Uttar Pradesh: మామిడికాయల కోసమని వెళ్లిన చిన్నారులపై తోటమాలి దారుణ చర్య..
- ఉత్తరప్రదేశ్లోని పిపారియా గురు గోవింద్ రాయ్ గ్రామంలో దారుణం
- చిన్నారులను చెట్టుకు కట్టేసి నోటిలో మామిడి కాయ కొట్టిన తోటమాలి
- ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్
- తోటమాలిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని పిపారియా గురు గోవింద్ రాయ్ గ్రామంలో ఓ తోటమాలి దారుణ ఘటనకు పాల్పడ్డాడు. మామిడికాయలు కోయడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులపై బరితెగించాడు. తోటమాలి పిల్లలను తాడుతో చెట్టుకు కట్టేసి కొట్టాడు. ఈ వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు మేలుకుని.. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అనంతరం తోటమాలిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.
ఈ ఘటన బుధవారం ఉదయం 10 గంటల సమయంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం పూట వాకింగ్ కు వెళ్లిన ముగ్గురు పిల్లలు పక్కనే ఉన్న మామిడి తోటలోకి వెళ్లారు. అక్కడ రాలిన కాయలను ఏరుకుంటుండగా.. పిల్లలు మామిడి కాయలను దొంగలిస్తున్నారనే ఉద్దేశ్యంతో తోటమాలి అక్కడకు వచ్చాడు. వచ్చి అంతటితో ఆగకుండా.. ముగ్గురు పిల్లలను పట్టుకుని చెట్టుకు తాడుతో కట్టేశాడు. ఆ తర్వాత వారి నోట్లో మామిడికాయలు కుక్కి మరీ చితకబాదాడు.
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
- AI Robot: మునిగిపోతున్న వారిని రక్షించే ఏఐ రోబోట్ ప్రయోగం విజయవంతం
IAS Vivek Yadav: ఏపీ సీఈవోగా సీనియర్ ఐఏఎస్ వివేక్ యాదవ్..
అయితే.. పిల్లలను చెట్టుకు కట్టేసి కొడుతున్నాడన్న సమాచారం గ్రామస్తులకు తెలిసి అక్కడ గుమిగూడారు. అక్కడే ఉన్న ఒకరు ఈ ఘటనను వీడియో తీశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న చిన్నారుల తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుని పిల్లలను తీసుకుని కలిసి ఇంటికి వెళ్లారు. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు క్షేత్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. తోటమాలి సహా ముగ్గురు వ్యక్తులు పిల్లలను కట్టేసి కొట్టారని ఆరోపిస్తూ ఓ చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తోటమాలిపై చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లి డిమాండ్ చేసింది.
ఈ క్రమంలో.. చౌక్ పోలీస్ స్టేషన్లో తోట తోటమాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లలను బంధించి చిత్రహింసలు పెట్టినందుకు మామిడి తోట యజమాని సుదర్శన్పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీస్ స్టేషన్ హెడ్ ప్రశాంత్ కుమార్ పాఠక్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత నిందితుడిపై చర్యలు తీసుకుంటామన్నారు.
తాజావార్తలు
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
-
Dil Raju: రాకింగ్ స్టార్ యశ్తో దిల్ రాజు సినిమా కన్ఫర్మ్.. కానీ!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!