Today (19-01-23) Stock Market Roundup: ప్రపంచం బాధ.. ఇండియా మీద..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today (19-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లో వరుసగా రెండు రోజులు వచ్చిన లాభాలకు బ్రేక్ పడింది. ఇవాళ గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు కూడా సాయంత్రం నష్టాలతోనే ముగిశాయి. మార్నింగ్ సెషన్లో వచ్చి భారీ నష్టాలను మాత్రం ఇంట్రాడేలో కొంత వరకు పూడ్చుకోగలిగాయి.
read more: Gold Imports: డిసెంబర్లో 79 శాతం తగ్గిన బంగారం దిగుమతి
Also Read
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
కానీ.. అంతర్జాతీయంగా పెట్టుబడిదారుల్లో నెలకొన్న ముందుజాగ్రత్తల ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన ప్రతికూలంగా పడింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేజ్ మరియు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్లు నేల చూపులు చూశాయి. సెన్సెక్స్ చివరికి 187 పాయింట్లు కోల్పోయి 60 వేల 858 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ స్వల్పంగా 57 పాయింట్లు తగ్గి 18 వేల 107 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
సెన్సెక్స్లోని మొత్తం 30 స్టాక్స్లో 10 స్టాక్స్ లాభాలను ఆర్జించాయి. ఏసియన్ పెయింట్స్ షేర్ల విలువ తీవ్రంగా దెబ్బతింది. ఈ కంపెనీ తాజా త్రైమాసిక ఫలితాలు ముందస్తు అంచనాలకు తగ్గట్లు లేకపోవటంతో స్టాక్స్ వ్యాల్యూ 3 శాతానికి పైగా నష్టపోయింది. నిఫ్టీలో కోలిండియా, యూపీఎల్ బాగా రాణించాయి. వ్యక్తిగత షేర్లను పరిశీలిస్తే.. ఓఎన్జీసీ స్టాక్స్ 2 శాతం ప్రాఫిట్స్ పొందాయి.
తద్వారా 6 నెలల గరిష్ట విలువకు చేరుకున్నాయి. సంస్థ లాభాల్లో భారీ వృద్ధి నెలకొంటుందనే పాజిటివ్ సెంటిమెంట్ కలిసొచ్చింది. రంగాల వారీగా చూస్తే.. అన్ని సెక్టార్ల ఇండెక్స్లు సైతం లాభాల్లో కోతలకు గురయ్యాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ సున్నా పాయింట్ 6 శాతం పడిపోయింది. నిఫ్టీ ఐటీ సూచీదీ ఇదే పరిస్థితి. 10 గ్రాముల బంగారం ధర 92 రూపాయలు పెరిగి అత్యధికంగా 56 వేల 378 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు 266 రూపాయలు నష్టపోయి గరిష్టంగా 67 వేల 961 రూపాయలుగా నమోదైంది. క్రూడాయిల్ ధర 107 రూపాయలు తగ్గి ఒక బ్యారెల్ చమురు 6 వేల 403 రూపాయలు పలికింది. రూపాయి వ్యాల్యూ 5 పైసలు పెరిగింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 81 రూపాయల 36 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!