Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
- వసతి గదులు కేటాయింపునకి టీటీడీ రిజిస్ట్రేషన్ పద్దతి..
- ఉ. 6 గంటల నుంచి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్..
- ఆధార్ కార్డు ఆధారంగా వసతి గదుల కేటాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీవారి భక్తులే వారి టార్గెట్…భక్తులు ఆదమరిస్తే చాలు… వారి వస్తువులు మాయం.. ఏమారితే ఇక అంతే సంగతులు..వారి నుంచి అధిక మొత్తాన్ని వసూలు చేస్తారు. ఇలా శ్రీవారి భక్తులను మోసం చేస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా దోరకని దొంగల సంఖ్య ఎక్కువే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తూంటారు. స్వామివారి దర్శనం కోసం తిరుమలకు విచ్చేసిన భక్తులకు వసతి గదులు మొదలుకోని దర్శనం పూర్తి అయ్యే వరకు అన్నింటికీ వేచివుండాల్సిందే..ఇదే అదనుగా భక్తులను మోసం చేయడం సులువుగా మార్చేసుకున్నారు అక్రమార్కులు. శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు అప్రమత్తంగా లేకపోతే..వారి వస్తువులు చోరీకి పాల్పడడమో…లేక వారిని మోసం చేసి వారి నగదు కాజేయడం కూడా పరిపాటిగా మారిపోతోంది. ఇలాంటి సంఘటనలు తిరుమలలో కొత్త కాకపోయినా..టీటీడీ ఎప్పటికప్పుడు భక్తులను అప్రమత్తం చేస్తున్నా.. దొంగలు కొత్త ఎత్తులు వేస్తూ.. సరికొత్తగా భక్తులను మోసం చేస్తున్నారు.
సామాన్య భక్తులకు సులుభతరంగా వసతి గదులు కేటాయించడానికి టీటీడీ రిజిస్ట్రేషన్ పద్దతిని ప్రారంభించింది. ఎలాంటి సిఫార్సు లేకుండా తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే..వారికి ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన వసతి గదులు కేటాయింపు చేస్తోంది. ఇందు కోసం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహిస్తుండగా..వసతి గదులు ఖాళీలు బట్టి రాత్రి 9 వరకు గదులు కేటాయింపు ప్రకియ కొనసాగుతుంది. ఈ విధానం కారణంగా భక్తులు గంటల తరబడి క్యూ లైనులో వేచి వుండే అవసరం వుండదు. ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా కేవలం ఆధార్ కార్డు ఆధారంగా మాత్రమే వసతి గదులు కేటాయిస్తారు. దీనినే ఆయుధంగా మలుచుకున్నారు దోంగలు. నకీలి ఆధార్ కార్డులు సృష్టించి రోటేషన్ పద్ధతిలో వసతి గదులకు రిజిస్ట్రేషన్ చేసుకోని గదులు దొరకక.. సిఆర్వో కార్యాలయం వద్ద వేచి వుండే భక్తులకు అధిక మొత్తంలో వాటిని విక్రయించి డబ్బులు చేసుకుంటున్నారు. ఇలా శ్రీవారి భక్తులను మోసం చేస్తున్న ఆరుగురి సమాచారాన్ని గుర్తించి పోలీసులకు తెలిపారు టీటీడీ అధికారులు. దీంనితో కావు కాసిన పోలిసులు ఆరుగురిని అరెస్టు చేశారు. విచారణలో పోలీసులకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
- CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
- ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
శ్రీవారి భక్తులకు వసతి కష్టాలు తీర్చడానికి అధునాతనమైన సౌకర్యాలతో వేంకటాద్రి నిలయాని నిర్మించింది.125 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వసతి సముదాయంలో 5 వేల మంది భక్తులు సేదతీరే సౌలభ్యంతో పాటు తలనీలాలు సమర్పించడానికి కళ్యాణకట్టలతో పాటు వస్తువులు భధ్రపర్చడానికి లాకర్లు ఏర్పాటు చేసింది. ఇన్ని చేసిన టీటీడీ భక్తుల భధ్రత గురించి మాత్రం మర్చిపోయింది. తిరుమలంతా సీసీ కెమరాలు ఏర్పాటు చేసిన టీటీడీ.. అతి పెద్ద వసతి సముదాయంలో ఏర్పాటు చేయడం మాత్రం మర్చిపోయింది. దీంనితో దొంగలకు మంచి పని దోరికింది. భక్తులు ఆదమరిస్తే చాలు వారి సెల్ ఫోన్లు..నగదు మాయం చేస్తున్నారు. వేల మంది సంచరించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో..దొంగలను గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఇప్పటికే సెల్ ఫోన్లు మాయమవడం..వేల రూపాయలు నగదు చోరీకి గురైనట్లుగా పోలీసులకు అనేక ఫిర్యాదులు అందినా.. ఈ ఘటనలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు.
యాత్రికుల వసతి సముదాయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని టీటీడీ దృష్టికి తీసుకువెల్లినా..స్పందన మాత్రం లేదు. ఇలాంటి సమయంలో వసతి గదులు అక్రమంగా పొందుతున్న భక్తులే వసతి సముదాయంలో సేదతీరుతూ..సమయం వచ్చినప్పుడు భక్తులు చార్జింగ్ కోసం పెట్టిన సెల్ ఫోన్లు కాజేయడం.. వారి బ్యాగులు కొట్టేయడం చేస్తున్నారని గుర్తించారు. మొత్తానికి శ్రీవారి భక్తులు కోసం నిర్మించిన యాత్రికుల వసతి సముదాయమే… దొంగలకు స్వర్గధామంగా మారిపోయింది. ఇప్పటికైనా ఇటు టీటీడీ విజిలెన్స్.. అటు పోలీసులు అప్రమత్తం కాకపోతే శ్రీవారి భక్తులు మరింతగా మోసపోవలసి వస్తుంది.
తాజావార్తలు
-
Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
-
Nagarjuna: భట్టి మాటలతో ఆలోచనలో పడి పళ్ళ బురుసు సినిమా చేశాం
-
Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
-
CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!