Bigg Boss Telugu : ఇకపై అవి రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫైనల్ ఎంతో గ్రాండ్ గా ముగిసింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. డిసెంబర్ 17న జరిగిన గ్రాండ్ ఫినాలే తర్వాత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ భారీగా వచ్చి చేరుకున్నారు.మరోవైపు రన్నరప్ అమర్ దీప్ చౌదరి ఫ్యాన్స్ కూడా అక్కడే గుమిగూడి వున్నారు.. ఈ క్రమంలో అమర్ దీప్ని ఒక గేట్ నుంచి, ప్రశాంత్ను మరో గేట్ నుంచి పంపించారు పోలీసులు.అమర్ దీప్ సైలెంట్గా వెళ్లిపోయాడు. కానీ అతని కుటుంబం పయనిస్తున్న కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. మరోవైపు శాంతి భద్రల నేపథ్యంలో ప్రశాంత్ను వెళ్లిపోమ్మంటే.. నేను దొంగతనం చేసానా నేనేందుకు వెళ్లాలి. రైతుబిడ్డకు గౌరవం ఇవ్వట్లేదు అని పోలీసులపై పల్లవి ప్రశాంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా వెళ్లిన ప్రశాంత్ మళ్లీ ఓపెన్ టాప్ జీప్లో వచ్చి ర్యాలీ చేసాడు.దాంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఇలా శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా చేసిన పల్లవి ప్రశాంత్పై పోలీసులు కేసు నమోదు చేశారు. 14 రోజులు రిమాండ్ కూడా విధించారు. నాలుగు రోజులు చంచల్ గూడా జైలులో గడిపిన ప్రశాంత్ ఇటీవలే బెయిల్ మీద బయటకొచ్చాడు. ఈ కేసు విషయంపై బిగ్ బాస్ నిర్వాహకులకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే బిగ్ బాస్ పై తీవ్ర వ్యతిరేకత వస్తుండగా తాజాగా పోలీసుల నోటీసులు షో నిర్వహకులకు తలనొప్పిగా మారింది.ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు షో నిర్వాహకులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇకపై షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరూ కూడా ర్యాలీలు వంటివి చేయకూడదని నిర్ణయించారట. ఈ విషయాన్ని అగ్రిమెంట్లో కూడా పొందుపరచనున్నారని సమాచారం. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. అయితే పల్లవి ప్రశాంత్ కారణంగా బిగ్ బాస్ ఆర్గనైజర్స్ షాకింగ్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
- Tags
- Bigg Boss
- Reality Show
- Telugu
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!