TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Laddu Report: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం విదితమే కాగా.. తిరుమల లడ్డూ వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వానికి కీలక నివేదిక అందింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో లడ్డూ తయారీకి సంబంధించిన నెయ్యి నాణ్యత, సరఫరా విధానం వంటి అంశాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిటీ తన నివేదికను సమర్పించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో పనిచేసిన ఈ కమిటీ పరిశీలనలో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా అప్పటి ఈవో సింఘాల్ వ్యవహారశైలిపై కమిటీ విమర్శలు గుప్పించింది. నెయ్యి నాణ్యతలో కల్తీకి దారితీసిన పరిస్థితులను అడ్డుకోవడంలో ఆయన విఫలమయ్యారని నివేదికలో పేర్కొంది.
Read Also: Astrology: మే 1 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..!
Also Read
అలాగే, సింఘాల్ ఆధ్వర్యంలో నెయ్యి కొనుగోలు మరియు వినియోగానికి సంబంధించిన నియమాలు సడలింపుకు గురయ్యాయని కమిటీ గుర్తించింది. ఈ సడలింపులు వ్యవస్థలో లోపాలకు కారణమయ్యాయని నివేదిక స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ అంశంపై బోర్డును ప్రశ్నించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, సింఘాల్ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని కమిటీ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కమిటీ పలు సూచనలు చేసింది. ముఖ్యంగా టీటీడీకి నెయ్యి సరఫరా ప్రక్రియ పారదర్శకంగా, లోపరహితంగా ఉండాలని సూచించింది. టెండర్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, సరఫరాదారుల ఎంపికలో కఠిన ప్రమాణాలు పాటించాలని దినేష్ కుమార్ కమిటీ సూచించింది. అయితే, ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. తిరుమల లడ్డూ నాణ్యతపై భక్తుల్లో ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం ఈ చర్యలు కీలకంగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
-
SKN: కెరీర్ మన క్రష్ అయినప్పుడు ఏ క్రష్ అయినా మన వెంట రావాల్సిందే
-
IMD Warning: జూలైలో వర్షాలు నిరాశాజనకంగా ఉంటాయి.. ద్రవ్యోల్బణంపై బిగ్ అలర్ట్
-
Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
-
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు ‘రైతు భరోసా’ నిధులు విడుదల!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!