భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ప్రయోగంతో చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ను విజయవంతం చేసేందుకు శ్రీకారం చుట్టింది. చంద్రయాన్ 3 చివరి కక్ష్య తగ్గింపు ప్రక్రియను బుధవారం విజయవంతంగా పూర్తి చేసినట్టు ఇస్రో వెల్లడించింది. ప్రస్తుతం 153x 163 కి.మీ కక్ష్యలో స్పేస్క్రాఫ్ట్ తిరుగుతున్నది. అయితే నేడు ప్రయోగంలో ఎంతో కీలకమైన విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ విడిపోయే ప్రక్రియను చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ వేరుకానున్నది. ల్యాండర్ మాడ్యూల్లో భాగమైన ల్యాండర్, రోవర్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి వేరుకానున్నాయి. ఈ మేరకు బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ మిషన్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి GSLV మార్క్ 3 (LVM 3) భారీ-లిఫ్ట్ లాంచ్ వెహికల్ ద్వారా జూలై 14న ప్రభావవంతంగా ప్రారంభించబడింది. ఇది ఆగస్ట్ 23న చంద్రుని వెలుపలి భాగాన్ని తాకేందుకు సిద్ధంగా ఉంది. చంద్రునికి సంబంధించిన అన్ని విన్యాసాలు పూర్తి చేసిన తర్వాత, వ్యోమనౌక ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ను ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి వేరు చేయడానికి సిద్ధం చేస్తుంది.
Also Read : Rishabh Pant Six: మొదటిసారి బ్యాట్ పట్టిన రిషబ్ పంత్.. సిక్సుల వర్షమే! వీడియో వైరల్
ల్యాండర్ మాడ్యూల్ వేరు అయిన అనంతరం అతి కీలకమైన పరిణామం చోటుచేసుకోనున్నది. స్పేస్క్రాఫ్ట్ వేగాన్ని తగ్గించే ప్రక్రియను ఇస్రో చేపట్టనున్నది. అనంతరం స్పేస్క్రాఫ్ట్ను చంద్రుడికి అతి దగ్గరి ప్రదేశమైన పెరిలూన్ (చంద్రుడి ఉపరితలం నుంచి 30 కి.మీ దూరం), అపోలూన్ (చంద్రుడి ఉపరితలం నుంచి 100 కి.మీ దూరం) కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అనంతరం అడ్డంగా ఉన్న స్పేస్క్రాఫ్ట్ను నిలువుగా మార్చే ప్రక్రియను చేపడతారు.
Also Read : Nidhi Agerwal: అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈరోజు అది చూసే వాళ్లం