Today (17-02-23) Stock Market Roundup: బ్యాంకులు, రియాల్టీ షేర్లు డీలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today (17-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాంతం రోజున ఇవాళ శుక్రవారం ఎక్కువ శాతం నెగెటివ్ ట్రెండ్లోనే నడిచింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు సాయంత్రం భారీ నష్టాలతో ముగిశాయి. వడ్డీ రేట్లు పెరుగుతాయనే ఆందోళనల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ని దెబ్బతీశాయి. బ్యాంకింగ్ మరియు రియాల్టీ రంగాలు అమ్మకాల ఒత్తిణ్ని ఎదుర్కొన్నాయి.
చివరికి.. సెన్సెక్స్.. 316 పాయింట్లు తగ్గి 61 వేల 2 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 91 పాయింట్లు కోల్పోయి 17 వేల 944 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. బీఎస్ఈలోని మొత్తం 30 కంపెనీల్లో 23 కంపెనీలు తక్కువ వ్యాల్యూ వద్దే సెటిలయ్యాయి. సెన్సెక్స్లో టీసీఎన్ఎస్ క్లాతింగ్, శిల్పా మెడికేర్, టిమ్కెన్ ఇండియా, స్కేఫ్లర్ ఇండియా మరియు అదానీ పవర్ బాగా రాణించాయి.
Also Read
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్పింగ్ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
- Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
100 Airports: వచ్చే ఏడాది నాటికి అభివృద్ధిపరచనున్న కేంద్రం
అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్, వొడాఫోన్ ఐడియా షేర్ల విలువలు నేల చూపులు చూశాయి. నిఫ్టీలో మీడియా సూచీ స్వల్ప లాభాలు ఆర్జించింది. మిగతా సెక్టార్లన్నీ నష్టాల బాటలోనే కొనసాగాయి. ఐటీ, ఫర్మా, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ఇండెక్స్లు అధికంగా సున్నా పాయింట్ ఏడు శాతం వరకు దెబ్బతిన్నాయి.
వ్యక్తిగత స్టాక్స్ను పరిశీలిస్తే.. ఆర్పీపీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ స్టాక్స్ వ్యాల్యూ 9 శాతానికి పైగా పెరిగింది. ఈ సంస్థకు దాదాపు 60 కోట్ల రూపాయల ఆర్డర్ రావటం కలిసొచ్చింది. LPCA ల్యాబొరేటరీస్ షేర్ల విలువ 5 శాతం పడిపోయింది. తద్వారా 52 వారాల కరిష్ట విలువ అయిన 818 రూపాయల 25 పైసలకు పతనమైంది. 10 గ్రాముల బంగారం ధర 368 రూపాయి తగ్గింది.
గరిష్టంగా 55 వేల 860 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు ఏకంగా వెయ్యీ 48 రూపాయలు నష్టపోయింది. అత్యధికంగా 64 వేల 480 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర 91 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 409 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 11 పైసలు కోల్పోయింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 80 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!