Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. తిరుపతి అందాలను తిలకించేందుకు హెలికాప్టర్ రైడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Update: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. నేడు (శనివారం) క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక శుక్రవారం తిరుమల శ్రీవారిని 74,502 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.73 కోట్ల రూపాయలు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. స్వామివారికి 38,052 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Read Also: Andhrapradesh: నేడు శ్రీకాళహస్తిలో బీజేపీ భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న నడ్డా
Also Read
- Telangana Ration: రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా..? వారికి భారీ హెచ్చరిక..
- Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
- WTC Points Table: ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు.. మారిన పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే?
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
ఇదిలా ఉండగా.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు తిరుపతి చుట్టుపక్కల అందాలను తిలకించేందుకు అద్భుత అవకాశం అందుబాటులోకి వచ్చింది. తిరుపతి, చంద్రగిరి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను విహంగ వీక్షణం చేసేందుకు ‘ఏరో డాన్’ అనే సంస్థ జాయ్ రైడ్ని తీసుకొచ్చింది. ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు నాలుగు రోజులు ట్రయల్ నిర్వహించనున్నారు. దీనికోసం టికెట్ బుకింగ్స్ కూడా శనివారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆరు సీట్ల కెపాసిటీ ఉన్న హెలికాప్టర్లో పైలట్ కాకుండా ఐదుగురు పర్యాటకులు ఎక్కే అవకాశముంది. తిరుపతి నుంచి చంద్రగిరి పోర్టు వరకు వెళ్లి తిరిగి తీసుకొస్తారు. ఈ రైడ్ కేవలం 8 నిమిషాల్లోనే పూర్తవుతుంది. గంటలకు ఆరు రైడ్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.6వేలు ఛార్జ్ చేస్తారు. శ్రీవారి దర్శనార్థం తిరుపతికి నిత్యం వేలాది మంది వస్తుంటారని.. వారందరికీ తిరుపతి చుట్టుపక్కల అందాలు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ రైడ్ ప్రారంభిస్తున్నట్లు ఏరో డాన్ ప్రతినిధులు తెలిపారు. శ్రీవారి భక్తులతో పాటు తిరుపతి వాసులు సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ రైడ్ సక్సెస్ అయితే తిరుపతి టు చెన్నై మార్గంలో కూడా ప్రవేశపెట్టే ఆలోచన ఉందని ఏరో డాన్ యాజమాన్యం స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Telangana Ration: రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా..? వారికి భారీ హెచ్చరిక..
-
Vivo T5 5G: భారత్ లో త్వరలో విడుదల కానున్న వివో టి5 5జి.. 3డి కర్వ్డ్ డిస్ప్లే, ఏఐ ఫీచర్స్
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
Brahmastra 2: ‘రామాయణం’ తర్వాత రణబీర్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?.. ద్విపాత్రాభినయంతో సిద్ధమవుతున్నాడా?
-
Myanmar Airstrike: బౌద్ధ మఠంపై మయన్మార్ సైన్యం వైమానిక దాడి.. 14 మంది మృతి
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!