Tirumala: తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు.. టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో రెండు నెలల్లో శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బుక్లెట్లను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్రెడ్డి, ఈవో ధర్మారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ ఏడాది అధిక మాసం కారణంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 18న ధ్వజారోహణం సందర్భంగా శ్రీవేంకటేశ్వర స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. అలాగే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. సామాన్య భక్తులకు వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం సంతృప్తికరంగా ఉంటుందన్నారు. విరామ సందర్శనల కోసం సిఫార్సు లేఖలు ఆమోదించబడవు. ఉభయ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. సెప్టెంబర్ 22న గరుడసేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజారోహణం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి వాహనసేవలను దర్శించుకోవాలని చైర్మన్ కోరారు.
Also Read
- Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
- YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
మరోవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నా.. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. పెయింటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.. పుష్కరిణి మరమ్మతులు పూర్తయిన క్రమంలో నీటిని నింపుతున్నారు. పుష్కరిణి గ్రిల్ను రసాయనాలతో శుభ్రం చేస్తున్నారు. ఆలయ గోపురానికి రంగులు వేయడం పూర్తి కావడంతో విద్యుత్తు అలంకరణ ఏర్పాట్లు చేస్తున్నారు. మహారథానికి మరమ్మతులు చేసి రంగులు వేస్తున్నారు. శ్రీవారి ఆలయం ముందు బారికేడ్లు, గ్యాలరీల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. తిరుమలలో ముఖ్యమైన కూడళ్లు, రోడ్లకు ఇరువైపులా చెట్లు, ఫుట్ పాత్ గోడలను విద్యుత్తుతో అలంకరించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం టీటీడీ ధర్మకర్తల మండలిలో ఆరుగురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాలవలవన్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా, వై సీతారామి రెడ్డి, బాలసుబ్రమణ్యం పళనిస్వామి, ఆర్ వెంకటసుబ్బారెడ్డి, సిద్దవటం యానాదయ్య, సిద్ద వీరవెంకట సుధీర్ కుమార్ ధర్మకర్తల మండలి సభ్యులుగా ఉన్నారు. శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో టీటీడీ జేఈవో శ్రీవీరబ్రహ్మం ప్రమాణం చేయించారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం జేఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.
తాజావార్తలు
-
OPPO Find X9s: ఒప్పో ఫైండ్ X9s వచ్చేసింది.. 50MP కెమెరా, 7025mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
-
PMO Official Gifts: మెలోడీ చాక్లెట్ వివాదం.. విదేశీ పర్యటనల్లో ప్రధాని ఇచ్చిన కానుకల వివరాలు వెల్లడించిన పీఎంఓ
-
YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
-
OPPO Find X9 Ultra: 200MP కెమెరా, 7050mAh బ్యాటరీతో.. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా రిలీజ్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!