Tirumala: తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు.. టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో రెండు నెలల్లో శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బుక్లెట్లను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్రెడ్డి, ఈవో ధర్మారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ ఏడాది అధిక మాసం కారణంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 18న ధ్వజారోహణం సందర్భంగా శ్రీవేంకటేశ్వర స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. అలాగే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. సామాన్య భక్తులకు వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం సంతృప్తికరంగా ఉంటుందన్నారు. విరామ సందర్శనల కోసం సిఫార్సు లేఖలు ఆమోదించబడవు. ఉభయ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. సెప్టెంబర్ 22న గరుడసేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజారోహణం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి వాహనసేవలను దర్శించుకోవాలని చైర్మన్ కోరారు.
Also Read
- Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
మరోవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నా.. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. పెయింటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.. పుష్కరిణి మరమ్మతులు పూర్తయిన క్రమంలో నీటిని నింపుతున్నారు. పుష్కరిణి గ్రిల్ను రసాయనాలతో శుభ్రం చేస్తున్నారు. ఆలయ గోపురానికి రంగులు వేయడం పూర్తి కావడంతో విద్యుత్తు అలంకరణ ఏర్పాట్లు చేస్తున్నారు. మహారథానికి మరమ్మతులు చేసి రంగులు వేస్తున్నారు. శ్రీవారి ఆలయం ముందు బారికేడ్లు, గ్యాలరీల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. తిరుమలలో ముఖ్యమైన కూడళ్లు, రోడ్లకు ఇరువైపులా చెట్లు, ఫుట్ పాత్ గోడలను విద్యుత్తుతో అలంకరించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం టీటీడీ ధర్మకర్తల మండలిలో ఆరుగురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాలవలవన్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా, వై సీతారామి రెడ్డి, బాలసుబ్రమణ్యం పళనిస్వామి, ఆర్ వెంకటసుబ్బారెడ్డి, సిద్దవటం యానాదయ్య, సిద్ద వీరవెంకట సుధీర్ కుమార్ ధర్మకర్తల మండలి సభ్యులుగా ఉన్నారు. శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో టీటీడీ జేఈవో శ్రీవీరబ్రహ్మం ప్రమాణం చేయించారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం జేఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.
తాజావార్తలు
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!