Uttar Pradesh: మామిడికాయల కోసమని వెళ్లిన చిన్నారులపై తోటమాలి దారుణ చర్య..
- ఉత్తరప్రదేశ్లోని పిపారియా గురు గోవింద్ రాయ్ గ్రామంలో దారుణం
- చిన్నారులను చెట్టుకు కట్టేసి నోటిలో మామిడి కాయ కొట్టిన తోటమాలి
- ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్
- తోటమాలిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టిన పోలీసులు.
ఉత్తరప్రదేశ్లోని పిపారియా గురు గోవింద్ రాయ్ గ్రామంలో ఓ తోటమాలి దారుణ ఘటనకు పాల్పడ్డాడు. మామిడికాయలు కోయడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులపై బరితెగించాడు. తోటమాలి పిల్లలను తాడుతో చెట్టుకు కట్టేసి కొట్టాడు. ఈ వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు మేలుకుని.. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అనంతరం తోటమాలిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.
ఈ ఘటన బుధవారం ఉదయం 10 గంటల సమయంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం పూట వాకింగ్ కు వెళ్లిన ముగ్గురు పిల్లలు పక్కనే ఉన్న మామిడి తోటలోకి వెళ్లారు. అక్కడ రాలిన కాయలను ఏరుకుంటుండగా.. పిల్లలు మామిడి కాయలను దొంగలిస్తున్నారనే ఉద్దేశ్యంతో తోటమాలి అక్కడకు వచ్చాడు. వచ్చి అంతటితో ఆగకుండా.. ముగ్గురు పిల్లలను పట్టుకుని చెట్టుకు తాడుతో కట్టేశాడు. ఆ తర్వాత వారి నోట్లో మామిడికాయలు కుక్కి మరీ చితకబాదాడు.
Also Read
- Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
- Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
IAS Vivek Yadav: ఏపీ సీఈవోగా సీనియర్ ఐఏఎస్ వివేక్ యాదవ్..
అయితే.. పిల్లలను చెట్టుకు కట్టేసి కొడుతున్నాడన్న సమాచారం గ్రామస్తులకు తెలిసి అక్కడ గుమిగూడారు. అక్కడే ఉన్న ఒకరు ఈ ఘటనను వీడియో తీశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న చిన్నారుల తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుని పిల్లలను తీసుకుని కలిసి ఇంటికి వెళ్లారు. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు క్షేత్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. తోటమాలి సహా ముగ్గురు వ్యక్తులు పిల్లలను కట్టేసి కొట్టారని ఆరోపిస్తూ ఓ చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తోటమాలిపై చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లి డిమాండ్ చేసింది.
ఈ క్రమంలో.. చౌక్ పోలీస్ స్టేషన్లో తోట తోటమాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లలను బంధించి చిత్రహింసలు పెట్టినందుకు మామిడి తోట యజమాని సుదర్శన్పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీస్ స్టేషన్ హెడ్ ప్రశాంత్ కుమార్ పాఠక్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత నిందితుడిపై చర్యలు తీసుకుంటామన్నారు.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!