Today (17-02-23) Stock Market Roundup: బ్యాంకులు, రియాల్టీ షేర్లు డీలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today (17-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాంతం రోజున ఇవాళ శుక్రవారం ఎక్కువ శాతం నెగెటివ్ ట్రెండ్లోనే నడిచింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు సాయంత్రం భారీ నష్టాలతో ముగిశాయి. వడ్డీ రేట్లు పెరుగుతాయనే ఆందోళనల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ని దెబ్బతీశాయి. బ్యాంకింగ్ మరియు రియాల్టీ రంగాలు అమ్మకాల ఒత్తిణ్ని ఎదుర్కొన్నాయి.
చివరికి.. సెన్సెక్స్.. 316 పాయింట్లు తగ్గి 61 వేల 2 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 91 పాయింట్లు కోల్పోయి 17 వేల 944 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. బీఎస్ఈలోని మొత్తం 30 కంపెనీల్లో 23 కంపెనీలు తక్కువ వ్యాల్యూ వద్దే సెటిలయ్యాయి. సెన్సెక్స్లో టీసీఎన్ఎస్ క్లాతింగ్, శిల్పా మెడికేర్, టిమ్కెన్ ఇండియా, స్కేఫ్లర్ ఇండియా మరియు అదానీ పవర్ బాగా రాణించాయి.
Also Read
- Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
- Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
- 16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
- YS Jagan: వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
100 Airports: వచ్చే ఏడాది నాటికి అభివృద్ధిపరచనున్న కేంద్రం
అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్, వొడాఫోన్ ఐడియా షేర్ల విలువలు నేల చూపులు చూశాయి. నిఫ్టీలో మీడియా సూచీ స్వల్ప లాభాలు ఆర్జించింది. మిగతా సెక్టార్లన్నీ నష్టాల బాటలోనే కొనసాగాయి. ఐటీ, ఫర్మా, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ఇండెక్స్లు అధికంగా సున్నా పాయింట్ ఏడు శాతం వరకు దెబ్బతిన్నాయి.
వ్యక్తిగత స్టాక్స్ను పరిశీలిస్తే.. ఆర్పీపీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ స్టాక్స్ వ్యాల్యూ 9 శాతానికి పైగా పెరిగింది. ఈ సంస్థకు దాదాపు 60 కోట్ల రూపాయల ఆర్డర్ రావటం కలిసొచ్చింది. LPCA ల్యాబొరేటరీస్ షేర్ల విలువ 5 శాతం పడిపోయింది. తద్వారా 52 వారాల కరిష్ట విలువ అయిన 818 రూపాయల 25 పైసలకు పతనమైంది. 10 గ్రాముల బంగారం ధర 368 రూపాయి తగ్గింది.
గరిష్టంగా 55 వేల 860 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు ఏకంగా వెయ్యీ 48 రూపాయలు నష్టపోయింది. అత్యధికంగా 64 వేల 480 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర 91 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 409 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 11 పైసలు కోల్పోయింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 80 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
OTT : డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్బస్టర్!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
Mahakali Release Date: ‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ ఫీమేల్ సూపర్ హీరో మూవీ!
-
Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
-
Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్లో కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!