Train Accident : రష్యాలోని కోమిలో ప్యాసింజర్ రైలు తొమ్మిది కోచ్లు పట్టాలు తప్పడంతో 70 మంది గాయపడ్డారు. ఇందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఇంకా ఎంతమంది మరణించారో తెలియడం లేదు. రైలు 511 ఆర్కిటిక్ సర్కిల్ మీదుగా ఈశాన్య కోమిలోని వోర్కుటా.. నల్ల సముద్రపు ఓడరేవు నోవోరోసిస్క్ మధ్య సుమారు 5,000 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తోంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) 6:12 గంటలకు ఇంటా సిటీకి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి అత్యవసర సేవలను పంపినట్లు రష్యన్ రైల్వే టెలిగ్రామ్లో తెలిపింది. ప్రయాణికులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Read Also:America: అమెరికాలో మరో దారుణం.. భారత సంతతికి చెందిన వ్యక్తి మృతి
రైలులో 232 మంది ప్రయాణికులు
బాధితులకు సంబంధించిన సమాచారంపై స్పష్టత ఇస్తున్నామని చెప్పారు. ఈ మార్గంలో ట్రాఫిక్ను నిలిపివేశారు. రైలు 511లో మొత్తం 14 కోచ్లు 232 మంది ప్రయాణికులతో ఉన్నాయని రైల్వే ఆపరేటర్ తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలే పట్టాలు తప్పడానికి కారణమని రష్యా రైల్వే పేర్కొంది.
టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
రైలు పట్టాలు తప్పిన ఘటనపై దర్యాప్తు చేసేందుకు రైల్వే జనరల్ డైరెక్టర్ ఒలేగ్ బెలోజెరోవ్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసింది. ఘటనా స్థలానికి రెండు రికవరీ రైళ్లను పంపించారు. నార్త్-వెస్ట్రన్ ట్రాన్స్పోర్ట్ ప్రాసిక్యూటర్ కార్యాలయం పట్టాలు తప్పిన ఘటనపై క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించింది. ఘటన తర్వాత కోమి చీఫ్ వ్లాదిమిర్ ఉయ్బా ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం.
Read Also:Rahul gandhi: పరువు నష్టం కేసులో వ్యక్తిగత హాజరుకు కోర్టు ఆదేశం