IND vs BAN: భారత్ – బంగ్లాదేశ్ మధ్య జరిగిన కీలక ఒప్పందాలు ఇవే…
- భారత పర్యటనలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
- సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య చర్చ
- డిజిటల్ డొమైన్.. మారిటైమ్ డొమైన్.. రైల్వే కనెక్టివిటీ తదితర ఒప్పందాలపై సంతాకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత పర్యటనలో ఉన్నారు. షేక్ హసీనాతో చర్చల అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించేందుకు భారత్, బంగ్లాదేశ్లు అంగీకరించాయని, మొత్తం సంబంధాలను పెంపొందించేందుకు భవిష్యత్తు దృష్టిని రూపొందించుకున్నాయని చెప్పారు. బంగ్లాదేశ్ భారతదేశానికి అతిపెద్ద అభివృద్ధి భాగస్వామి అని, ఆ దేశంతో సంబంధాలకు భారత్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కొత్త రంగాలలో భారతదేశం-బంగ్లాదేశ్ సహకారానికి భవిష్యత్తు దార్శనికత సిద్ధమైందని ప్రధాని మోడీ తెలిపారు. డిజిటల్ డొమైన్, మారిటైమ్ డొమైన్, రైల్వే కనెక్టివిటీ రంగాలతో సహా విస్తృత ఆధారిత సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరుపక్షాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
READ MORE: Joint Pains : కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వీటిని మీ ఆహారంలో చేర్చేసుకోండి..
Also Read
రక్షణ ఉత్పత్తి, సాయుధ బలగాల ఆధునీకరణ రంగాలతో సహా రక్షణ సహకారాన్ని ప్రోత్సహించడంపై విస్తృత చర్చ జరుగుతోందని ప్రధాని తెలిపారు. ఇండో-పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్లో చేరాలన్న బంగ్లాదేశ్ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అదే సమయంలో, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మాట్లాడుతూ.. భారతదేశం తమకు ప్రధాన పొరుగు దేశమన్నారు. నమ్మకమైన దేశమని.. ప్రాంతీయ భాగస్వామి అని కొనియాడారు. 1971 విముక్తి యుద్ధంతో ప్రారంభమైన భారత్తో సంబంధాలకు బంగ్లాదేశ్ చాలా ప్రాముఖ్యతనిస్తుంది.
READ MORE: Darshan Case: రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీకి యాక్టర్ దర్శన్..
భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగిన ముఖ్యమైన ఒప్పందాలు…
1- బంగ్లాదేశ్ వైద్య రోగులకు E-వీసా
2- బంగ్లాదేశ్లోని రంగ్పూర్లో కొత్త అసిస్టెంట్ హైకమిషన్ ఆఫ్ ఇండియా
3- రాజ్షాహి మరియు కోల్కతా మధ్య కొత్త రైలు సర్వీస్
4- చిట్టగాంగ్ మరియు కోల్కతా మధ్య కొత్త బస్సు సర్వీస్
5- గెడే-దర్శనా మరియు హల్దీబారి-చిలహతి మధ్య దల్గావ్ వరకు గూడ్స్ రైలు సేవలు ప్రారంభం.
6- గ్రాంట్ సహాయం కింద సిరాజ్గంజ్లో ఇన్ల్యాండ్ కంటైనర్ డిపో (ICD) నిర్మాణం.
7- భారత గ్రిడ్ ద్వారా నేపాల్ నుండి బంగ్లాదేశ్కు 40 మెగావాట్ల విద్యుత్ ఎగుమతి ప్రారంభం.
8- గంగా జల ఒప్పందం పునరుద్ధరణపై చర్చించేందుకు జాయింట్ టెక్నికల్ కమిటీ
9- బంగ్లాదేశ్లోని తీస్తా నది పరిరక్షణ మరియు నిర్వహణపై ప్రాజెక్ట్ కోసం బంగ్లాదేశ్కు సాంకేతిక ప్రతినిధి బృందం సందర్శన.
బంగ్లాదేశ్ పోలీసు అధికారులకు 10- 350 శిక్షణా విభాగాలు
11- వైద్య రోగుల కోసం ముక్తిజోద్ధ పథకం, దీని గరిష్ట పరిమితి రోగికి సంవత్సరానికి రూ. 8 లక్షలు.
12- ఇండో-పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్లో బంగ్లాదేశ్ చేరింది
13- UPI ప్రారంభించడం కోసం NPCI మరియు బంగ్లాదేశ్ బ్యాంక్ మధ్య వాణిజ్య ఒప్పందం
తాజావార్తలు
-
Bengal’s Next CM: బెంగాల్లో మే 9న బీజేపీ ప్రభుత్వం.. సువేందుకే సీఎంగా ఛాన్స్..
-
Peddi: కథ విన్నాక 25 నిమిషాల పాటు తేరుకోలేకపోయా!
-
Vijay-Governor: కాసేపట్లో గవర్నర్ను కలవనున్న విజయ్
-
Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
-
Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి ‘ది ఎండ్’?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!