Drown in Canal: కడప జిల్లాలో విషాదం.. ఈత కోసం వెళ్లి ముగ్గురు మృతి
Drown in Canal: వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి మండలం అలవలపాడులో విషాదం చోటుచేసుకుంది. అలవలపాడులో ఆదివారం ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. వేముల మండలం వేల్పులకు చెందిన జ్ఞానయ్య(25), అలవపాడుకు చెందిన సాయి సుశాంత్(8), సాయి తేజ(11), చిన్నారుల మేనమామ శశికుమార్ గాలేరు నగరి సుజల స్రవంతి కెనాల్లోకి ఈతకు వెళ్లారు. సమీపంలోని జీఎన్ఎస్ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందగా.. గ్రామస్థులు వారి ముగ్గురిని వెలికి తీసి వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Read Also: Dispute : అత్తను చంపి అడ్డులేదనుకుంది.. సీన్ రివర్స్ అవుతుందని ఊహించలేకపోయింది
Also Read
అసలెలా జరిగిందంటే.. సాయితేజ, సుశాంత్ల అమ్మ మృతి చెందడంతో అలవలపాడులోని అమ్మమ్మ ఇంటికి వచ్చి ఉంటున్నారు. బంధువైన జ్ఞానయ్య ఈస్టర్ పండుగకు వీరి ఇంటికి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆ పిల్లలకు మేనమామ అయిన శశికుమార్తో కలిసి అందరూ కాలువలో ఈతకు వెళ్లారు. కాలువ లోతు ఎక్కువగా ఉండటంతో శశికుమార్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరగా.. మిగిలిన ముగ్గురూ ఊపిరాడక మృతి చెందారు. విషయం తెలుసుకున్న వేంపల్లి ఎస్సై తిరుపాల్ నాయక్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
-
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!