KTR: విచారణలో ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాం.. కాంగ్రెస్ ను బొంద పెట్టేదాకా నిద్రపోం
- నేడు కేటీఆర్ సిట్ ముందుకు
- కేటీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నిన్న నోటీసులు జారీ
- పదిసార్లు పిలిచినా హాజరవుతా.. అటెన్షన్ డైవర్షన్ కోసమే ఈ కుట్రలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నిన్న నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేడు కేటీఆర్ సిట్ ముందు మరికాసేపట్లో విచారణకు హాజరుకానున్నారు. సిట్ కార్యాలయానికి వెళ్ళేముందు తెలంగాణ భవన్ లోపల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయిన కేటీఆర్, హరీష్ రావు లు.. ఆతర్వాత కేటీఆర్ మీడియా తో మాట్లాడారు. ఈ కేసులో ఏమీ లేదు. మాకు ఏం సంబంధం లేదని కేటీఆర్ తెలిపారు. పదిసార్లు పిలిచినా హాజరవుతా.. అటెన్షన్ డైవర్షన్ కోసమే ఈ కుట్రలు అని మండిపడ్డారు.
Also Read:Subhas Chandra Bose Jayanti: “జై హింద్”.. నేతాజీ గురించి ఆసక్తికర విషయాలు..
Also Read
రేవంత్.. తన మంత్రులతో సహా మా అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు అని కేటీఆర్ ఆరోపించారు. రూ.50 లక్షలతో నోటుకు ఓటులో దొరికిన ఒక దొంగ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే.. ఈ రాజకీయ కక్ష సాధింపులు అని అన్నారు. 6 గ్యారెంటీల మోసం, 420 హామీల దగా, సింగరేణి బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ కుతంత్రాలు అని ఫైర్ అయ్యారు. నాలుగు కోట్ల ప్రజలను నయవంచన చేసిన ముఖ్యమంత్రిని వదిలిపెట్టం.. కాంగ్రెస్ ను బొంద పెట్టేదాకా నిద్రపోం అని కేటీఆర్ తెలిపారు. విచారణలో ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతామని వెల్లడించారు.
ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడుతోంది.. కెసిఆర్ సైనికులు గా ఉద్యమం నుంచి ఉద్భవించిన నాయకత్వం బీఆర్ఎస్ ది అని అన్నారు. కెసిఆర్ నాయకత్వంలో పదేళ్లు అధికారంలో ఉన్నాము
మేము ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు.. మేము టైం పాస్ రాజకీయాలు చేయలేదు.. ప్రతిపక్షాలను వేధించ లేదన్నారు. విచారణ లకు భయపడే వారు ఎవరూ లేరని తెలిపారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయి లాగా మారిందని ఎద్దేవ చేశారు. రోజుకో అంశం తో డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. పుట్టిన భూమి సాక్షిగా అక్రమ, అనైతిక పనులు నేను చేయలేదు. నేను డ్రగ్స్ తీసుకుంటానని.. నాకు హీరోయిన్ లతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేశారన్నారు.
మా కుటుంబాలను ఇబ్బంది పెట్టారు.. అయినా నేను ఎప్పుడూ భయపడలేదు.. హీరోయిన్ ల ఫోన్ లు ట్యాప్ అయ్యాయని మీరే లీకులు ఇచ్చారు.. మళ్ళీ ఏమి లేదని మీరే అన్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఫోన్ లు ట్యాప్ అవ్వడం లేదని పోలీసులు చెబుతారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషయంపై డీజీపీ శివదర్ రెడ్డి మీడియా ముందు చెబుతారా అని ప్రశ్నించారు. బొగ్గు స్కాం ను హరీష్ రావు బయట పెట్టారు.. మంత్రులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదు.. హరీష్ రావు కు నోటీసులు ఇచ్చి పిలిస్తే.. వాళ్లకు ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్పాడని తెలిపారు. రాష్ట్రంలో దోపిడి దొంగల ముఠా ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో కొందరు పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?