Tadipatri Tension: అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలపై మూడు కేసులు నమోదు అయ్యాయి. పరస్పరం ఒకరిపై మరొకరు పోలీస్ కేసులు పెట్టుకున్నారు.. కాగా, జేసీ, పెద్దారెడ్డి కుటుంబాల మధ్య జరిగిన దాడిలో గాయపడిన కానిస్టేబుల్ కమల్ భాష ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఆయన కుమారుడు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అష్మిత్ రెడ్డిలతో పాటు మరి కొందరిపై 147, 148, 188, 353, 332 r/w, 149 IPC, 125 RP యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
Read Also: Road Accident : అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి
మరోవైపు, జేసీ అష్మిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఆయన కుమారులు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, కేతిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డిలతో పాటు మరో వంద మందిపై 147, 148, 506, 188, 324, 427r/w, 144 ఐపీసీ సెక్షన్లు 125 RP యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకో వైపు, కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఫిర్యాదు మేరకు జేసీ అష్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, దీపక్ రెడ్డి, జేసీ పవన్ కుమార్ రెడ్డిలతో పాటు మరి కొంత మందిపై 147, 148, 506, 188, 324, 427r/w, 144 ఐపీసీ సెక్షన్లు, 125 RP యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.