Traffic Restrictions in Srisailam and Kurnool District: శ్రీశైలం వెళ్తున్నారా? ఇది మీ కోసమే..
- ఈ నెల 16న ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన..
- శ్రీశైలంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ నిలిపివేత..
- ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలుచోట్ల ట్రాఫిక్ మల్లింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Traffic Restrictions in Srisailam and Kurnool District: శ్రీశైలం వెళ్తున్నారా? అయితే, ఇది మీ కోసమే.. ఎందుకంటే శ్రీశైలంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.. తాత్కాలికంగా పూర్తిగా ట్రాఫిక్ నిలిపివేయనున్నారు.. ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది.. మొదట శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకోనున్నారు ప్రధాని.. అయితే, 16వ తేదీ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు శ్రీశైలంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.. 6న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు శ్రీశైలం రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.. హైదరాబాద్ – శ్రీశైలం, దోర్నాల- శ్రీశైలం మధ్య వాహనాల రాకపోకలు తాత్కాలికంగా బంద్ చేయనున్నారు.. అయితే, శ్రీశైలంలో ప్రధాని మోడీ పర్యటన ముగిసిన అనంతరం వాహన రాకపోకలు యథావిధిగా కొనసాగనున్నాయి..
Read Also: DSP Pooja Pandey: రూ.3 కోట్ల హవాలా డబ్బు దోపిడీ.. మహిళా డీఎస్పీ సహా 11 మంది పోలీసులపై కేసు
Also Read
ఇక, ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో.. కర్నూలు మీదుగా వెళ్లే వాహనాలు దారి మల్లించనున్నారు అధికారులు.. కడప నుండి కర్నూలు, హైదారాబాద్ వెళ్లే వాహనాలు పాణ్యం, గడివేముల, మిడ్తూరు, బ్రాహ్మణ కొట్కూరు, కోల్లబాపురం, పూడూరు, అలంపూర్ బ్రిడ్జి, అలంపూర్ చౌరస్తా మీదుగా మళ్లించనున్నట్టు అధికారులు ప్రకటించారు.. నంద్యాల నుండి బెంగళూరు వైపు వెళ్లే వాహనాలు పాణ్యం, బనగానపల్లె, డోన్ మీదుగా మళ్లించనున్నారు.. శ్రీశైలం నుండి ఆత్మకూరు మీదుగా అనంతపురం వైపు వెళ్లే వాహనాలు బండి ఆత్మకూరు, పాణ్యం, బనగానపల్లె, డోన్ మీదుగా మళ్లించనున్నారు.. ఆత్మకూరు నుండి బళ్ళారి వైపు వెళ్లే వాహనాలు బ్రాహ్మణకొట్కూరు, కోల్లబాపురం, పూడూరు, ఆలంపూర్ బ్రిడ్జి & ఆలంపూర్ చౌరస్తా, శాంతినగర్ మీదుగా మళ్లిస్తారు.. అనంతపురం నుండి కర్నూలు మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు గుత్తి, జొన్నగిరి, తుగ్గలి, పత్తికొండ, ఆస్పరి, ఆదోని, ఎమ్మిగనూరు, నందవరం, నాగలదిన్నె, ఐజ మీదుగా మళ్లిస్తారు..
మరోవైపు.. అనంతపురం నుండి నంద్యాల వైపు వెళ్ళు వాహనాలు.. డోన్ , బనగానపల్లె, నంద్యాల మీదుగా మళ్లించినున్నట్టు అధికారులు వెల్లడించారు.. బళ్ళారి నుండి హైదరాబాదు ఆదోని, ఎమ్మిగనూరు, నందవరం, నాగలదిన్నె, ఐజ మీదుగా మల్లింపు.. నంద్యాల నుండి కర్నూలు వైపు వెళ్ళే వాహనాలు తమ్మరాజుపల్లి, కాల్వబుగ్గ, ఎంబాయి, రామళ్లకోట, వెల్దుర్తి, కర్నూలు మీదుగా మల్లింపు.. ఓర్వకల్లు నుండి హైదరాబాదు వైపు వెళ్ళే వాహనాలు మళ్లించనున్నారు.. అయితే, ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో.. ట్రాఫిక్ మళ్లిస్తున్న నేపథ్యంలో.. ప్రయాణికులు.. వాహనదారులు తమ రూట్ ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు..
తాజావార్తలు
-
Memu COPlam: కోడిపుంజు కోసం పోలీసుల వేట.. నవ్వుల విందుగా నాగబాబు ‘మేము ‘కాప్’లం’ ట్రైలర్!
-
Tech Layoffs 2026: టెక్ రంగంలో కలకలం.. రెండు వారాల్లోనే 25,000 మందికి ఉద్వాసన..
-
Modi-CM Vijay: ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ.. దేనికోసమంటే..!
-
CM Revanth Reddy : నీట్-యూజీ 2026 రద్దు… మోడీ సర్కార్ ఫెయిల్
-
Gaurnaidu: ‘పెద్ది’ నుంచి ఊహించని ఊరమాస్ టీజర్.. ‘గౌర్నాయుడు’గా శివరాజ్కుమార్ విశ్వరూపం!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!