KTR: ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగిందో వాస్తవాలు చెప్పడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ధారావాహిక సీరియల్ మాదిరి ఫోన్ ట్యాపింగ్ కేసు నడిపిస్తున్నారు.. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నిన్నటి విచారణలో కేసీఆర్ చెప్పారు.. హరీష్ రావుకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నిన్న నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేడు కేటీఆర్ సిట్ ముందు మరికాసేపట్లో విచారణకు హాజరుకానున్నారు. సిట్ కార్యాలయానికి వెళ్ళేముందు తెలంగాణ భవన్ లోపల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయిన కేటీఆర్, హరీష్ రావు లు.. ఆతర్వాత కేటీఆర్ మీడియా తో మాట్లాడారు. ఈ కేసులో ఏమీ లేదు. మాకు ఏం సంబంధం లేదని కేటీఆర్ తెలిపారు. పదిసార్లు పిలిచినా హాజరవుతా..…
SIT Issues Notice to KTR: తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కి నోటీసులు ఇచ్చింది సిట్. రేపు విచారణకి రావాలని ఆదేశించింది. ఉదయం 11 గంటలకు విచారణకి రావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ఇవాళ్టితో ముగియనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండు వారాల పాటు ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బృందం విచారిస్తోంది. డిసెంబర్ 26వ తేదీన ప్రభాకర్ రావును విడిచి పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండో వారం విచారణలో ప్రభాకర్ రావు నుంచి సిట్ బృందం కీలక సమాచారం రాబట్టింది. మొదట విచారణకు సహకరించని ప్రభాకర్ రావు.. పూర్తి ఆధారాలు ముందు ఉంచడంతో…