Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 9am 29 11 2024

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Published Date :November 29, 2024 , 9:16 am
By Gogikar Sai Krishna
  • సంభాల్ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
  • తెలంగాణకు కేంద్రం గుడ్‌ న్యూస్‌.. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్
  • గంటకు 9 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఫెంగల్‌.. ఏపీలోని పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌
  • 13 రోజుల విరామం తర్వాత.. మణిపూర్‌లో నేటి నుంచి స్కూల్స్, కాలేజీలు రీఓపెన్
Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

సంభాల్ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ లో జామా మసీదు దగ్గర సర్వే సమయంలో చెలరేగిన హింస తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో సంభాల్‌లో గల మొఘల్ కాలం నాటి షాహి జామా మసీదును సర్వే చేయాలని జిల్లా కోర్టు నవంబర్ 19న ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సివిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై ఏకపక్షంగా స్టే విధించాలని అందులో కోరారు. కాగా, జామా మసీదు కమిటీ వేసిన పిల్ ను ఈరోజు (నవంబర్ 29) సుప్రీంకోర్టు విచారించనుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.

Also Read

  • Suvendu Adhikari: మమతా బెనర్జీని ఓడించినందుకే నా పీఏను హత్య చేశారు..
  • Tamil Nadu: జంపింగ్ భయం.. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తరలింపు
  • CM Revanth Reddy : సాధారణ ట్రాఫిక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌
  • Love Marraige: ప్రేమంటే ఇదే.. మాజీ ఖైదీని పెళ్లాడిన మహిళా జైలర్..
Add as a preferred
source on google

డిసెంబర్ 15న డబ్ల్యూపీఎల్‌ వేలం.. వేదిక ఎక్కడంటే?

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2025 వేలంకి ముహూర్తం ఖరారైంది. బెంగళూరులో డిసెంబరు 15న మినీ వేలం నిర్వహించనున్నారు. ప్రతి ఫ్రాంచైజీకి రూ.15 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. గత సీజన్‌ రూ.13.5 కోట్లు ఉండగా.. ఈసారి 1.5 కోట్లు పెరిగింది. ఏడుగురు ఆటగాళ్లను విడుదల చేసినందున గుజరాత్ జెయింట్స్ వద్ద అత్యధికంగా రూ.4.4 కోట్లు ఉన్నాయి. ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.3.25 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్‌ వద్ద రూ.2.5 కోట్లు ఉన్నాయి. ఈసారి వేలంలో హీథర్‌ నైట్‌, లీ తహుహు, నాడిన్‌ డి క్లెర్క్‌, స్నేహ్‌ రాణా, డియాండ్ర డాటిన్‌, లారెన్‌ బెల్‌, పూనమ్‌ యాదవ్, వేద కృష్ణమూర్తి ఉన్నారు. వేలానికి ముందు ఫ్రాంచైజీల మధ్య జరిగే బదిలీల గడువు ముగియగా.. ఒక్క బదిలీ మాత్రమే జరిగింది. యూపీ వారియర్స్‌ నుంచి ఒక్క డ్యానీ వ్యాట్‌ (ఇంగ్లండ్‌)ను ఆర్‌సీబీ తీసుకుంది.

కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన మరుసటి రోజే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి

ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత రోజే ఉల్లంఘనకు పాల్పడింది. గురువారం ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దక్షిణ లెబనాన్‌పై దాడికి పాల్పడ్డాయి. రాకెట్‌ నిల్వ కేంద్రంలో హెజ్‌బొల్లా మిలిటెంట్లు క్రియాశీలకంగా ఉండటాన్ని గమనించే తాము దాడి చేసినట్లు టెల్‌ అవీవ్‌ పేర్కొనింది. అమెరికా, ఫ్రాన్స్‌ మధ్యవర్తిత్వంతో మంగళవారం నాడు కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది. కానీ, బుధవారం ఉదయం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అయితే, హెజ్‌బొల్లాయే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇజ్రాయెల్‌ ఆరోపణలు చేసింది.

విమానాశ్రయంలో రూ.2.2 కోట్ల నిషేధిత కలుపు మొక్కల పట్టివేత..

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా నిషేధిత కలుపు మొక్కలను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. హైడ్రోఫోనిక్ కలుపు మొక్కలను అధికారులు సీజ్ చేశారు. పట్టుబడిన కలుపు మొక్కల విలువ సుమారు రూ.2.2 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. బ్యాంకాక్ నుంచి ఓ ప్రయాణికుడు తన ట్రాలీ బ్యాగ్ లో కలుపు మొక్కలను దాచి తరలించే యత్నం చేశాడు.

ఇవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బ్యాంకాక్ నుంచి విమానం ల్యాండ్ అయ్యింది. అయితే బ్యాంకాక్ నుంచి ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా వెళ్లడం గమనించారు కస్టమ్స్ అధికారులు. అతని ట్రాలీ బ్యాగ్ ను తనిఖీ చేయగా షాక్ కు గురయ్యారు. లగేజ్‌బ్యాగ్ లో నిషేధిత కలుపు మొక్కలు దాచి ఉండటం అధికారులు గుర్తించారు. నివాటి స్వాధీనం చేసుకుని ప్రయాణికుడిని అదుపులో తీసుకున్నారు. అతనిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఐసీసీ కోర్టులో బంతి.. నేడు తేలనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ భవితవ్యం!

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025కి పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లో పర్యటించేందుకు భారత్‌ నిరాకరించడంతో.. టోర్నీ షెడ్యూల్‌పై సందిగ్ధత నెలకొంది. హైబ్రిడ్‌ మోడల్‌లో మ్యాచ్‌లు నిర్వహిస్తే తాము ఆడేందుకు సిద్ధమని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే ఇందుకు పీసీబీ ఒప్పుకోవడం లేదు. పాకిస్థాన్‌లోనే పూర్తి టోర్నీ జరగాలని పట్టుపడుతోంది. ఐసీసీ చర్చలు జరిపినా.. పాక్ వెనక్కి తగ్గడం లేదు. హైబ్రిడ్‌ మోడల్‌కు అంగీకరించేది లేదని గురువారం మరోసారి ఐసీసీకి పీసీబీ స్పష్టం చేసింది. ఇందుకు బీసీసీఐ ఒప్పుకునే అవకాశం లేకపోవడంతో.. బంతి ఇప్పుడు ఐసీసీ కోర్టులో ఉంది.

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణ కోసం ప్రస్తుతం ఐసీసీ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. హైబ్రిడ్‌ మోడల్‌లో మెజారిటీ మ్యాచ్‌లను పాక్‌లో నిర్వహించి.. టీమిండియా ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికపై ఆడించాలని ఐసీసీ బావిస్తోంది. ఇందుకు పీసీబీ ఒప్పుకోకుంటే.. ఛాంపియన్స్‌ ట్రోఫీ మొత్తాన్ని పాకిస్థాన్‌ వెలుపల నిర్వహించాలన్నది మరో ప్రత్యామ్నాయం. టోర్నీని పాక్ నుంచి తరలించినా.. ఆతిథ్య హక్కులు మాత్రం పీసీబీ వద్దే ఉంటాయి. భారత్‌ లేకుండా పాక్‌లోనే టోర్నీ నిర్వహించాలన్నది మరో ప్రత్యామ్నాయం. ఐసీసీ ఇప్పుడు ఈ మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది.

13 రోజుల విరామం తర్వాత.. మణిపూర్‌లో నేటి నుంచి స్కూల్స్, కాలేజీలు రీఓపెన్

జాతుల మధ్య వైరంతో తగలబడిపోతున్న మణిపూర్‌లో శాంతి నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆ రాష్ట్రంలో భారీగా సైనికులను మోహరించింది. అయితే, హింసాత్మాక ఘటనలతో ఇంపాల్, జిరిబామ్ జిల్లాల్లో గత 13 రోజులుగా మూతబడిన పాఠశాలలు, కాలేజీల్లో నేటి (నవంబర్ 29) నుంచి రెగ్యులర్ తరగతులు పునఃప్రారంభించబోతున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, ప్రభుత్వ- ఎయిడెడ్ కళాశాలలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఈరోజు నుంచి తిరిగి తెరవబడతాయని ఉన్నత- సాంకేతిక విద్యా శాఖ ఓ ప్రకటన జారీ చేసింది.

తెలంగాణకు కేంద్రం గుడ్‌ న్యూస్‌.. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్

ఉమ్మడి వరంగల్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విభజన హామీల్లో కేంద్ర ప్రభుత్వం మరో హామీని నెరవేర్చింది. కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్‌ఎంయూ) ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాజీపేటలోని వ్యాగన్ ఫ్యాక్టరీని సెంట్రల్ రైల్వే అప్‌గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎంకు గత ఏడాది జులై 5వ తేదీన అప్‌గ్రేడ్‌చేయాలని దక్షిణమధ్య రైల్వే బోర్డు లేఖ రాసింది. కాగా అప్‌ గ్రేడ్ చేసిన యూనిట్‌ లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌లు తయారు చేసేందుకు అనుగుణంగా యూనిట్‌ను అభివృద్ధిం చేయాలని ఈ ఏడాది సెప్టెంబర్‌ 9న రైల్వే బోర్డు ఆదేశాలు ఇచ్చింది. కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌ల తయారీకి సంబంధించిన సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని రైల్వే బోర్డు సూచించింది. విభజన హామీల అమలుపై తెలంగాణ అధికారులు, కేంద్ర అధికారులతో హోంశాఖ నిర్వహించిన సమావేశంలో ఈ విషయం వెల్లడైంది.

గంటకు 9 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఫెంగల్‌.. ఏపీలోని పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో శుక్రవారం (నవంబర్ 29) అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తా ఏపీలో శుక్రవారం అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ తెలిపింది. అంతేకాకుండా, గురువారం రాత్రి , శుక్రవారం ఉదయం మధ్య నైరుతి బంగాళాఖాతంలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే గాలులు గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో తుఫానుగా మారే అవకాశం ఉంది. రెడ్ అలర్ట్ సూచన ప్రకారం తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో శుక్రవారం ఒంటరిగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD-అమరావతి శాస్త్రవేత్త ఎస్ కరుణసాగర్ తెలిపారు. చిత్తూరు, అన్నమ్మయ్య జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసినందున అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, శుక్రవారం పసుపు అలర్ట్‌ ప్రకటించిన ప్రకాశం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Fengal Cyclone
  • ICC CHAMPIONS TROPHY
  • telugu news
  • Top Headlines @9AM
  • Top News

తాజావార్తలు

  • Suvendu Adhikari: మమతా బెనర్జీని ఓడించినందుకే నా పీఏను హత్య చేశారు..

  • Tamil Nadu: జంపింగ్ భయం.. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తరలింపు

  • CM Revanth Reddy : సాధారణ ట్రాఫిక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌

  • Love Marraige: ప్రేమంటే ఇదే.. మాజీ ఖైదీని పెళ్లాడిన మహిళా జైలర్..

  • Tamil Nadu: లెఫ్ట్ పార్టీల మద్దతు కోరిన విజయ్.. రేపు చెబుతామన్న వామపక్షాలు

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions