Cinema Theatres: ప్రతి ముగ్గురిలో ఒకరి చూపు థియేటర్ వైపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cinema Theatres: సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్లే వాళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ మేరకు గత ఏడాది కాలంలో 150 శాతం వృద్ధి నెలకొందని లోకల్ సర్కిల్స్ అనే సంస్థ చేసిన సర్వేలో తేలింది. వచ్చే 2 నెలల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు మూవీ కోసం సినిమా హాల్కు లేదా మల్టీప్లెక్స్కు వెళ్లటానికి ప్లాన్ చేస్తున్నారు. గడచిన 2 నెలల్లో.. అంటే.. 2022 నవంబర్, డిసెంబర్లలో.. 26 శాతం మంది సినిమా హాల్కి లేదా మల్టీప్లెక్స్కి వెళ్లినట్లు తెలిపారు.
read more: Blockbuster Vs Netflix: ఓటమి అంచుల నుంచి.. విజయ తీరాలకు. తెలుసుకోవాల్సిన ‘బ్లాక్బస్టర్’ స్టోరీ
Also Read
- Upendra Dwivedi: పాక్కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
సర్వేలో పాల్గొన్నవారిలో 17 శాతం మంది.. పిక్చర్ చూసేందుకు సినిమా హాల్కి లేదా మల్టీప్లెక్స్కి వెళ్లే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. లోకల్ సర్కిల్స్ సంస్థ 2020వ సంవత్సరం అక్టోబర్ నెల నుంచి.. ‘‘సిటిజన్ పల్స్ ఆన్ సినిమా హాల్స్’’ అనే పేరుతో ప్రజల అభిప్రాయాలను సేకరిస్తోంది. కనీసం ఒక్కసారి లేదా అంతకన్నా ఎక్కువ సార్లు థియేటర్కి వెళ్లాలని భావించేవారి సంఖ్య 2021 డిసెంబర్ నుంచి క్రమంగా పెరుగుతున్నట్లు లోకల్ సర్కిల్స్ గుర్తించింది.
ఒకటికన్నా ఎక్కువ సార్లు థియేటర్కి వెళ్లాలని అనుకున్నవారి సంఖ్య 2021 డిసెంబర్లో 2 శాతంగా మాత్రమే నమోదు కాగా అదిప్పుడు 6 శాతానికి పెరిగింది. ఒక్కసారి మాత్రమే థియేటర్కి వెళ్లాలనుకున్నవారి సంఖ్య 2021 డిసెంబర్లో 12 శాతం కాగా 2023 జనవరిలో ఏకంగా 28 శాతానికి చేరింది. సినిమా అంటే OTT ప్లాట్ఫామే అని అనుకుంటున్న తరుణంలో మూవీ కోసం థియేటర్లకు వెళ్లాలని భావిస్తున్నవారి సంఖ్య ఈ స్థాయిలో పెరగటం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి శుభసూచకమని లోకల్ సర్కిల్స్ పేర్కొంది.
తాజావార్తలు
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!