపరమైన రక్షణ
శ్రీలంకలో ఏనుగులకు ప్రత్యేక చట్టపరమైన రక్షణ ఉంది. దేశంలో దాదాపు 7,000 అడవి ఏనుగులు ఉన్నాయి. వీటిని అక్కడి బౌద్ధ సమాజం పవిత్రంగా భావిస్తుంది. శ్రీలంకలో ఏనుగును చంపడం చట్టపరమైన నేరం, దీనికి జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించే నిబంధన ఉంది. అయినప్పటికీ, మానవ-ఏనుగుల సంఘర్షణ కేసులు పెరగడం ప్రభుత్వానికి.. వన్యప్రాణి నిపుణులకు పెద్ద సవాలుగా మిగిలిపోయింది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?