Today Stock Market Roundup 18-04-23: వరుసగా రెండో రోజూ నేలచూపులు
Today Stock Market Roundup 18-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారంలో వరుసగా రెండో రోజు కూడా నష్టాలతోనే ముగిసింది. ఇవాళ మంగళవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన రెండు కీలక సూచీలు కొద్దిసేపటికే నష్టాల బాట పట్టాయి. ఐటీ మరియు పవర్ కంపెనీల షేర్లు నేల చూపులు చూడటంతో సెన్సెక్స్, నిఫ్టీ ఒత్తిడికి గురయ్యాయి.
అయితే.. ఫార్మా మరియు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మాత్రం స్థిరంగా లాభాలను ఆర్జించటం కాస్త ఉపశమనం కలిగించింది.
సెన్సెక్స్ 252 పాయింట్లు కోల్పోయి 59 వేల 658 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్లు తగ్గి 17 వేల 660 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
Also Read
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
read more: Apple First Retail Store in India: ఏడేళ్ల యాపిల్ కల.. నెరవేరిన వేళ..
సెన్సెక్స్లోని మొత్తం 30 కంపెనీల్లో సగం కంపెనీలు లాభపడగా, సగం కంపెనీలు నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ రియాల్టీ మరియు పీఎస్యూ బ్యాంక్ సూచీలు సున్నా పాయింట్ 5 శాతం చొప్పున పెరిగాయి. మరో వైపు.. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ సున్నా పాయింట్ 4 శాతం పడిపోయింది.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో మిడ్క్యాప్ మరియు స్మాల్క్యాప్ ఇండెక్స్లు సున్నా పాయింట్ 6 శాతం వరకు రాణించాయి.
వ్యక్తిగత షేర్లను పరిశీలిస్తే.. పవర్గ్రిడ్, రిలయెన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, టెక్ మహింద్రా, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, విప్రో, ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా నష్టపోయాయి.
ఇవాళ కొత్తగా అవలాన్ టెక్నాలజీస్ అనే సంస్థ ఎన్ఎస్ఈలో లిస్టింగ్ అయింది. ఇష్యూ ప్రైస్ 436 రూపాయలు కాగా ఒకటీ పాయింట్ ఒకటీ ఐదు శాతం డిస్కౌంట్తో 431 రూపాయల వద్ద నమోదైంది. 10 గ్రాముల బంగారం ధర 134 రూపాయలు పెరిగింది. దీంతో గరిష్టంగా 60 వేల 314 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు నామమాత్రంగా 23 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 74 వేల 835 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర స్వల్పంగా పాతిక రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 607 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ నిన్నటి కన్నా ఇవాళ 7 పైసలు కోల్పోయింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 4 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0” ప్రారంభం.!
-
IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
-
Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్డేట్… ‘పెద్ది’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్కు పండగే!
-
Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!