Today (06-02-23) Stock Market Roundup: బెదిరే ఆరంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today (06-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్కి ఈవారం శుభారంభం లభించలేదు. రెండు కీలక సూచీలు కూడా ఇవాళ సోమవారం నష్టాలతోనే ప్రారంభమై నష్టాలతోనే ముగిశాయి. ఐటీ షేర్లలో వచ్చిన లాభాలను ఇన్వెస్టర్లు సొమ్ము చేసుకోవటంతో ఇంట్రాడేలో ఇండెక్స్లు నెగెటివ్ జోన్లో కదలాడాయి. అయితే.. BROADER మార్కెట్లు మాత్రం మంచి పనితీరు కనబరిచాయి. ఆద్యంతం లాభాల్లోనే కొనసాగాయి.
నిఫ్టీ మిడ్క్యాప్ హండ్రెడ్, స్మాల్క్యాప్ హండ్రెడ్ సున్నా పాయింట్ 7 శాతం వరకు పెరిగాయి. చివరికి.. సెన్సెక్స్ 335 పాయింట్లు కోల్పోయి 60 వేల 506 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ.. 89 పాయింట్లు తగ్గి 17 వేల 764 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్లో.. పీ అండ్ జీ హెల్త్ కేర్, రోసారి బయోటెక్, వొడాఫోన్ ఐడియా బాగా వెనకబడ్డాయి. రంగాల వారీగా చూసుకుంటే.. నిఫ్టీలో మీడియా, ఫార్మా సూచీలు సున్నా పాయింట్ 6 శాతం వరకు లాభపడ్డాయి.
Also Read
- RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
read more: Cinema Theatres: ప్రతి ముగ్గురిలో ఒకరి చూపు థియేటర్ వైపు
నిఫ్టీలో మెటల్ ఇండెక్స్ ఘోరంగా దెబ్బతింది. రెండు శాతానికి పైగా పతనమైంది. వ్యక్తిగత స్టాక్స్ను పరిశీలిస్తే.. ఐటీసీ షేర్లు రెండు శాతం లాభాలను ఆర్జించాయి. తద్వారా ఒక్కో స్టాక్ వ్యాల్యూ సరికొత్త విలువకు.. అంటే.. 388 రూపాయలకు పైగా నమోదు కావటం విశేషం. మహింద్రా అండ్ మహింద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 10 శాతం ర్యాలీ తీశాయి. ఫలితంగా రెండేళ్ల గరిష్ట విలువ అయిన 267 రూపాయలకు పైగా చేరుకున్నాయి. 10 గ్రాముల బంగారం ధర 401 రూపాయలు పెరిగింది.
అత్యధికంగా 56 వేల 986 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు 189 రూపాయలు పెరిగి గరిష్టంగా 67 వేల 765 రూపాయలుగా నమోదైంది. క్రూడాయిల్ ధరలో పెద్దగా మార్పులేదు. అత్యంత స్వల్పంగా 9 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 88 రూపాయలు పలికింది. రూపాయి వ్యాల్యూ 81 పైసలు పడిపోయింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 75 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!