TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Laddu Report: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం విదితమే కాగా.. తిరుమల లడ్డూ వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వానికి కీలక నివేదిక అందింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో లడ్డూ తయారీకి సంబంధించిన నెయ్యి నాణ్యత, సరఫరా విధానం వంటి అంశాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిటీ తన నివేదికను సమర్పించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో పనిచేసిన ఈ కమిటీ పరిశీలనలో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా అప్పటి ఈవో సింఘాల్ వ్యవహారశైలిపై కమిటీ విమర్శలు గుప్పించింది. నెయ్యి నాణ్యతలో కల్తీకి దారితీసిన పరిస్థితులను అడ్డుకోవడంలో ఆయన విఫలమయ్యారని నివేదికలో పేర్కొంది.
Read Also: Astrology: మే 1 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..!
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
అలాగే, సింఘాల్ ఆధ్వర్యంలో నెయ్యి కొనుగోలు మరియు వినియోగానికి సంబంధించిన నియమాలు సడలింపుకు గురయ్యాయని కమిటీ గుర్తించింది. ఈ సడలింపులు వ్యవస్థలో లోపాలకు కారణమయ్యాయని నివేదిక స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ అంశంపై బోర్డును ప్రశ్నించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, సింఘాల్ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని కమిటీ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కమిటీ పలు సూచనలు చేసింది. ముఖ్యంగా టీటీడీకి నెయ్యి సరఫరా ప్రక్రియ పారదర్శకంగా, లోపరహితంగా ఉండాలని సూచించింది. టెండర్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, సరఫరాదారుల ఎంపికలో కఠిన ప్రమాణాలు పాటించాలని దినేష్ కుమార్ కమిటీ సూచించింది. అయితే, ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. తిరుమల లడ్డూ నాణ్యతపై భక్తుల్లో ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం ఈ చర్యలు కీలకంగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!