Tiger Nageswara Rao : అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీ లోకి రాబోతున్న టైగర్ నాగేశ్వరరావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు.. ఈ సినిమా అక్టోబర్ 19 న దసరా కానుకగా విడుదల అయింది..భారీ అంచనాలతో పాన్ ఇండియన్ లెవెల్లో విడుదల అయిన ఈ మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్గా నిలిచింది. తెలుగులో ఓ మోస్తారు కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ హిందీతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో అంతగా ప్రభావాన్ని చూపలేకపోయింది. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రవితేజ సరసన నుపూర్సనన్ మరియు గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. అలాగే రేణుదేశాయ్, అనుపమ్ఖేర్ కీలక పాత్రలు పోషించారు. టైగర్ నాగేశ్వరావు తర్వాత ఈగల్ మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రవితేజ.అయితే టైగర్ నాగేశ్వరరావు మూవీ అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదట ఈ సినిమాను డిసెంబర్లో ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు.సినిమా రిజల్ట్ కారణంగా ఈ నిర్ణయంలో మార్పు జరిగినట్లు తెలిసింది.
నవంబర్ లాస్ట్ వీక్లో టైగర్ నాగేశ్వరరావు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. నవంబర్ 24న ఈ బయోపిక్ మూవీ ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.టైగర్ నాగేశ్వరరావు ఓటీటీ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ దాదాపు 15 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం… 1980 దశకంలో తెలుగు రాష్ట్రాల్లో పేరు మోసిన గజదొంగగా పిలువబడిన స్టూవర్ట్పురం నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఫిక్షనల్ బయోపిక్గా టైగర్ నాగేశ్వరరావు సినిమాను డైరెక్టర్ వంశీ తెరకెక్కించాడు.అయితే ఈ సినిమాకు రన్ టైం బాగా మైనస్ గా మారింది. దాదాపు మూడు గంటలకు పైగా వున్న ఈ సినిమాలో కొన్ని లాగ్ సీన్స్ ఉండటంతో సినిమా చూసే ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి.. ప్రేక్షకుల కోరిక మేరకు ఈ సినిమా రన్ టైం ను మేకర్స్ 2 గంటల 37 నిముషాలకు కుదించారు..అలాగే ఈ సినిమాలో రవితేజ యాక్టింగ్ అదరగొట్టారు.. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ ఈ సినిమా కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాలేకపోయింది..
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
- Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
- Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
తాజావార్తలు
-
Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
-
Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
-
Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
-
Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
-
Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!