Today (21-02-23) Stock Market Roundup: రికార్డు స్థాయికి జెన్ టెక్నాలజీస్ షేర్లు
Today (21-02-23) Stock Market Roundup: ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో ఇవాళ మంగవాళం ఎక్కువ శాతం ట్రేడిండ్ ఊగిసలాట ధోరణిలో నడిచింది. రెండు కీలక సూచీలు లాభనష్టాల మధ్య దోబూచులాడాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్.. సాయంత్రం స్వల్ప నష్టాలతో ముగిసింది. నిఫ్టీ 18 వేల బెంచ్ మార్క్కి దిగువన క్లోజ్ అయింది. ఇంట్రాడేలో టాటా స్టీల్ మరియు రిలయెన్స్ ఇండస్ట్రీస్ షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపటంతో సెన్సెక్స్, నిఫ్టీ కాస్త కోలుకున్నాయి.
చివరికి.. సెన్సెక్స్.. 18 పాయింట్లు కోల్పోయి 60 వేల 672 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. నిఫ్టీ.. 17 పాయింట్లు తగ్గి 17 వేల 826 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్లో శిల్పా మెడికేర్, జెన్సర్, అదానీ పవర్ తదితర సంస్థల షేర్లు బాగా రాణించాయి. BoI, టీటీఎంఎల్, అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ తీవ్రంగా నష్టపోయాయి.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
read more: India found deposit of lithium: బ్యాటరీలు, ఈవీ మార్కెట్లో ఇక మనదే హవా
రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్లు సున్నా పాయింట్ 7 శాతం వరకు పెరిగాయి. మరో వైపు.. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఐటీ సూచీలు నేలచూపులు చూశాయి. వ్యక్తిగత షేర్లను పరిశీలిస్తే.. డెలివరీ సంస్థ స్టాక్స్ విలువ గత ఏడు ట్రేడింగ్ సెషన్లలోనూ పెరుగుతూ వస్తోంది. క్యూ3 ఫలితాలు కలిసొచ్చాయి.
ఇదిలాఉండగా.. యుఫ్లెక్స్ ఇండియా షేర్ల విలువ 4 పాయింట్ 4 శాతం తగ్గింది. తద్వారా 52 వారాల కనిష్టానికి.. అంటే.. 466 రూపాయలకి పతనమైంది. జెన్ టెక్నాలజీస్ సంస్థ.. రికార్డు స్థాయి పనితీరు కనబరిచింది. ఈ కంపెనీ షేర్లు ఒక్క నెలలోనే 35 శాతం పెరిగాయి. క్యూ3 ఫలితాలు ఆశాజనకంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. 10 గ్రాముల బంగారం ధర 86 రూపాయలు తగ్గింది.
గరిష్టంగా 56 వేల 127 రూపాయలు పలికింది. కేజీ వెండి రేటు 150 రూపాయలు నష్టపోయింది. అత్యధికంగా 65 వేల 599 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. క్రూడాయిల్ ధర 56 రూపాయలు కోల్పోయింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 374 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 7 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 81 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!