World Cup 2023: ప్రపంచకప్ 2023లో సెమీఫైనల్ బెర్త్లు అధికారకంగా ఖరారయ్యాయి. సెమీఫైనల్స్లో భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడననున్నాయి. టోర్నీ నుంచి పాకిస్తాన్ నిష్కమ్రిచండంతో న్యూజిలాండ్ నాలుగో జట్టుగా సెమీస్కు అర్హత సాధించింది. వచ్చే వారంలో జరగనున్న రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్లు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయో తెలుసుకుందాం.
Read Also: Viral Video: బ్యాట్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న బ్యాట్స్మెన్లు.. వీడియో వైరల్
ఈ ప్రపంచకప్లో తొలి సెమీఫైనల్ మ్యాచ్ భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నవంబర్ 15న ఈ మ్యాచ్ జరగనుంది. ఈ ప్రపంచకప్లో రెండో సెమీఫైనల్ మ్యాచ్ నవంబర్ 16న కోల్కతా ఈడెన్గార్డెన్స్లో జరుగనుంది. దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇదిలా ఉంటే.. 2019 వరల్డ్కప్ సెమీఫైనల్లోనూ భారత్-న్యూజిలాండ్ తలపడ్డాయి. అప్పుడు జరిగిన మ్యాచ్లో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఇప్పుడున్న ఫాంలో అయితే టీమిండియాకే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరీ ఈసారి సెమీస్ లో కివీస్ పై విజయం సాధిస్తుందో లేదో….
Read Also: Haris Rauf: పాకిస్తాన్ బౌలర్ చెత్త రికార్డు.. వరల్డ్ కప్ చరిత్రలోనే..!