Train Accident : ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన తొమ్మిది కోచ్ లు.. 70మందికి గాయాలు
- రష్యాలో ఘోర రైలు ప్రమాదం
- 232 మంది ప్రయాణికులతో 70మందికి గాయాలు
- దర్యాప్తు చేసేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Train Accident : రష్యాలోని కోమిలో ప్యాసింజర్ రైలు తొమ్మిది కోచ్లు పట్టాలు తప్పడంతో 70 మంది గాయపడ్డారు. ఇందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఇంకా ఎంతమంది మరణించారో తెలియడం లేదు. రైలు 511 ఆర్కిటిక్ సర్కిల్ మీదుగా ఈశాన్య కోమిలోని వోర్కుటా.. నల్ల సముద్రపు ఓడరేవు నోవోరోసిస్క్ మధ్య సుమారు 5,000 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తోంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) 6:12 గంటలకు ఇంటా సిటీకి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి అత్యవసర సేవలను పంపినట్లు రష్యన్ రైల్వే టెలిగ్రామ్లో తెలిపింది. ప్రయాణికులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Read Also:America: అమెరికాలో మరో దారుణం.. భారత సంతతికి చెందిన వ్యక్తి మృతి
Also Read
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
రైలులో 232 మంది ప్రయాణికులు
బాధితులకు సంబంధించిన సమాచారంపై స్పష్టత ఇస్తున్నామని చెప్పారు. ఈ మార్గంలో ట్రాఫిక్ను నిలిపివేశారు. రైలు 511లో మొత్తం 14 కోచ్లు 232 మంది ప్రయాణికులతో ఉన్నాయని రైల్వే ఆపరేటర్ తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలే పట్టాలు తప్పడానికి కారణమని రష్యా రైల్వే పేర్కొంది.
టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
రైలు పట్టాలు తప్పిన ఘటనపై దర్యాప్తు చేసేందుకు రైల్వే జనరల్ డైరెక్టర్ ఒలేగ్ బెలోజెరోవ్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసింది. ఘటనా స్థలానికి రెండు రికవరీ రైళ్లను పంపించారు. నార్త్-వెస్ట్రన్ ట్రాన్స్పోర్ట్ ప్రాసిక్యూటర్ కార్యాలయం పట్టాలు తప్పిన ఘటనపై క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించింది. ఘటన తర్వాత కోమి చీఫ్ వ్లాదిమిర్ ఉయ్బా ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం.
Read Also:Rahul gandhi: పరువు నష్టం కేసులో వ్యక్తిగత హాజరుకు కోర్టు ఆదేశం
తాజావార్తలు
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!