TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Laddu Report: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం విదితమే కాగా.. తిరుమల లడ్డూ వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వానికి కీలక నివేదిక అందింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో లడ్డూ తయారీకి సంబంధించిన నెయ్యి నాణ్యత, సరఫరా విధానం వంటి అంశాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిటీ తన నివేదికను సమర్పించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో పనిచేసిన ఈ కమిటీ పరిశీలనలో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా అప్పటి ఈవో సింఘాల్ వ్యవహారశైలిపై కమిటీ విమర్శలు గుప్పించింది. నెయ్యి నాణ్యతలో కల్తీకి దారితీసిన పరిస్థితులను అడ్డుకోవడంలో ఆయన విఫలమయ్యారని నివేదికలో పేర్కొంది.
Read Also: Astrology: మే 1 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..!
Also Read
- Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
- Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
అలాగే, సింఘాల్ ఆధ్వర్యంలో నెయ్యి కొనుగోలు మరియు వినియోగానికి సంబంధించిన నియమాలు సడలింపుకు గురయ్యాయని కమిటీ గుర్తించింది. ఈ సడలింపులు వ్యవస్థలో లోపాలకు కారణమయ్యాయని నివేదిక స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ అంశంపై బోర్డును ప్రశ్నించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, సింఘాల్ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని కమిటీ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కమిటీ పలు సూచనలు చేసింది. ముఖ్యంగా టీటీడీకి నెయ్యి సరఫరా ప్రక్రియ పారదర్శకంగా, లోపరహితంగా ఉండాలని సూచించింది. టెండర్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, సరఫరాదారుల ఎంపికలో కఠిన ప్రమాణాలు పాటించాలని దినేష్ కుమార్ కమిటీ సూచించింది. అయితే, ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. తిరుమల లడ్డూ నాణ్యతపై భక్తుల్లో ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం ఈ చర్యలు కీలకంగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్గా తమిళ సిరీస్!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
ట్రెండింగ్
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!