ప్రజలను చనిపోనివ్వండి.. దుమారం రేపుతున్న ప్రధాని వ్యాఖ్యలు
బ్రిటన్ ప్రధాని రిషి సునక్ చేసిన ప్రకటన బ్రిటన్ అంతటా దుమారం రేపింది. కరోనావైరస్ మహమ్మారి సమయంలో ప్రభుత్వం రెండవ లాక్డౌన్ విధించడం కంటే ‘లాక్డౌన్ కంటే కొంతమందిని చనిపోవడానికి అనుమతించడం మంచిది’ అని అన్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. COVID-19 సమయంలో మాజీ ప్రధాని జాన్సన్ అత్యంత సీనియర్ సలహాదారు డొమినిక్ కమ్మింగ్స్ ఈ విషయాన్ని పేర్కొన్నారు. మాజీ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్, పాట్రిక్ వాలెన్స్ చేసిన డైరీ ఎంట్రీ ప్రకారం, కమ్మింగ్స్ జాతీయ లాక్డౌన్ విధించాలా వద్దా అనే దానిపై జరిగిన సమావేశంలో ఈ ప్రకటన చేసినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక తెలిపింది. డొమినిక్ కమిన్స్ను ఉటంకిస్తూ వాలన్స్ ఈ విషయాలు చెప్పారు. కరోనాపై సమావేశంలో జాతీయ లాక్డౌన్ విధించాలా వద్దా అని కమ్మిన్స్ అడిగినప్పుడు, లాక్డౌన్ విధించడం కంటే కొంతమందిని చనిపోవడానికి అనుమతించడం మంచిదని సునక్ అన్నారు.
కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలే.. కానీ తెలంగాణలో..!
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి మహిళకు 60 ఏళ్ల లోపు ఉన్న వారందరికీ 2500 ఆర్థిక సహాయం చేస్తామని అర్బన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ నగరంలోని గాజుల్ పేటలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలే అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 400 సిలిండర్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో 1200 వచ్చిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయంలోనూ 108 ఆదుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ కి 10లక్షలు అమలు చేస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ 5 వందలకు అందిస్తామన్నారు. యూనివర్సిటీలో ఉద్యోగాల కోసం తెలంగాణ కోసం అమరులైతే ఆదుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి మహిళకు 60 ఏళ్ల లోపు ఉన్న వారందరికీ 2500 ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కడ ప్రయాణం చేసిన వారందరికీ ఫ్రీ అని తెలిపారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరారు.
ఓటర్ల జాబితాలో అక్రమాలు..! మరోసారి సీఈసీ వద్దకు టీడీపీ..
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాపై ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష నేతలు.. విపక్ష టీడీపీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి పోటాపోటీగా ఫిర్యాదు కూడా చేసుకున్నారు.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కలిసి కూడా సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు.. కొందరు అధికారులపై వేటు కూడా పడింది.. అయితే, మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు సిద్ధం అయ్యారు తెలుగుదేశం పార్టీ నేతలు.. ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణల నేపథ్యంలో.. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలవబోతోంది టీడీపీ బృందం.. అధికార పార్టీ ఒత్తిడితో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అయ్యారు.
ప్రధాని మోదీ, యూపీ సీఎంను చంపేస్తామంటూ బెదిరింపు కాల్.. వ్యక్తి అరెస్ట్
ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్లను చంపుతానంటూ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ పేరుతో ఆ వ్యక్తి ముంబై పోలీసు కంట్రోల్ రూంకు బెదిరింపు కాల్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సిగ్నల్ ద్వారా అతడిని ట్రేస్ చేసిన అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయం బయట పెట్టాడు. పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లను చంపుతామని బెదిరించమని తనకి దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ చెప్పినట్టు తెలిపాడు. అలాగే ముంబై జేజే హాస్పిటల్ కూడా బాంబు బెదిరింపు కాల్ చేయమని చెప్పినట్టు కూడా వెల్లడించారు. అతడిని అరెస్టు చేసి భారతీయ శిక్షా స్మృతి కింద 505 (2) కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
కేసీఆర్కు బిగ్ షాక్.. తెలంగాణలో డీఎంకే మద్దతు కాంగ్రెస్కే!
తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు బిగ్ షాక్ తగిలింది. నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని.. తెలంగాణలోని డీఎంకే శ్రేణులు, మద్దతుదారులకు ఆ పార్టీ పిలుపునిచ్చింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలందరూ కృషి చేయాలని డీఎంకే ఒక ప్రకటనలో వెల్లడించింది. కాంగ్రెస్ అభ్యర్ధులు భారీ మెజారిటీతో విజయం సాధించేలా పని చేయాలని పార్టీ కోరింది. తమిళనాడులో కాంగ్రెస్కు డీఎంకే మిత్రపక్షం. గత ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని సర్కార్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో డీఎంకే ఉన్న విషయం తెలిసిందే.
ఆషామాషీగా పనిచేయలేదు.. ఒళ్లు దగ్గర పెట్టుకుని చేశాం
ఆషామాషీగా పని చేయలేదు.. ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రభుత్వం పని చేసిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మంలో ఎన్నికల ప్రచారలో భాగంగా.. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మన దేశంలో ఎన్నికలు వచ్చాయంటే అభాండాలు, అబద్ధాలు, హామీలు ఇవ్వడం దేశంలో ఎన్నికల సమయంలో జరుగుతున్నవే అన్నారు. రాయి ఏది రత్నం ఏదో తెలుసుకోవాలని సూచించారు. రిజల్ట్స్ వచ్చిన రోజున దుకాణం క్లోజ్ అవ్వదు.. అదే రోజు ప్రారంభం అవుతుందన్నారు. అభ్యర్థి గెలుపును బట్టే ప్రభుత్వం వుంటుందన్నారు. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం ఓటు అని తెలిపారు. ప్రజల తల రాతను రాష్ట్ర ప్రజల భవితవ్యం నిర్ణయిస్తుందని అన్నారు. ప్రజల కోసమే బీఆర్ఎస్ పుట్టిందన్నారు. తెలంగాణ ఇవ్వడంలో అనేక సార్లు డోకా చేశారని తెలిపారు. మన మీద ప్రేమతో తెలంగాణ ఇవ్వలేదు.. తప్పని సరి పరిస్థితిలో ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ చరిత్ర మోసాల చరిత్ర అని మండిపడ్డారు. 50 ఏళ్లు కాంగ్రెస్ పరిపాలించిందని స్పష్టం చేశారు.
భట్టి గెలిచేది లేదు.. సీఎం అయ్యేది లేదు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
భట్టి గెలిచేది లేదు సీఎం అయ్యేది లేదని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టు లేని బట్టి విక్రమార్క మనకు చేసిందేమిటి? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నియోజకవర్గానికి చుట్టం చూపుతో వస్తారని మండిపడ్డారు. 20 మంది సీఎంలు కాంగ్రెస్ లో వున్నారని వ్యంగాస్త్రం వేశారు. గతంలో కంటే రెండు సీట్లు బీఆర్ఎస్ పెరుగుతుందన్నారు. భట్టి వల్ల మీకు వచ్చేది ఏమి లేదని అన్నారు. భట్టికి ఒక్క ఓటు కూడా పడొద్దని అన్నారు. భట్టి గెలిచేది లేదు సీఎం అయ్యేది లేదు. ఇందిరమ్మ రాజ్యంలో ఎవ్వరికీ ఒరిగేది లేదని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో కరెంట్ లేదని అన్నారు. భట్టి విక్రమార్క మార్పు చేయాలి కదా? బోనకల్లో దళితులు దళిత బందు పెట్టమని అడిగారు అందువల్లనే ప్రకటించానని అన్నారు. మిగిలిన నియోజకవర్గం మొత్తం దళిత బందు ఇస్తానని అన్నారు. కమల్ రాజ్ గెలిస్తే రైతు బందు వుంటుందన్నారు. 80 లక్షల కళ్ల అద్దాలు ప్రజల్లో మేము ఇచ్చినవి వుండేవన్నారు. కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాజ్యంలో రాక్షస కోసం.. బీఆర్ఎస్ రాజ్యంలో మానవీయ కోణం అన్నారు. ఎన్టీవీ ఏర్పాటు చేసిన చర్చలోనే భట్టి క్లారిటీ ఇచ్చారు అని కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ పాత వీఆర్వోల రాజ్యం వస్తుందన్నారు. వసూళ్ల పర్వం ప్రారంభం అవుతుందని తెలిపారు. కాంగ్రెస్ గెలిస్తే వైకుంఠ పాలి ఆట ఆడవాల్సి వస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నేతలు పిచ్చి పిచ్చి వేషాలేయడం మానేయండి..
ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలోని బాణాపురంతో పాటు ముదిగొండ మండలం గంధసిరిలో కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా భట్టి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉచిత కరెంట్ అనేది కాంగ్రెస్ పేటెంట్.. కరెంట్ వెలుగులు తెచ్చిందే కాంగ్రెస్.. కాంగ్రెస్ కరెంట్ తెస్తే.. కాంగ్రెస్ కావాలా..? కరెంట్ కావాలా..? అని కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కావాలి.. కరెంట్ కావాలి.. పేదలకు సంపద పంచుతాం.. ఆరు గ్యారెంటీలతో కూడిన కార్డులను ఇస్తున్నాం.. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీలను.. మేనిఫెస్టోను అమలు చేస్తామని భట్టి విక్రమార్క అన్నారు.
దుబ్బాకలో ఈ సారి రఘునందన్ రావు ఇంటికే
సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ లో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దుబ్బాకలో ఈ సారి రఘునందన్ రావు ఇంటికేనని ఆయన వ్యాఖ్యానించారు. రఘునందన్ రావుని లుచ్చా మాటలు అని ఆయన ఆరోపించారు. నిరుద్యోగికి 3 వేల నిరుద్యోగి భృతి అన్నాడు ఇచ్చాడా అని ఆయన ప్రశ్నించారు. దుబ్బాకకి ఔటర్ రింగ్ రోడ్ అన్నాడు తెచ్చాడా.. ఇంత బఫున్, జోకర్ మాటలు నమ్ముతారా అని మంత్రి కేటీఆర్ అన్నారు. అసైన్డ్ భూములు ఉన్న వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని, దొంగ మాటలు, మాయ చేసి ఓ వెయ్యి ఓట్లతో ఉప ఎన్నికలో గెలిచాడన్నారు మంత్రి కేటీఆర్. దుబ్బాక ఎన్నిక తెలంగాణ తలరాతను మారుస్తుందని, కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటార్లు…పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు అని ఆయన అన్నారు.
కాంగ్రెస్కు ఓటేసి ఆగం కావోద్దు
హుస్నాబాద్ను మూడు ముక్కలు చేశామంటున్నారు.. కానీ, హుస్నాబాద్ మూడు దిక్కుల అభివృద్ధి చెందుతోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్కు మద్దతుగా హరీష్ రావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడ జరిగిన బీఆర్ఎస్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ మేరకు హరీష్ రావు మాట్లాడుతూ.. వంద అబద్ధాలు అడైనా కాంగ్రెస్ అధికారంలోని రావాలని చూస్తోందని, గతి, సుతి లేని కాంగ్రెస్ నున్నమితే అగం అవుతామన్నారు. కర్ణాటకలో కాంగ్రెసొల్లు 5 గ్యారంటీలు అన్నారు, ఇప్పుడు అక్కడ ప్రజలు అగైయిపోయినం అంటున్నారు.. మనం అగం కావద్దు అని పేర్కొన్నారు.
నన్ను గెలిపిస్తే సిరిసిల్లకు పవర్ లూం క్లస్టర్ మంజూరు చేపిస్తా
రాజన్న సిరిసిల్లలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాణి రుద్రమ మాట్లాడుతూ.. నన్ను గెలిపిస్తే సిరిసిల్లకు పవర్ లూం క్లస్టర్ మంజూరి చేపిస్తాను అని హామీ ఇచ్చారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో నన్ను గెలిపించండి అని కోరారు. పద్మశాలలు పొందించిన ఊరు సిరిసిల్లా.. విద్యాసాగర్ రావు టెక్స్ట్ టైల్ పార్క్ తెచ్చారు అని ఆమె పేర్కొన్నారు.
ఆ పేరల్ పార్కా ఇంత వరకు కంప్లీట్ కాలేదు అని సిరిసిల్ల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి చెప్పుకొచ్చారు. నేత కార్మికుల జీవితాలు మారాలేదు.. అనేక మంది అసాములు కార్మికులు ఉండే వారు.. గుప్పుడు మంది చేతుల్లా బతుకమ్మ చీరలు ఉన్నాయన్నారు. సిరిసిల్లలో నన్ను దీవించండి.. నేత కార్మికులకు బీజేపీ పక్షాన పవర్ లూం క్లస్టర్ ఏర్పాటు చేస్తానని నేతన్న సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పవర్ లూం క్లస్టర్ ఏర్పాటు కోసం బాండు పేపర్ ను విడుదల చేశారు. బాండు పేపర్ ను రాణి రుద్రమ రెడ్డి చదివి వినిపించారు.
అంతర్జాతీయ దొంగల ముఠాలకి ఏమాత్రం తీసిపోని పార్టీ టీడీపీ
అంతర్జాతీయ దొంగల ముఠాలకి ఏమాత్రం తీసిపోని పార్టీ టీడీపీ అని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మోసం చేయడంలో కొత్త టెక్నిక్కులతో ఏం చేస్తున్నారో ఈ మధ్యే బయట పడింది అని అన్నారు. పచ్చ దొంగల ముఠా పట్టపగలు ఇళ్ళమీద పడుతోంది అప్రమత్తంగా ఉండాలి.. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ 20 జూన్ 2024 నుంచీ మీ అకౌంట్ లో జమ చేయడం ప్రారంభం అంటూ ఇచ్చారు.. అమలు అనేది అధికారంలోకి వచ్చాక ఉంటుంది అని ఆయన చెప్పుకొచ్చారు. 2014లో అడ్డంగా ఇచ్చిన హామీలు ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా టీడీపీ అడ్డగోలు హామీలు ఇస్తుంది.. ఇలాంటి చర్యలను ఏ విధంగా శిక్షించాలో మరి అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ప్రధాని మోడీ “చెడు శకునం”.. అందుకే భారత్ ఓడిపోయింది..
ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియా-ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచును ప్రస్తావిస్తూ.. తీవ్ర విమర్శలు చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ తరుపున ప్రచారం చేసిన రాహుల్ గాంధీ, పీఎం మోడీని టార్గెట్ చేశారు. భారత్ గెలవకపోవడానికి ప్రధాని మోడీనే కారణమని దుయ్యబట్టారు. జలోర్లో మంగళవారం జరిగిన ర్యాలీలో మాట్లాడిన రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీ ఒక ‘‘చెడు శకునం’’ అని అన్నారు. ప్రధాని మోడీ వెళ్లడం వల్లే ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన 2023 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓడిపోయిందని విమర్శించారు. ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ… ‘‘మన ఆటగాళ్లు దాదాపుగా ప్రపంచకప్ గెలుచుకున్నారు.. కానీ చెడు శకునం వారిని ఓడిపోయేలా చేసింది’’ అంటూ దుయ్యబట్టారు.
సోనియా గాంధీ, ఇందిరా గాంధీని విమర్శిస్తే సహించేది లేదు..
నిన్నటి వరకు కేసీఆర్ సోనియా కాంగ్రెస్ని మాత్రమే తిట్టేవారని, ఇప్పుడు గరీబ్ హటావో అని పేదలను ఆదుకున్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆకలి చావులు అని తిడుతున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు. ఇవాళ ఆయన గాంధీభవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరా గాంధీని విమర్శిస్తే తెలంగాణలో ఏ ఒక్క మహిళా మీకు ఓటేయరన్నారు. మీకు ఓటమి భయం పట్టుకుంది అందుకే ఇందిరా గాంధీ ని విమర్శిస్తున్నావ్ అని వీహెచ్ వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ, ఇందిరా గాంధీ ని విమర్శిస్తే సహించేది లేదని, ఇందిరా గాంధీ ని విమర్శిస్తే మీ పైనా తిరగబడబడాలని తెలంగాణ మహిళలకి విజ్ఞప్తి చేస్తానన్నారు. కేసీ వేణుగోపాల్ ఆదేశాల మేరకు రేపటి నుండీ 15 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నానని ఆయన వెల్లడించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మృత్యంజయం మాట్లాడుతూ.. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.